Political News

టీకాలపై చేతులెత్తేసిన ప్రభుత్వాలు

కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రెండు చేతులెత్తేశాయి. కోట్లాది డోసులు ఉత్పత్తి చేయలేక కంపెనీలు కూడా అవస్తలు పడుతున్నాయి. మొదట్లో 60 ఏళ్ళ వారికి మాత్రమే వ్యాక్సిన్లు వేస్తామని కేంద్రం నిర్ణయించినపుడు డిమాండ్ ఒకమాదిరిగా ఉండేది. అప్పట్లో డిమాండ్ కు మించి సప్లై ఉన్న కారణంగా రిజిస్టర్ చేసుకున్న వారందిరికీ టీకాలు వేసే అవకాశం ఉండేది.

అయితే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు టీకాల కార్యక్రమం చాలా స్లోగా జరుగుతోందనే ఆరోపణలు ఎక్కువైపోయాయి. దీంతో టీకాలు వేయించుకునే వయసును 45 ఏళ్ళకు కేంద్రం తగ్గించింది. ఎప్పుడైతే కేంద్రం వయసును తగ్గించిందో ఒక్కసారిగా వ్యాక్సినేషన్ కోసం జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు. దాంతో టీకాలకు కొరత వచ్చేసింది. దీని ఫలితంగా రెండో డోసు వేసుకోవాల్సిన వాళ్ళ డ్యూరేషన్ను కేంద్రం నాలుగు వారాల నుండి ఆరు, ఎనిమిది వారాలకు పెంచేసింది.

ఈ సమస్య పరిష్కారం కాకమునుపే టీకాలు వేసుకునే వయసును కేంద్రం 18 ఏళ్ళకు తగ్గించింది. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంకా 18 ఏళ్ళ యువతకు టీకాలు వేయటం మొదలు కాలేదు. 45 ఏళ్ళ వాళ్ళకు వేయాల్సిన టీకాలే వేయలేకపోతున్నారు. లక్షలాదిమంది మొదటి డోసు, మరికొన్ని లక్షల మందికి రెండో డోసు వేయాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. అందరికీ టీకాలు వేయాలంటే కేంద్రం సరఫరా చేయాలి. కేంద్రం సరఫరా చేయాలంటే ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేయాలి.

ఒక్కసారిగా వచ్చిపడిన కోట్లాది టీకాలను ఉత్పత్తి చేయలేక కంపెనీలు చేతులెత్తేశాయి. తెలంగాణాలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు టీకాలు వేయాలంటే 3.5 కోట్ల డోసులు కావాలి. ఏపిలో వ్యాక్సినేషన్ కావాలంటే 4 కోట్ల డోసులు కావాలి. ఇది రెండు తెలుగు రాష్ట్రాల డిమాండ్ మాత్రమే. మరి దేశమంతా 18 ఏళ్ళ యువతకు టీకాలు వేయాలంటే కనీసం 70 కోట్ల టీకాలవసరమని అంచనా.

60 ఏళ్ళు, 45 ఏళ్ళ వాళ్ళకే పూర్తిస్ధాయిలో టీకాలు వేయలని ప్రభుత్వాలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఏమి వేస్తుందనేది పెద్ద ప్రశ్న. ఉత్పత్తి చేయలేనపుడు, సరఫరా సాధ్యం కానపుడు 18 ఏళ్ళ యువతకు టీకాలను కేంద్రం ఎందుకు ప్రకటించిందో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొత్తం మీద అర్ధమవుతున్నదేమంటే టీకాలు వేయటంలో ప్రభుత్వాలు ఫెయిలయ్యాయని. మరి పరిస్ధితులు ఎప్పుడు చక్కబడతాయో ఏమో.

This post was last modified on April 30, 2021 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాయమైన వైవీఎస్.. మళ్లీ వచ్చారు

టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…

3 hours ago

మహాభారతం పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారా

ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…

4 hours ago

యుద్ధం వద్దంటున్న తెలుగు హీరోయిన్

కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…

5 hours ago

మే 30 వదిలేయడం లాభమా నష్టమా

నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…

5 hours ago

ఇస్రో కేంద్రాలు, పోర్టుల వద్ద హై అలర్ట్

పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…

5 hours ago

పాక్ ది ఎంతటి పన్నాగమో తెలుసా..?

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…

5 hours ago