కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రెండు చేతులెత్తేశాయి. కోట్లాది డోసులు ఉత్పత్తి చేయలేక కంపెనీలు కూడా అవస్తలు పడుతున్నాయి. మొదట్లో 60 ఏళ్ళ వారికి మాత్రమే వ్యాక్సిన్లు వేస్తామని కేంద్రం నిర్ణయించినపుడు డిమాండ్ ఒకమాదిరిగా ఉండేది. అప్పట్లో డిమాండ్ కు మించి సప్లై ఉన్న కారణంగా రిజిస్టర్ చేసుకున్న వారందిరికీ టీకాలు వేసే అవకాశం ఉండేది.
అయితే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు టీకాల కార్యక్రమం చాలా స్లోగా జరుగుతోందనే ఆరోపణలు ఎక్కువైపోయాయి. దీంతో టీకాలు వేయించుకునే వయసును 45 ఏళ్ళకు కేంద్రం తగ్గించింది. ఎప్పుడైతే కేంద్రం వయసును తగ్గించిందో ఒక్కసారిగా వ్యాక్సినేషన్ కోసం జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు. దాంతో టీకాలకు కొరత వచ్చేసింది. దీని ఫలితంగా రెండో డోసు వేసుకోవాల్సిన వాళ్ళ డ్యూరేషన్ను కేంద్రం నాలుగు వారాల నుండి ఆరు, ఎనిమిది వారాలకు పెంచేసింది.
ఈ సమస్య పరిష్కారం కాకమునుపే టీకాలు వేసుకునే వయసును కేంద్రం 18 ఏళ్ళకు తగ్గించింది. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంకా 18 ఏళ్ళ యువతకు టీకాలు వేయటం మొదలు కాలేదు. 45 ఏళ్ళ వాళ్ళకు వేయాల్సిన టీకాలే వేయలేకపోతున్నారు. లక్షలాదిమంది మొదటి డోసు, మరికొన్ని లక్షల మందికి రెండో డోసు వేయాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. అందరికీ టీకాలు వేయాలంటే కేంద్రం సరఫరా చేయాలి. కేంద్రం సరఫరా చేయాలంటే ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేయాలి.
ఒక్కసారిగా వచ్చిపడిన కోట్లాది టీకాలను ఉత్పత్తి చేయలేక కంపెనీలు చేతులెత్తేశాయి. తెలంగాణాలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు టీకాలు వేయాలంటే 3.5 కోట్ల డోసులు కావాలి. ఏపిలో వ్యాక్సినేషన్ కావాలంటే 4 కోట్ల డోసులు కావాలి. ఇది రెండు తెలుగు రాష్ట్రాల డిమాండ్ మాత్రమే. మరి దేశమంతా 18 ఏళ్ళ యువతకు టీకాలు వేయాలంటే కనీసం 70 కోట్ల టీకాలవసరమని అంచనా.
60 ఏళ్ళు, 45 ఏళ్ళ వాళ్ళకే పూర్తిస్ధాయిలో టీకాలు వేయలని ప్రభుత్వాలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఏమి వేస్తుందనేది పెద్ద ప్రశ్న. ఉత్పత్తి చేయలేనపుడు, సరఫరా సాధ్యం కానపుడు 18 ఏళ్ళ యువతకు టీకాలను కేంద్రం ఎందుకు ప్రకటించిందో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొత్తం మీద అర్ధమవుతున్నదేమంటే టీకాలు వేయటంలో ప్రభుత్వాలు ఫెయిలయ్యాయని. మరి పరిస్ధితులు ఎప్పుడు చక్కబడతాయో ఏమో.
This post was last modified on April 30, 2021 11:05 am
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…