Political News

టీడీపీకి ప‌నిక‌ల్పిస్తున్న ఏపీ సీఎం..!

సాధార‌ణంగా.. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా.. ప్ర‌తిప‌క్షాల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు సైలెంట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఎక్క‌డ విమ‌ర్శ‌లు చేస్తారో.. ఎక్క‌డ తాము ఇప్ప‌టి వ‌ర‌కు ప‌డిన క‌ష్టం పాడైపోతుందో అని పార్టీలు అల్లాడిపోతుంటాయి. దీంతో దాదాపు ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిలేకుండా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాయి. దీంతో ప్ర‌తిప‌క్షాలే.. కొత్త స‌మ‌స్య‌లు వెతికి మ‌రీ తెర‌మీదికి తెచ్చి ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెడుతుంటాయి. తెలంగాణ‌ను తీసుకుంటే..అక్క‌డ ప్ర‌భుత్వం నుంచి ప్ర‌తిప‌క్షాల‌కు ఎలాంటి ప‌ని దొర‌క‌దు. కానీ.. ప్ర‌తిప‌క్షాల నుంచి త‌న‌ను తాను కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్ర‌య‌త్నిస్తుంటుంది.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. మాత్రం దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీకి.. సీఎం జ‌గ‌నే చేతి నిండా .. నోటినిండా ప‌నిక‌ల్పిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాలు, అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు.. చాలా వ‌ర‌కు వివాదం లేకుండానే న‌డుస్తున్నాయి. దీంతో ప్ర‌తిప‌క్షాల‌కు ఛాన్స్ ఉండ‌డం లేదు. పేద‌ల‌కు ఇళ్ల ప‌థ‌కం కానీ, 45 ఏళ్లు నిండిన మ‌హిళ‌ల‌కు పింఛ‌న్లు ఇచ్చే విష‌యం కానీ, చేయూత ప‌థ‌కం కానీ, రైతు భ‌రోసా కేంద్రాల ఏర్పాటు ఇలా అనేక విష‌యాల్లో జ‌గ‌న్‌ను విమ‌ర్శించే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీంతో చాలా వ‌ర‌కు కూడా ప్ర‌తిప‌క్షాలు కొన్ని కొన్ని విష‌యాల‌పై మౌనం పాటిస్తున్నాయి.

ఇక‌, కొన్ని రోజులు విమ‌ర్శ‌లు చేసిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై కూడా త‌ర్వాత త‌ర్వాత మౌనం పాటించాయి. ఇక్క‌డ చిత్రంగా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను వ‌ద్ద‌న్న‌వారే.. ఈ వ్య‌వ‌స్థ‌లోకి వైసీపీ కార్య‌క‌ర్త‌లు జొర‌బ‌డ్డార‌ని ఆరోప‌ణ‌లు చేసిన టీడీపీ నేత‌లే.. త‌ర్వాత త‌ర్వాత‌.. వారికి జీతాలు పెంచాలంటూ. విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం అంటే.. జ‌గ‌న్ నిర్ణ‌యాలు దాదాపు ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిలేకుండా చేశాయి. అయితే.. జ‌గ‌న్‌ తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు మాత్రం ఇప్పుడు ప‌నిక‌ల్పించాయి. అదే.. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌. ఒక‌వైపు రాష్ట్రంలో క‌రోనా తీవ్ర‌త వెంటాడుతోంది.

దీంతో ప్ర‌జ‌లు కూడా భ‌యంభ‌యంగా కాలం గ‌డుపుతున్నారు.కానీ, జ‌గ‌న్ మాత్రం ప‌రీక్ష‌లు పెట్టితీరాల్సిందేన‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఇంకేముంది.. ప్ర‌జ‌ల ప‌క్షాన మేం నిలుస్తాం.. అంటూ.. టీడీపీ, ఇత‌ర పార్టీలు కూడా ముందుకు వ‌చ్చాయి. ఇదే ప్ర‌క‌ట‌న‌.. జ‌గ‌న్ చేసి ఉండ‌క‌పోతే.. ఈ పార్టీల‌కు ప‌నిలేకుండా పోయేద‌ని అంటున్నారు. మొత్తానికి ప్ర‌తి ప‌క్షాల‌కు ప‌నిక‌ల్పిస్తున్నందుకు.. జ‌గ‌న్‌ను మెచ్చుకోవాలా? ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నందుకు బాధ‌ప‌డాలా? అనేది త‌ర్జ‌న భ‌ర్జ‌న‌!!

This post was last modified on April 30, 2021 11:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago