అనేక రాష్ట్రాల ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంటున్న ఎంఐఎం ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బీహార్ ఎన్నికలు, గుజరాత్ ఎన్నికలు అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసి మంచి ఫలితాలనే సాధించింది. మరీ బీహార్ ఎన్నికల్లో అయితే గణనీయమైన విజయాలను కూడా సాధించింది. అదే ఊపులో ఇపుడు పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో కూడా పోటీచేసింది.
ఏ రాష్ట్రంలో పోటీచేసినా ప్రధానంగా ముస్లిం మైనారిటి ఓట్లపైనే దృష్టిపెట్టింది. అదేపద్దతిలో ఇపుడు కూడా ముస్లిం ఓటర్లపైనే దృష్టిపెట్టింది. ఇందులో కూడా పశ్చిమబెంగాల్లో పోటీ చేయటాన్ని ప్రధానంగా టార్గెట్ గా తీసుకుంది. తమిళనాడులో పోటీచేసిన మూడు స్ధానాల్లోను ఓడిపోయింది. అలాగే బెంగాల్లో ఏడుచోట్ల పోటీచేసింది. అయితే ఎక్కడా గెలవలేదు. అలాగే అస్సాంలో పోటీచేసిన అన్నీ నియోజకవర్గాల్లో కూడా వెనకబడేఉంది.
మొత్తంమీద ఎంఐఎం హవాకు బ్రేకులు పడిందనే చెప్పాలి. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటిలో మొదలైన ఎంఐఎం ప్రస్ధానం మెల్లిగా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైంది. పోటీచేసిన కొన్ని రాష్ట్రాల్లో స్ధానిక పరిస్ధితుల ఆధారంగా మంచి ఫలితాలనే సాధించింది. అయితే ఇపుడు మాత్రం నూరుశాతం బోల్తాపడింది.
This post was last modified on May 2, 2021 3:25 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…