తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అవుననే అనుకోవాలి. పశ్చిమబెంగాల్లో చివరి విడత పోలింగ్ అయిపోయిన తర్వాత అనేక సర్వే, మీడియా సంస్ధలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదలచేశాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన ఆరుసంస్ధల్లో మూడింటి ప్రకారమైతే బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. ఇదే సమయంలో మిగిలిన మూడు సంస్ధల అంచనాల ప్రకారం మమతబెనర్జీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన మూడు మీడియా సంస్ధలు కమలంపార్టీకి మద్దతుగా పనిచేస్తున్నాయనే ప్రచారంలో ఉంది. ఇండియా టుడే-యాక్సిస్ అంచనా ప్రకారం బీజేపీకి 160 సీట్లు వస్తే, మమతకు 156 సీట్లొస్తాయట. రిపబ్లిక్-సీఎన్ఎక్స్ సంస్ధ ప్రకారం బీజేపీకి 148 సీట్లు, టీఎంసీకి 138 సీట్లొస్తాయి. అంటే దాదాపు హంగ్ వస్తుందని చెప్పింది.
ఇక ఇండియా టుడే-పీపుల్స్ పల్స్ ప్రకారం బీజేపీ 192 సీట్లతో మంచి మెజారిటితో గెలవబోతోంది. అలాగే మమత పార్టీకి అతి తక్కువగా 88 సీట్లు మాత్రమే వస్తోంది. ఇక టైమ్స్ నౌ సీఓటర్ అంచనా ప్రకారం మమత పార్టీకి 164 సీట్లు, బీజేపీకి 121 సీట్లు వస్తాయట. అలాగే పీమార్ క్యూ అంచనా ప్రకారం టీఎంసీకి 172 సీట్లు, బీజేపీకి 132 సీట్లొస్తాయి. టుడే చాణుక్య, ఎన్డీటీవీ సంస్ధలు కూడా మమత హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అంచనా వేశాయి.
చివరగా లెఫ్ట్-కాంగ్రెస్ ఫ్రంట్ కు మ్యాగ్జిమమ్ 25 సీట్లు వస్తే అదే చాలా ఎక్కువన్నట్లు అంచనా వేశాయి. బహుశా బెంగాల్లో హంగ్ వస్తే అప్పుడు ఈ ఫ్రంట్ కు ప్రాధాన్యత పెరుగుతుందేమో చూడాలి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జరిగిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం మొదటి ఏడువిడతల్లో జరిగిన పోలింగ్ కు సంబంధించింది మాత్రమే. ఎందుకంటే ఎనిమిదవ విడత పోలింగ్ గురువారం సాయంత్రం ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ప్రసారం మొదలైపోయిందంటే ఎనిమిదో విడత పోలింగ్ ను పరిగణలోకి తీసుకోలేదని అర్ధమవుతోంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…