Political News

శ‌వాల గుట్ట‌లు పేరుకున్నా.. లాక్‌డౌన్ పెట్ట‌ను

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. నిత్యం వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డుతు న్నారు. దీంతో గ‌త ఏడాది దాదాపు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్‌ను విధించాయి. అయితే.. నెమ్మ‌దినెమ్మ‌దిగా దీనిని స‌డ‌లిస్తూ.. వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే బ్రిట‌న్‌లోనూ గ‌త ఏడాది లాక్‌డౌన్ విధించారు. ఇక‌, మొద‌టిసారి కంటే కూడా రెండోసారి లాక్‌డౌన్‌ను ప‌టిష్టంగా అమ‌లు చేసి.. క‌రోనాను చాలా వ‌ర‌కు నిలువ‌రించారు.

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గానే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు యాక్టివ్ కేసులు 4,406,946 కాగా, మ‌ర‌ణించిన వారి సంఖ్య 127,434గా ఉంది. అంటే.. బ్రిట‌న్ జ‌నాభా(6 కోట్ల పైచిలుకు)తో పోల్చుకుంటే.. మ‌ర‌ణించిన వారు ఎక్కువే. దీంతో ఇప్పుడు తీవ్రంగా ఉన్న క‌రోనాను ఎదుర్కొనేందుకు మూడో సారి కూడా లాక్ డౌన్ విధించాల‌ని.. అక్క‌డి ప్ర‌తిప‌క్షాలు కోరుతున్నాయి. అయితే.. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ మాత్రం లాక్‌డౌన్ విధించ‌న‌ని.. కొన్నాళ్లుగా చెబుతున్నారు. “అలాంటి ప్ర‌తిపాద‌న ప్ర‌భుత్వం వద్ద‌లేదు” అని ప్ర‌ధాని కార్యాల‌య సెక్ర‌ట‌రీ ఇట‌వ‌ల వెల్ల‌డించారు.

ఇదిలావుంటే.. మూడోసారి లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని బోరిస్ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారంటూ.. ఇక్క‌డి ప్ర‌ధాన మీడియా, ప్ర‌జాద‌ర‌ణ‌, విశ్వ‌స‌నీయ సంస్థ‌గా గుర్తింపు పొందిన ‘డైలీ మెయిల్’ బాంబు పేల్చింది.

“దేశంలో మూడోసారి లాక్డౌన్ విధించడం కంటే.. గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పేరుకుపోయినా ఫర్వాలేదు. అదే మేలు” అని ప్ర‌ధాని బోరిస్ అన్న‌ట్టుగా.. డైలీ మెయిల్ సంచ‌ల‌న వార్త తీసుకువ‌చ్చింది. రెండోసారి లాక్డౌన్ విధించిన సందర్భంగా 2020 చివరిలో జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ డైలీ మెయిల్ ఇటీవల తన కథనంలో పేర్కొంది.

ఇందుకు సంబంధించి ఆ పత్రిక ఎలాంటి ఆధారాలు పేర్కొనలేదు. కాకపోతే జాన్సన్ కార్యాలయం నుంచి ఈ లీకులు వచ్చినట్లు తెలిపింది. అయితే.. డైలీమెయిల్ మీడియాలో వచ్చిన ఈ కథనాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ ఖండించారు. అవి పూర్తిగా చెత్త ఆరోపణలు అని ఆయన మండిపడ్డారు. దీనిపై విచార‌ణ‌కు ఆయ‌న ఆదేశించిన‌ట్టు ప్ర‌ధాని కార్యాల‌య వ‌ర్గాలు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 27, 2021 6:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

22 minutes ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

23 minutes ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

24 minutes ago

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

3 hours ago

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

5 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

8 hours ago