అనేక రాష్ట్రాల ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంటున్న ఎంఐఎం ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బీహార్ ఎన్నికలు, గుజరాత్ ఎన్నికలు అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసి మంచి ఫలితాలనే సాధించింది. మరీ బీహార్ ఎన్నికల్లో అయితే గణనీయమైన విజయాలను కూడా సాధించింది. అదే ఊపులో ఇపుడు పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో కూడా పోటీచేసింది.
ఏ రాష్ట్రంలో పోటీచేసినా ప్రధానంగా ముస్లిం మైనారిటి ఓట్లపైనే దృష్టిపెట్టింది. అదేపద్దతిలో ఇపుడు కూడా ముస్లిం ఓటర్లపైనే దృష్టిపెట్టింది. ఇందులో కూడా పశ్చిమబెంగాల్లో పోటీ చేయటాన్ని ప్రధానంగా టార్గెట్ గా తీసుకుంది. తమిళనాడులో పోటీచేసిన మూడు స్ధానాల్లోను ఓడిపోయింది. అలాగే బెంగాల్లో ఏడుచోట్ల పోటీచేసింది. అయితే ఎక్కడా గెలవలేదు. అలాగే అస్సాంలో పోటీచేసిన అన్నీ నియోజకవర్గాల్లో కూడా వెనకబడేఉంది.
మొత్తంమీద ఎంఐఎం హవాకు బ్రేకులు పడిందనే చెప్పాలి. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటిలో మొదలైన ఎంఐఎం ప్రస్ధానం మెల్లిగా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైంది. పోటీచేసిన కొన్ని రాష్ట్రాల్లో స్ధానిక పరిస్ధితుల ఆధారంగా మంచి ఫలితాలనే సాధించింది. అయితే ఇపుడు మాత్రం నూరుశాతం బోల్తాపడింది.
This post was last modified on May 2, 2021 3:25 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…