Political News

శ‌వాల గుట్ట‌లు పేరుకున్నా.. లాక్‌డౌన్ పెట్ట‌ను

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. నిత్యం వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డుతు న్నారు. దీంతో గ‌త ఏడాది దాదాపు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్‌ను విధించాయి. అయితే.. నెమ్మ‌దినెమ్మ‌దిగా దీనిని స‌డ‌లిస్తూ.. వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే బ్రిట‌న్‌లోనూ గ‌త ఏడాది లాక్‌డౌన్ విధించారు. ఇక‌, మొద‌టిసారి కంటే కూడా రెండోసారి లాక్‌డౌన్‌ను ప‌టిష్టంగా అమ‌లు చేసి.. క‌రోనాను చాలా వ‌ర‌కు నిలువ‌రించారు.

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గానే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు యాక్టివ్ కేసులు 4,406,946 కాగా, మ‌ర‌ణించిన వారి సంఖ్య 127,434గా ఉంది. అంటే.. బ్రిట‌న్ జ‌నాభా(6 కోట్ల పైచిలుకు)తో పోల్చుకుంటే.. మ‌ర‌ణించిన వారు ఎక్కువే. దీంతో ఇప్పుడు తీవ్రంగా ఉన్న క‌రోనాను ఎదుర్కొనేందుకు మూడో సారి కూడా లాక్ డౌన్ విధించాల‌ని.. అక్క‌డి ప్ర‌తిప‌క్షాలు కోరుతున్నాయి. అయితే.. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ మాత్రం లాక్‌డౌన్ విధించ‌న‌ని.. కొన్నాళ్లుగా చెబుతున్నారు. “అలాంటి ప్ర‌తిపాద‌న ప్ర‌భుత్వం వద్ద‌లేదు” అని ప్ర‌ధాని కార్యాల‌య సెక్ర‌ట‌రీ ఇట‌వ‌ల వెల్ల‌డించారు.

ఇదిలావుంటే.. మూడోసారి లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని బోరిస్ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారంటూ.. ఇక్క‌డి ప్ర‌ధాన మీడియా, ప్ర‌జాద‌ర‌ణ‌, విశ్వ‌స‌నీయ సంస్థ‌గా గుర్తింపు పొందిన ‘డైలీ మెయిల్’ బాంబు పేల్చింది.

“దేశంలో మూడోసారి లాక్డౌన్ విధించడం కంటే.. గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పేరుకుపోయినా ఫర్వాలేదు. అదే మేలు” అని ప్ర‌ధాని బోరిస్ అన్న‌ట్టుగా.. డైలీ మెయిల్ సంచ‌ల‌న వార్త తీసుకువ‌చ్చింది. రెండోసారి లాక్డౌన్ విధించిన సందర్భంగా 2020 చివరిలో జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ డైలీ మెయిల్ ఇటీవల తన కథనంలో పేర్కొంది.

ఇందుకు సంబంధించి ఆ పత్రిక ఎలాంటి ఆధారాలు పేర్కొనలేదు. కాకపోతే జాన్సన్ కార్యాలయం నుంచి ఈ లీకులు వచ్చినట్లు తెలిపింది. అయితే.. డైలీమెయిల్ మీడియాలో వచ్చిన ఈ కథనాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ ఖండించారు. అవి పూర్తిగా చెత్త ఆరోపణలు అని ఆయన మండిపడ్డారు. దీనిపై విచార‌ణ‌కు ఆయ‌న ఆదేశించిన‌ట్టు ప్ర‌ధాని కార్యాల‌య వ‌ర్గాలు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 27, 2021 6:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago