Political News

శ‌వాల గుట్ట‌లు పేరుకున్నా.. లాక్‌డౌన్ పెట్ట‌ను

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. నిత్యం వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డుతు న్నారు. దీంతో గ‌త ఏడాది దాదాపు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్‌ను విధించాయి. అయితే.. నెమ్మ‌దినెమ్మ‌దిగా దీనిని స‌డ‌లిస్తూ.. వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే బ్రిట‌న్‌లోనూ గ‌త ఏడాది లాక్‌డౌన్ విధించారు. ఇక‌, మొద‌టిసారి కంటే కూడా రెండోసారి లాక్‌డౌన్‌ను ప‌టిష్టంగా అమ‌లు చేసి.. క‌రోనాను చాలా వ‌ర‌కు నిలువ‌రించారు.

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గానే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు యాక్టివ్ కేసులు 4,406,946 కాగా, మ‌ర‌ణించిన వారి సంఖ్య 127,434గా ఉంది. అంటే.. బ్రిట‌న్ జ‌నాభా(6 కోట్ల పైచిలుకు)తో పోల్చుకుంటే.. మ‌ర‌ణించిన వారు ఎక్కువే. దీంతో ఇప్పుడు తీవ్రంగా ఉన్న క‌రోనాను ఎదుర్కొనేందుకు మూడో సారి కూడా లాక్ డౌన్ విధించాల‌ని.. అక్క‌డి ప్ర‌తిప‌క్షాలు కోరుతున్నాయి. అయితే.. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ మాత్రం లాక్‌డౌన్ విధించ‌న‌ని.. కొన్నాళ్లుగా చెబుతున్నారు. “అలాంటి ప్ర‌తిపాద‌న ప్ర‌భుత్వం వద్ద‌లేదు” అని ప్ర‌ధాని కార్యాల‌య సెక్ర‌ట‌రీ ఇట‌వ‌ల వెల్ల‌డించారు.

ఇదిలావుంటే.. మూడోసారి లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని బోరిస్ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారంటూ.. ఇక్క‌డి ప్ర‌ధాన మీడియా, ప్ర‌జాద‌ర‌ణ‌, విశ్వ‌స‌నీయ సంస్థ‌గా గుర్తింపు పొందిన ‘డైలీ మెయిల్’ బాంబు పేల్చింది.

“దేశంలో మూడోసారి లాక్డౌన్ విధించడం కంటే.. గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పేరుకుపోయినా ఫర్వాలేదు. అదే మేలు” అని ప్ర‌ధాని బోరిస్ అన్న‌ట్టుగా.. డైలీ మెయిల్ సంచ‌ల‌న వార్త తీసుకువ‌చ్చింది. రెండోసారి లాక్డౌన్ విధించిన సందర్భంగా 2020 చివరిలో జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ డైలీ మెయిల్ ఇటీవల తన కథనంలో పేర్కొంది.

ఇందుకు సంబంధించి ఆ పత్రిక ఎలాంటి ఆధారాలు పేర్కొనలేదు. కాకపోతే జాన్సన్ కార్యాలయం నుంచి ఈ లీకులు వచ్చినట్లు తెలిపింది. అయితే.. డైలీమెయిల్ మీడియాలో వచ్చిన ఈ కథనాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ ఖండించారు. అవి పూర్తిగా చెత్త ఆరోపణలు అని ఆయన మండిపడ్డారు. దీనిపై విచార‌ణ‌కు ఆయ‌న ఆదేశించిన‌ట్టు ప్ర‌ధాని కార్యాల‌య వ‌ర్గాలు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

బాహుబలి ఎపిక్… ఇదేం విడ్డూరం

గత ఏడాది బాహుబలి రెండు భాగాలను సింగల్ పార్ట్ గా మార్చి బాహుబలి ది ఎపిక్ పేరుతో విడుదల చేసిన…

10 minutes ago

వ‌డ్డే న‌వీన్ అంత ప‌వ‌ర్ ఫుల్లా?

90వ ద‌శ‌కంలో మ‌న‌సిచ్చి చూడు.. చాలాబాగుంది స‌హా ప‌లు ఫ్యామిలీ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న న‌టుడు వ‌డ్డే నవీన్. జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌ల…

2 hours ago

రిస్కు చేయడమే విలువను పెంచుతోంది

టాలీవుడ్ లో ఉన్న చాలా అగ్ర నిర్మాణ సంస్థలు బిజినెస్ లెక్కల ఆధారంగానే సినిమాలు తీస్తున్న మాట వాస్తవం. హీరో…

2 hours ago

మల్లు అర్జున్ క్రేజ్ చెక్కు చెదరలేదు

మనం తమిళ హీరోలు రజనీకాంత్, విజయ్, సూర్య లాంటి వాళ్ళను నెత్తినబెట్టుకుని చూస్తాం కానీ మనోళ్ళను వాళ్ళు పిచ్చ లైట్…

2 hours ago

లెనిన్ మళ్ళీ మాట తప్పితే ఎలా

మొన్నటిదాకా జూన్ 26 రావడం పక్కాని పదే పదే ప్రమోషన్లలో ఊదరగొట్టిన లెనిన్ మళ్ళీ వాయిదా పడిందనే వార్త అభిమానుల్లో…

2 hours ago

కోరుకున్న సినిమా వ‌చ్చింది… ఆద‌రిస్తారా?

తెలుగులో ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు త‌క్కువ అని… కొత్త క‌థ‌లు ప్ర‌య‌త్నించ‌ర‌ని.. ఎప్పుడూ మాస్ మంత్ర‌మే ప‌ఠిస్తుంటార‌ని.. క‌థ‌ల‌న్నీ హీరోల చుట్టూనే…

4 hours ago