Political News

సేమ్ టు సేమ్… ఈటల ఔట్ ?

మంత్రి ఈటల రాజేందర్ పై మొదలైన వార్తలు చూస్తుంటే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తోంది. మంత్రివర్గం నుండి లేదా ఏకంగా పార్టీనుండే ఈటెలను సాగనంపేందుకు రంగం సిద్ధమైనట్లే అర్ధమైపోతోంది. తనంతట తానుగా రాజేందర్ రాజీనామాను అడిగినా లేకపోతే పార్టీనుండి బయటకు పంపేసినా రాజకీయంగా కేసీయార్ కు చాలా ఇబ్బందులు మొదలైపోతాయి. ఎందుకంటే ఈటల బలమైన బీసీ నేతల్లో ఒకరు కాబట్టి.

ఇలాంటి రాజేందర్ తో కొంతకాలంగా కేసీయార్ కు గ్యాప్ వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వంపైన రాజేందర్ సందర్భం వచ్చినపుడల్లా విమర్శలు, ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దాంతోనే అర్ధమైపోయింది రాజేందర్ ఎంతోకాలం మంత్రివర్గం, పార్టీలో ఉండలేరని. ఇదే విషయమై పరిస్ధితులు చేయిదాటిపోకుండా ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చటానికి సహచర మంత్రి కేటీఆర్ ప్రయత్నించారని సమాచారం. అయితే ఎందుకనో ప్రయత్నాలు ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి.

ఇలాంటి నేపధ్యంలో హఠాత్తుగా మెదక్ జిల్లాలోని మూసాయిపేట, హకీంపేట గ్రామాలకు చెందిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన అసైన్డ్ భూములను ఈటల బలవంతంగా లాక్కున్నారనే బ్రేకింగ్ న్యూస్ మొదలైంది. అదికూడా ఏదో ఒక్క చానల్లో కాదు ఏకంగా నాలుగు చానళ్ళల్లో ఒకేసారి. దాంతో జనాలందరికీ విషయం ఒక్కసారిగా అర్ధమైపోయింది. ఇటు వార్తలు రావటం అటు కేసీయార్ స్పందించి విషయంపై విచారణ జరపాలని చీఫ్ సెక్రటరీకి, ప్రాధమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీజీపీకి ఆదేశించారు.

ఇవన్నీ చూస్తుంటే గతంలో ఆలె నరేందర్, విజయశాంతి, రాజ్యసభ ఎంపి డీఎస్ ఉదంతాలే గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో వాళ్ల విషయంలో ఏమి జరిగిందో ఇపుడు రాజేందర్ విషయంలో కూడా సేమ్ టు సేమ్ అలాగే జరుగుతోంది. భూకబ్జాలు, దందాల విషయంలో స్వయంగా కేటీయార్, మంత్రి మల్లారెడ్డి, ఎంతోమంది ఎంఎల్ఏలపైన కూడా ఆరోపణలున్నాయి. వాళ్ళ విషయంలో స్పందించని కేసీయార్ ఇపుడు జెట్ వేగంగా స్పందించటం విచిత్రంగా ఉంది. మాజీమంత్రి రాజయ్యను కూడా మంత్రివర్గంలో ఇలాగే తొలగించిన విషయం తెలిసిందే.

ఏదేమైనా ఎక్కువరోజులు ఈటల మంత్రివర్గంలోనే కాదు పార్టీలో ఉండలేని పరిస్దితులు ఏర్పడ్డాయి. రాజేందర్ పార్టీలో నుండి బయటకు వచ్చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణా ఉద్యమంలో చాలా చురుగ్గా వ్యవహరించి, సీనియర్ మంత్రుల్లో ఒకరైన ఈటల పార్టీ నుండి బయటకు వస్తే రాజకీయాలు స్పీడవుతాయన్న విషయం మాత్రం వాస్తవం. మరి కేసీయార్ కు ఇబ్బందులు మొదలవుతాయా ? లేకపోతే ఈటలే తెరమరుగైపోతారా ? అన్నది చూడాలి.

This post was last modified on May 1, 2021 10:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago