Political News

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం

ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు ఎండీ కమ్ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. గడిచిన కొద్ది రోజులుగా అపోలోలో ప్రత్యేకంగా చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యలే ఆమె మరణానికి కారణంగా చెబుతున్నారు. ఈ తెల్లవారుజామున ఆమె తుదిశ్వాసను విడిచినట్లుగా తెలుస్తోంది. ఏబీఎన్ఆంధ్రజ్యోతి సంస్థలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న వేమూరి కనకదుర్గ (63) మరణం షాకింగ్ గా మారింది.

సంస్థకు దన్నుగా నిలవటంతో పాటు.. ఆర్థిక అంశాల విషయంలో ఆమె కీలక భూమిక పోషిస్తారని చెబుతారు. ఆరోగ్యం తీవ్రంగా విషమించటానికి ముందు కూడా ఆమె.. రోజువారీగా సంస్థకు సంబంధించిన ఆర్థిక అంశాల విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారని చెబుతారు. ఇప్పటికి ఎవరైనా కొత్త రిక్రూట్ మెంట్ కు ఆమె ఆమోదం లభించాల్సి ఉంటుందని చెబుతారు. సంస్థకు ఎంతో కీలకంగా ఉన్న ఆమె లేని లోటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు.. వ్యక్తిగతంగా ఆర్కేకు భారీ లోటుగా చెప్పక తప్పదు.

కనకదుర్గ మృతికి పలువురు రాజకీయ.. సినీ రంగాలకు చెందిన ప్రముఖులు.. వివిధ వర్గాలకు చెందిన వారు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఉద్యోగుల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర విషాదంలో ఉన్న సంస్థ ఉద్యోగులు ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియల్ని నిర్వహించనున్నారు. దీనికి కొద్ది రోజులు ముందు.. కనకదుర్గ సోదరుడి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించటం తెలిసిందే. నెల రోజులు కూడా కాకముందే చోటు చేసుకున్న రెండు విషాద ఉదంతాలు ఆంధ్రజ్యోతి సంస్థల్లో విషాదాన్ని నింపుతున్నాయి.

This post was last modified on April 27, 2021 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

3 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

5 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago