Political News

టీకాల్లో ఆలస్యం తప్పదా ?

18 ఏళ్ళు నిండిన వాళ్ళు కరోన వైరస్ టీకాలు వేసుకోవటానికి మరో నెలరోజులు వెయిట్ చేయక తప్పదు. ఎందకంటే వాళ్ళకు అవసరమైన టీకాలు ఇప్పుడిప్పుడే అందేట్లులేదు. ప్రభుత్వం ప్రకటించిన లెక్క ప్రకారమే 18 ఏళ్ళు నిండినవాళ్ళకు టీకాలు వేయాలంటే సుమారు 2 కోట్ల టీకాలు అవసరం. అంటే రెండు డోసులకు కలిపి 4 కోట్లకు పైగా టీకాలు కావాలి.

ఇపుడు 45-60 ఏళ్ళమధ్య వారికి టీకాలు వేయటానికే సరపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉండటంలేదు. దీనివల్లే మధ్య వయస్సుల వారికి కూడా టీకాల షెడ్యూల్ తేదీలను ప్రభుత్వమే మార్చేస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే టీకాలను ఉత్పత్తి చేసే రెండు కంపెనీలనుండి సరపడా ఉత్పత్తి కాకపోవటమే. యావత్ దేశానికి 45-60 ఏళ్ళ వయసుల వారికి వ్యాక్సిన్లు వేయాలంటేనే వందల కోట్ల డోసులు ఉత్పత్తిచేయాలి.

ముడిసరుకు కొరత, మ్యాన పవర్ కొరత, సాంకేతిక నిపుణుల కొరత లాంటి అనేక సమస్యల వల్ల ఫార్మా కంపెనీలు కూడా అవసరానికి సరపడా టీకాలను ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ముందు చెప్పిన వయసుల వాళ్ళకే రెండు డోసులు సక్రమంగా వేయలేకపోతున్న ప్రభుత్వాలు ఇక 18 ఏళ్ళు నిండినవారికి కూడా టీకాలు వేయాలంటే ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలో చెప్పక్కర్లేదు.

జనాలందరికీ టీకాలను అందివ్వలేని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే టీకాల విషయంలో తన బాధ్యతల నుండి తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ఫార్మాకంపెనీలతో నేరుగా మాట్లాడుకోవాలని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించి చేతులు దులిపేసుకుంది. ఫార్మాకంపెనీలేమో డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి చేయలేక అవస్తలు పడుతున్నాయి. ఈ కారణంగానే 18 ఏళ్ళు నిండిన వారికి టీకాలు వేయటం ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ సింఘాలే స్వయంగా చెప్పారు. మే 1 నుండి 18 ఏళ్ళు నిండినవారికి మొదలవ్వాల్సిన టీకాల కార్యక్రమం జూన్ కు వాయిదా వేసినట్లు చెప్పారు. జూన్ లో అయినా మొదలవుతుందా అంటే ఎవరు చెప్పలేకున్నారు.

This post was last modified on April 27, 2021 2:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

10 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

11 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

12 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

12 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

12 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

13 hours ago