అవును తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీనియర్ నేత, మంత్రి ఈటల రాజేందర్ అత్యంత అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. భూకబ్జాలు, అధికార దుర్వినియోగం ముద్రవేసి ఈటల నుండి వైద్య, ఆరోగ్య శాఖలను తీసేశారు. ఆరోపణలు రావటం, విచారణకు ఆదేశించటం, చీఫ్ సెక్రటరీ, విజిలెన్స్ డీజీ వెంటనే విచారణ చేయించటం, భూకబ్జాలు నిజమే అని నిర్ధారించటం చకచక జరిగిపోయాయి. ఆ వెంటనే ఈటల నిర్వహిస్తున్న శాఖలను తీసేస్తున్నట్లు కేసీయార్ చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించారు.
అంటే ఈటల ఇపుడు శాఖలేని మంత్రన్నమాట. సమీక్షలు నిర్వహించేందుకు లేదు. మంత్రివర్గ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది సస్పెన్సుగా మిగిలిపోయింది. శాఖలేని మంత్రి కాబట్టి ఏ శాఖకు చెందిన ఉన్నతాధికారి కూడా మంత్రిని పట్టించుకోరు. ఇలా ఎన్ని రోజులుండాలో కూడా ఈటలకు అర్ధం కావటంలేదు. నిజంగా మంత్రికి ఈ పరిస్ధితి చాలా అవమానమనే చెప్పాలి. ఒకవిధంగా మంత్రి ఈటల త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లే అనుకోవాలి.
ఈటల వ్యవహారం తెలంగాణాలో ఇంతగా చర్చకు రావటానికి కారణం మంత్రి బలమైన బీసీ వర్గానికి చెందిన నేత కావటమే. రాష్ట్రంలోని బీసీ వర్గాల్లోని నేతలతో పాటు రాజకీయాలకు అతీతంగా కేసీయార్ ను వ్యతిరేకించే వారంతా ఈటలకు మద్దతుగా నిలబడ్డారు. దాంతో ఈటల విషయం రాజకీయంగా బాగా వివాదమవుతోంది. మరిలాంటి పరిస్ధితుల్లో మంత్రి పదవికి తానే రాజీనామా చేస్తారా ? లేకపోతే కేసీయార్ తో బర్తరఫ్ చేయించుకుంటారా అన్నదే తేలాలి.
ఏదేమైనా భూకబ్జాల ఆరోపణలు, నిర్ధారణపై మీడియాతో మాట్లాడిన ఈటల కాస్త సంయమనంగానే వ్యవహరించారు. ప్రభుత్వాన్ని కానీ కేసీయార్ ను కానీ ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. గడచిన ఏడేళ్ళల్లో టీఆర్ఎస్ లో మంత్రులు, ఎంఎల్ఏలుగా పనిచేసిన 72 మందిపై ఇదే విధమైన ఆరోపణలున్నట్లు బీజేపీ నేతలంటున్నారు. అలాంటిది ఎవరిపైనా చేయించని విచారణలు ఒక్క ఈటల విషయంలోనే ఎందుకు జరిగిందని కమలం నేతలు నిలదీస్తున్నారు.
విచిత్రమేమిటంటే ఇంతకన్నా పెద్ద పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపైన కేసీయార్ అసలు స్పందించనే లేదు. స్వయంగా కేసీయార్ కుటుంబంపైన కూడా ఎన్నో ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి ఈటల వ్యవహారం టీఆర్ఎస్ పుట్టి ముంచుతుందా ? లేకపోతే పొగమంచు లాగ విడిపోతుందా అన్నది చూడాల్సిందే.
This post was last modified on May 2, 2021 9:45 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…