Political News

టీడీపీ మాజీ మంత్రి ఒంట‌ర‌య్యారా ?


మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. ప్ర‌స్తుతం పెద్ద చిక్కులో ప‌డ్డారు. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో ప్ర‌చారం కోసం.. తిరుప‌తికి వ‌చ్చిన ఆయ‌న‌.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేంద్రంగా విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఒక వీడియోను కూడా ప్ర‌ద‌ర్శించారు. అప్ప‌ట్లో తిరుప‌తిపై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేశారంటూ.. ఆయ‌న ఆ వీడియోలో మీడియాకు చూపించారు. దీంతో పార్టీ వైపు ప్ర‌జ‌లు సానుకూలంగా మారుతార‌ని అనుకున్నారు. అయితే.. దీనిని అప్ప‌ట్లో టీడీపీ త‌న‌కు అనుకూలంగా బాగానే ప్ర‌చారం చేసుకుంది. ఇక‌, టీడీపీ అనుకూల మీడియా కూడా దీనిని ప‌దేప‌దే ప్ర‌సారం చేసింది.

అయితే.. జ‌గ‌న్ చేశారంటూ.. మాజీ మంత్రి ఉమా ప్ర‌చారం చేసిన వ్యాఖ్య‌లు బూట‌క‌మ‌ని.. ఆ వీడియో మార్ఫింగ్ చేశార‌ని పేర్కొంటూ.. ఓ వైసీపీ సానుభూతి ప‌రుడు.. సీఐడీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ పోలీసులు కేసులు న‌మోదు చేసి.. ఉమాకు ఇప్ప‌టికి మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. తొలిసారి వాట్సాప్‌లో పంపించారు. దీనికి స్పందించ‌ని నేప‌థ్యంలో విజ‌యవాడ గొల్లపూడిలోని మాజీ మంత్రి ఇంటికి వ‌చ్చి స్వ‌యంగా నోటీసులు అంటించి వెళ్లారు. కేవ‌లం ప‌ది నిముషాల్లోనే సీఐడీ కార్యాల‌యానికి రావాల‌ని దానిలో పేర్కొన‌డం అప్ప‌ట్లో వివాద‌స్ప‌ద‌మైంది. ఇక‌, రెండు రోజుల కింద‌ట కూడా 19వ తారీకు వ‌చ్చి హాజ‌రు కావాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు.

అయిన‌ప్ప‌టికీ.. దేవినేని ఉమా.. స్పందించ‌క‌పోవ‌డంతో 20వ తారీకు నేరుగా ఆయ‌న‌ను క‌లుసుకునేందుకు (అరెస్టు చేసేందుకు అంటున్నారు) గుంటుప‌ల్లికి వ‌చ్చారు. అయితే.. ఉమా ఇంట్లో లేరు. కానీ, టీడీపీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించార‌ని.. తెలుస్తోంది. స‌రే.. ఏం జ‌రుగుతుంది.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. అస‌లు ఇంత జ‌రుగుతున్నా.. టీడీపీ నుంచి అటు లోకేష్ కానీ.. ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు కానీ.. లేదా ఉమా సామాజిక వ‌ర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ.. ఏ ఒక్క‌రూ దీనిపై స్పందించ‌క‌పోవ‌డం.. ఉమాకు అండ‌గా నిల‌వ‌క‌పోవ‌డం వంటివి ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఇంత విప‌త్క‌ర ప‌రిస్థితిలో కూడా ఉమాకు అండ‌గా నిల‌బ‌డ‌క‌పోతే.. ఎలా అనే వారు కూడా క‌నిపిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉమా ఒంట‌ర‌య్యారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. ఇక కృష్ణా జిల్లా టీడీపీ నేత‌లు అంద‌రూ ముందు నుంచి ఉమా విష‌యంలో కాస్త దూరం దూరంగానే ఉంటారు. ఇప్పుడు కూడా వారు ఏ మాత్రం స్పందించ‌డం లేదు.

This post was last modified on April 23, 2021 12:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

1 hour ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

3 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

4 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

5 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

6 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

7 hours ago