తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అవుననే అనుకోవాలి. పశ్చిమబెంగాల్లో చివరి విడత పోలింగ్ అయిపోయిన తర్వాత అనేక సర్వే, మీడియా సంస్ధలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదలచేశాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన ఆరుసంస్ధల్లో మూడింటి ప్రకారమైతే బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. ఇదే సమయంలో మిగిలిన మూడు సంస్ధల అంచనాల ప్రకారం మమతబెనర్జీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన మూడు మీడియా సంస్ధలు కమలంపార్టీకి మద్దతుగా పనిచేస్తున్నాయనే ప్రచారంలో ఉంది. ఇండియా టుడే-యాక్సిస్ అంచనా ప్రకారం బీజేపీకి 160 సీట్లు వస్తే, మమతకు 156 సీట్లొస్తాయట. రిపబ్లిక్-సీఎన్ఎక్స్ సంస్ధ ప్రకారం బీజేపీకి 148 సీట్లు, టీఎంసీకి 138 సీట్లొస్తాయి. అంటే దాదాపు హంగ్ వస్తుందని చెప్పింది.
ఇక ఇండియా టుడే-పీపుల్స్ పల్స్ ప్రకారం బీజేపీ 192 సీట్లతో మంచి మెజారిటితో గెలవబోతోంది. అలాగే మమత పార్టీకి అతి తక్కువగా 88 సీట్లు మాత్రమే వస్తోంది. ఇక టైమ్స్ నౌ సీఓటర్ అంచనా ప్రకారం మమత పార్టీకి 164 సీట్లు, బీజేపీకి 121 సీట్లు వస్తాయట. అలాగే పీమార్ క్యూ అంచనా ప్రకారం టీఎంసీకి 172 సీట్లు, బీజేపీకి 132 సీట్లొస్తాయి. టుడే చాణుక్య, ఎన్డీటీవీ సంస్ధలు కూడా మమత హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అంచనా వేశాయి.
చివరగా లెఫ్ట్-కాంగ్రెస్ ఫ్రంట్ కు మ్యాగ్జిమమ్ 25 సీట్లు వస్తే అదే చాలా ఎక్కువన్నట్లు అంచనా వేశాయి. బహుశా బెంగాల్లో హంగ్ వస్తే అప్పుడు ఈ ఫ్రంట్ కు ప్రాధాన్యత పెరుగుతుందేమో చూడాలి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జరిగిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం మొదటి ఏడువిడతల్లో జరిగిన పోలింగ్ కు సంబంధించింది మాత్రమే. ఎందుకంటే ఎనిమిదవ విడత పోలింగ్ గురువారం సాయంత్రం ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ప్రసారం మొదలైపోయిందంటే ఎనిమిదో విడత పోలింగ్ ను పరిగణలోకి తీసుకోలేదని అర్ధమవుతోంది.
This post was last modified on April 30, 2021 10:55 am
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…