అనేక రాష్ట్రాల ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంటున్న ఎంఐఎం ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బీహార్ ఎన్నికలు, గుజరాత్ ఎన్నికలు అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసి మంచి ఫలితాలనే సాధించింది. మరీ బీహార్ ఎన్నికల్లో అయితే గణనీయమైన విజయాలను కూడా సాధించింది. అదే ఊపులో ఇపుడు పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో కూడా పోటీచేసింది.
ఏ రాష్ట్రంలో పోటీచేసినా ప్రధానంగా ముస్లిం మైనారిటి ఓట్లపైనే దృష్టిపెట్టింది. అదేపద్దతిలో ఇపుడు కూడా ముస్లిం ఓటర్లపైనే దృష్టిపెట్టింది. ఇందులో కూడా పశ్చిమబెంగాల్లో పోటీ చేయటాన్ని ప్రధానంగా టార్గెట్ గా తీసుకుంది. తమిళనాడులో పోటీచేసిన మూడు స్ధానాల్లోను ఓడిపోయింది. అలాగే బెంగాల్లో ఏడుచోట్ల పోటీచేసింది. అయితే ఎక్కడా గెలవలేదు. అలాగే అస్సాంలో పోటీచేసిన అన్నీ నియోజకవర్గాల్లో కూడా వెనకబడేఉంది.
మొత్తంమీద ఎంఐఎం హవాకు బ్రేకులు పడిందనే చెప్పాలి. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటిలో మొదలైన ఎంఐఎం ప్రస్ధానం మెల్లిగా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైంది. పోటీచేసిన కొన్ని రాష్ట్రాల్లో స్ధానిక పరిస్ధితుల ఆధారంగా మంచి ఫలితాలనే సాధించింది. అయితే ఇపుడు మాత్రం నూరుశాతం బోల్తాపడింది.
This post was last modified on May 2, 2021 3:25 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…