Political News

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం

ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు ఎండీ కమ్ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. గడిచిన కొద్ది రోజులుగా అపోలోలో ప్రత్యేకంగా చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యలే ఆమె మరణానికి కారణంగా చెబుతున్నారు. ఈ తెల్లవారుజామున ఆమె తుదిశ్వాసను విడిచినట్లుగా తెలుస్తోంది. ఏబీఎన్ఆంధ్రజ్యోతి సంస్థలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న వేమూరి కనకదుర్గ (63) మరణం షాకింగ్ గా మారింది.

సంస్థకు దన్నుగా నిలవటంతో పాటు.. ఆర్థిక అంశాల విషయంలో ఆమె కీలక భూమిక పోషిస్తారని చెబుతారు. ఆరోగ్యం తీవ్రంగా విషమించటానికి ముందు కూడా ఆమె.. రోజువారీగా సంస్థకు సంబంధించిన ఆర్థిక అంశాల విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారని చెబుతారు. ఇప్పటికి ఎవరైనా కొత్త రిక్రూట్ మెంట్ కు ఆమె ఆమోదం లభించాల్సి ఉంటుందని చెబుతారు. సంస్థకు ఎంతో కీలకంగా ఉన్న ఆమె లేని లోటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు.. వ్యక్తిగతంగా ఆర్కేకు భారీ లోటుగా చెప్పక తప్పదు.

కనకదుర్గ మృతికి పలువురు రాజకీయ.. సినీ రంగాలకు చెందిన ప్రముఖులు.. వివిధ వర్గాలకు చెందిన వారు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఉద్యోగుల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర విషాదంలో ఉన్న సంస్థ ఉద్యోగులు ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియల్ని నిర్వహించనున్నారు. దీనికి కొద్ది రోజులు ముందు.. కనకదుర్గ సోదరుడి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించటం తెలిసిందే. నెల రోజులు కూడా కాకముందే చోటు చేసుకున్న రెండు విషాద ఉదంతాలు ఆంధ్రజ్యోతి సంస్థల్లో విషాదాన్ని నింపుతున్నాయి.

This post was last modified on April 27, 2021 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

2 hours ago

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

5 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

6 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

9 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

9 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

10 hours ago