కరోనా నేపథ్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతు న్నారు. దీంతో గత ఏడాది దాదాపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ను విధించాయి. అయితే.. నెమ్మదినెమ్మదిగా దీనిని సడలిస్తూ.. వచ్చారు. ఈ క్రమంలోనే బ్రిటన్లోనూ గత ఏడాది లాక్డౌన్ విధించారు. ఇక, మొదటిసారి కంటే కూడా రెండోసారి లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేసి.. కరోనాను చాలా వరకు నిలువరించారు.
ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు యాక్టివ్ కేసులు 4,406,946 కాగా, మరణించిన వారి సంఖ్య 127,434గా ఉంది. అంటే.. బ్రిటన్ జనాభా(6 కోట్ల పైచిలుకు)తో పోల్చుకుంటే.. మరణించిన వారు ఎక్కువే. దీంతో ఇప్పుడు తీవ్రంగా ఉన్న కరోనాను ఎదుర్కొనేందుకు మూడో సారి కూడా లాక్ డౌన్ విధించాలని.. అక్కడి ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అయితే.. బ్రిటన్ ప్రధాని బోరిస్ మాత్రం లాక్డౌన్ విధించనని.. కొన్నాళ్లుగా చెబుతున్నారు. “అలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్దలేదు” అని ప్రధాని కార్యాలయ సెక్రటరీ ఇటవల వెల్లడించారు.
ఇదిలావుంటే.. మూడోసారి లాక్డౌన్పై ప్రధాని బోరిస్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ.. ఇక్కడి ప్రధాన మీడియా, ప్రజాదరణ, విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందిన ‘డైలీ మెయిల్’ బాంబు పేల్చింది.
“దేశంలో మూడోసారి లాక్డౌన్ విధించడం కంటే.. గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పేరుకుపోయినా ఫర్వాలేదు. అదే మేలు” అని ప్రధాని బోరిస్ అన్నట్టుగా.. డైలీ మెయిల్ సంచలన వార్త తీసుకువచ్చింది. రెండోసారి లాక్డౌన్ విధించిన సందర్భంగా 2020 చివరిలో జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ డైలీ మెయిల్ ఇటీవల తన కథనంలో పేర్కొంది.
ఇందుకు సంబంధించి ఆ పత్రిక ఎలాంటి ఆధారాలు పేర్కొనలేదు. కాకపోతే జాన్సన్ కార్యాలయం నుంచి ఈ లీకులు వచ్చినట్లు తెలిపింది. అయితే.. డైలీమెయిల్ మీడియాలో వచ్చిన ఈ కథనాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ ఖండించారు. అవి పూర్తిగా చెత్త ఆరోపణలు అని ఆయన మండిపడ్డారు. దీనిపై విచారణకు ఆయన ఆదేశించినట్టు ప్రధాని కార్యాలయ వర్గాలు పేర్కొనడం గమనార్హం.
This post was last modified on April 27, 2021 6:10 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…