Political News

సుప్రింకోర్టు మోడినే టార్గెట్ చేసిందా ?

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత నియంత్రణను సుప్రింకోర్టు తన చేతిలోకి తీసుకున్నట్లేనా ? తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యలు డైరెక్టుగా ప్రధానమంత్రి నరేంద్రమోడిని టార్గెట్ చేసిందేనా ? అన్న చర్చ పెరిగిపోతోంది. కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపధ్యంలో సుప్రింకోర్టు సూమోటోగా విచారణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతు దేశంలో కరోనా సంక్షోభం పెరిగిపోతున్న నేపధ్యంలో సుప్రింకోర్టు ప్రేక్షక పాత్ర వహించలేదన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో తాము స్పందించకుండా చూస్తు ఎలా కూర్చుంటామని కేంద్రప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశం సంక్షోభంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు యావత్ దేశం చేస్తున్నపోరాటంలో సుప్రింకోర్టు జోక్యం చాలా అవసరమని జస్టిస్ అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా దేశంలో పరిస్ధితులు చాలా దారుణంగా మారిపోతోంది. రోజుకు 3.5 లక్షల కేసులు నమోదవుతున్నాయి. సోమ-మంగళవారాల్లో 3 వేలమందికి చనిపోయారు. ఒకవైపు టీకాలు అందక చనిపోతుంటే మరోవైపు ఆక్సిజన్ అందక కూడా రోగులు చనిపోతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, కేరళ, ఏపి, తెలంగాణా, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రోజురోజుకు కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి.

ఏ రాష్ట్రంలో కూడా రోగులకు ప్రాణాధారమైన ఆక్సిజన్ సరిపడా లేవు. నిజానికి చాలామంది రోగులు కరోనా తీవ్రతకన్నా భయంతోనే చనిపోతున్నారన్నది వాస్తవం. తమకు కరోనా సోకిందని తెలియగానే కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జరుగుతున్నది చూస్తున్న జనాల్లో ఓ విధమైన భయాందోళనలు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా సంక్షోభం పెరిగిపోతుంటే కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తోంది. దాంతో ఇన్నిరోజులు ఓపికిపట్టిన కేంద్రం ఇక లాభం లేదని తానే పగ్గాలను చేతిలోకి తీసుకున్నది.

This post was last modified on April 28, 2021 12:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

25 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago