Political News

సేమ్ టు సేమ్… ఈటల ఔట్ ?

మంత్రి ఈటల రాజేందర్ పై మొదలైన వార్తలు చూస్తుంటే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తోంది. మంత్రివర్గం నుండి లేదా ఏకంగా పార్టీనుండే ఈటెలను సాగనంపేందుకు రంగం సిద్ధమైనట్లే అర్ధమైపోతోంది. తనంతట తానుగా రాజేందర్ రాజీనామాను అడిగినా లేకపోతే పార్టీనుండి బయటకు పంపేసినా రాజకీయంగా కేసీయార్ కు చాలా ఇబ్బందులు మొదలైపోతాయి. ఎందుకంటే ఈటల బలమైన బీసీ నేతల్లో ఒకరు కాబట్టి.

ఇలాంటి రాజేందర్ తో కొంతకాలంగా కేసీయార్ కు గ్యాప్ వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వంపైన రాజేందర్ సందర్భం వచ్చినపుడల్లా విమర్శలు, ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దాంతోనే అర్ధమైపోయింది రాజేందర్ ఎంతోకాలం మంత్రివర్గం, పార్టీలో ఉండలేరని. ఇదే విషయమై పరిస్ధితులు చేయిదాటిపోకుండా ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చటానికి సహచర మంత్రి కేటీఆర్ ప్రయత్నించారని సమాచారం. అయితే ఎందుకనో ప్రయత్నాలు ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి.

ఇలాంటి నేపధ్యంలో హఠాత్తుగా మెదక్ జిల్లాలోని మూసాయిపేట, హకీంపేట గ్రామాలకు చెందిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన అసైన్డ్ భూములను ఈటల బలవంతంగా లాక్కున్నారనే బ్రేకింగ్ న్యూస్ మొదలైంది. అదికూడా ఏదో ఒక్క చానల్లో కాదు ఏకంగా నాలుగు చానళ్ళల్లో ఒకేసారి. దాంతో జనాలందరికీ విషయం ఒక్కసారిగా అర్ధమైపోయింది. ఇటు వార్తలు రావటం అటు కేసీయార్ స్పందించి విషయంపై విచారణ జరపాలని చీఫ్ సెక్రటరీకి, ప్రాధమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీజీపీకి ఆదేశించారు.

ఇవన్నీ చూస్తుంటే గతంలో ఆలె నరేందర్, విజయశాంతి, రాజ్యసభ ఎంపి డీఎస్ ఉదంతాలే గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో వాళ్ల విషయంలో ఏమి జరిగిందో ఇపుడు రాజేందర్ విషయంలో కూడా సేమ్ టు సేమ్ అలాగే జరుగుతోంది. భూకబ్జాలు, దందాల విషయంలో స్వయంగా కేటీయార్, మంత్రి మల్లారెడ్డి, ఎంతోమంది ఎంఎల్ఏలపైన కూడా ఆరోపణలున్నాయి. వాళ్ళ విషయంలో స్పందించని కేసీయార్ ఇపుడు జెట్ వేగంగా స్పందించటం విచిత్రంగా ఉంది. మాజీమంత్రి రాజయ్యను కూడా మంత్రివర్గంలో ఇలాగే తొలగించిన విషయం తెలిసిందే.

ఏదేమైనా ఎక్కువరోజులు ఈటల మంత్రివర్గంలోనే కాదు పార్టీలో ఉండలేని పరిస్దితులు ఏర్పడ్డాయి. రాజేందర్ పార్టీలో నుండి బయటకు వచ్చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణా ఉద్యమంలో చాలా చురుగ్గా వ్యవహరించి, సీనియర్ మంత్రుల్లో ఒకరైన ఈటల పార్టీ నుండి బయటకు వస్తే రాజకీయాలు స్పీడవుతాయన్న విషయం మాత్రం వాస్తవం. మరి కేసీయార్ కు ఇబ్బందులు మొదలవుతాయా ? లేకపోతే ఈటలే తెరమరుగైపోతారా ? అన్నది చూడాలి.

This post was last modified on May 1, 2021 10:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

6 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

31 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

33 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago