Political News

ఇంటెలిజెన్స్ రిపోర్టు కరెక్టేనా ?

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక విషయంలో ఇంటెలిజెన్స్ నివేదిక ఇపుడు చర్చగా మారింది. తిరుపతి ఉపఎన్నికలో గెలుపే టార్గెట్ గా ఇటూ వైసీపీ అటు టీడీపీ పెద్దఎత్తున పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. రికార్డుస్ధాయిలో మెజారిటి కోసం వైసీపీ నేతలు పోరాటం చేశారు. అదే సమయంలో 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్లను ఎలాగైనా సంపాదించుకోవాలని టీడీపీ నేతలు కూడా అవస్తలుపడ్డారు. సరే ఎవరి పోరాటం ఎలాగున్నా పోలింగ్ అయితే అయిపోయింది.

2019 ఎన్నికల్లో జరిగిన పోలింగ్ తో పోల్చితే మొన్నటి ఉపఎన్నికలో పోలింగ్ బాగా తగ్గిపోయింది. 2019లో 80 శాతం పోలింగ్ నమోదైతే మొన్నటి ఎన్నికలో 64 శాతం మాత్రమే నమోదైంది పోలింగ్. పోలింగ్ శాతం ఎలాగున్నా అంతకు రెండు రోజుల ముందు స్టేట్ ఇంటెలిజెన్స్ ప్రభుత్వంలోని పెద్దలకు ఓ రిపోర్టు అందించారట. నిజంగా ఆ రిపోర్టు అలారమింగ్ గానే ఉంది.

విశ్వసనీయవర్గాల ప్రకారం ఇంటెలిజెన్స్ పంపిన రిపోర్టులో నెల్లూరు జిల్లాలోని గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో పోలింగ్ వైసీపీ అనుకున్నంతగా సానుకూలం కాదట. గూడూరులో వైసీపీ ఎంఎల్ఏ వరప్రసాద్ పైన బాగా బ్యాడ్ ఇమేజి ఉందని రిపోర్టులో చెప్పారట. దానికి తోడు వరప్రసాద్ వైసీపీ ఎంపి అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి గెలుపుకు పెద్దగా కష్టపడలేదని చెప్పారట. ఎంఎల్ఏ మీద వ్యతిరేకతకు తోడు అసలు ఆయనే ప్రచారం చేయని కారణంగా ఇక్కడ వైసీపీకి మైనస్ అయ్యే అవకాశాలున్నాయట.

అలాగే వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డి మీద పార్టీలోనే బాగా వ్యతిరేకత వచ్చేసిందట. ఇదే సమయంలో నేతలను కలుపుకుని వెళ్ళటంలో ఆనం కూడా పెద్దగా ఇంట్రస్టు చూపటంలేదు. దీని ప్రభావం ఉపఎన్నికలో కనబడిందని ఇంటెలిజెన్స్ రిపోర్టులో చెప్పారట. ఇక జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ సపోర్టరుగా ఉన్న వైసీపీ ఎంఎల్ఏ కాకాణి గోవర్ధనరెడ్డి నియోజకవర్గం సర్వేపల్లిలో కూడా పార్టీకి మైనస్ తప్పదని రిపోర్టులో చెప్పారట.

అయితే ఇంటెలిజెన్స్ రిపోర్టు పేరుతో ఓ చర్చ జరుగుతున్నా దాన్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. తమకు అత్యధిక మెజారిటి రావటం ఖాయమంటున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు పేరుతో ప్రచారంలో ఉన్నదంతా టీడీపీ సృష్టిగా కొట్టిపారేస్తున్నారు. తమకు అన్నీ నియోజకవర్గాల్లోను మంచి మెజారిటి రావటం ఖాయమని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. మరి వాస్తవం ఏమిటో తేలాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

This post was last modified on April 26, 2021 2:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

2 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

5 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

6 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

6 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

8 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

8 hours ago