Political News

టీకాలపై చేతులెత్తేసిన ప్రభుత్వాలు

కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రెండు చేతులెత్తేశాయి. కోట్లాది డోసులు ఉత్పత్తి చేయలేక కంపెనీలు కూడా అవస్తలు పడుతున్నాయి. మొదట్లో 60 ఏళ్ళ వారికి మాత్రమే వ్యాక్సిన్లు వేస్తామని కేంద్రం నిర్ణయించినపుడు డిమాండ్ ఒకమాదిరిగా ఉండేది. అప్పట్లో డిమాండ్ కు మించి సప్లై ఉన్న కారణంగా రిజిస్టర్ చేసుకున్న వారందిరికీ టీకాలు వేసే అవకాశం ఉండేది.

అయితే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు టీకాల కార్యక్రమం చాలా స్లోగా జరుగుతోందనే ఆరోపణలు ఎక్కువైపోయాయి. దీంతో టీకాలు వేయించుకునే వయసును 45 ఏళ్ళకు కేంద్రం తగ్గించింది. ఎప్పుడైతే కేంద్రం వయసును తగ్గించిందో ఒక్కసారిగా వ్యాక్సినేషన్ కోసం జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు. దాంతో టీకాలకు కొరత వచ్చేసింది. దీని ఫలితంగా రెండో డోసు వేసుకోవాల్సిన వాళ్ళ డ్యూరేషన్ను కేంద్రం నాలుగు వారాల నుండి ఆరు, ఎనిమిది వారాలకు పెంచేసింది.

ఈ సమస్య పరిష్కారం కాకమునుపే టీకాలు వేసుకునే వయసును కేంద్రం 18 ఏళ్ళకు తగ్గించింది. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంకా 18 ఏళ్ళ యువతకు టీకాలు వేయటం మొదలు కాలేదు. 45 ఏళ్ళ వాళ్ళకు వేయాల్సిన టీకాలే వేయలేకపోతున్నారు. లక్షలాదిమంది మొదటి డోసు, మరికొన్ని లక్షల మందికి రెండో డోసు వేయాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. అందరికీ టీకాలు వేయాలంటే కేంద్రం సరఫరా చేయాలి. కేంద్రం సరఫరా చేయాలంటే ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేయాలి.

ఒక్కసారిగా వచ్చిపడిన కోట్లాది టీకాలను ఉత్పత్తి చేయలేక కంపెనీలు చేతులెత్తేశాయి. తెలంగాణాలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు టీకాలు వేయాలంటే 3.5 కోట్ల డోసులు కావాలి. ఏపిలో వ్యాక్సినేషన్ కావాలంటే 4 కోట్ల డోసులు కావాలి. ఇది రెండు తెలుగు రాష్ట్రాల డిమాండ్ మాత్రమే. మరి దేశమంతా 18 ఏళ్ళ యువతకు టీకాలు వేయాలంటే కనీసం 70 కోట్ల టీకాలవసరమని అంచనా.

60 ఏళ్ళు, 45 ఏళ్ళ వాళ్ళకే పూర్తిస్ధాయిలో టీకాలు వేయలని ప్రభుత్వాలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఏమి వేస్తుందనేది పెద్ద ప్రశ్న. ఉత్పత్తి చేయలేనపుడు, సరఫరా సాధ్యం కానపుడు 18 ఏళ్ళ యువతకు టీకాలను కేంద్రం ఎందుకు ప్రకటించిందో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొత్తం మీద అర్ధమవుతున్నదేమంటే టీకాలు వేయటంలో ప్రభుత్వాలు ఫెయిలయ్యాయని. మరి పరిస్ధితులు ఎప్పుడు చక్కబడతాయో ఏమో.

This post was last modified on April 30, 2021 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

35 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago