Political News

లోకేష్‌కు ఓకే.. హైకోర్టుకు కూడా ఇలానే చెబుతారా?

రాష్ట్రంలో నెల‌కొన్న క‌రోనా తీవ్ర‌తను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని.. అదేవిధంగా ఇంట‌ర్ మీడియెట్ విద్యార్థుల‌కు కూడా త‌ర‌గ‌తులు ర‌ద్దు చేయాల‌ని.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్ స‌ర్కారుకు విన్న‌వించారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి.. ప‌రిస్థితిని స‌మీక్షించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం క‌రోనా ను నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని.. ఎక్క‌డాస‌రైన వ‌స‌తులు కూడా లేవ‌ని.. రోగులు భారీ సంక్య‌లో చ‌చ్చిపోతున్నార‌ని.. ఆయ‌న ఆవేద‌న‌, ఆక్రోశం వ్య‌క్తం చేశారు.

అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా స్పందించిన విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌.. లోకేష్‌ను దుయ్య‌బ ట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనాను ఎంత సీరియ‌స్‌ గా తీసుకుంటోందో.. క‌నిపించ‌డంలేదా? అని ప్ర‌శ్నించారు. లోకేష్ వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్న మంత్రి.. లోకేష్‌లో వ‌య‌సు త‌గ్గ ప‌రిణితి రాలేద‌ని దుయ్య‌బ‌ట్టారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు.. మంత్రి సురేష్‌ కు కొన్నిప్ర‌శ్న‌లు సంధించారు. స‌రే.. లోకేష్ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్య‌లు చేసింది క‌దా.. మ‌రి ఏం చెబుతారు.. మేం చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.. మీకు క‌నిపించ‌డం లేదా?; అని అడుగుతారా? అని ప్ర‌శ్నించారు.

అంతే కాదు.. కోవిడ్ కేంద్రాల్లో ప్ర‌స్తుతం నెల‌కొన్ని దుర్భ‌ర ప‌రిస్థితులు. మౌలిక స‌దుపాయాల కొర‌త వంటి వాటి పై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న‌వార్త‌ల‌ను, వీడియోల‌ను కూడా వారు పోస్ట్ చేశారు. వీటికి ఏం చెబుతారు మంత్రి వ‌ర్యా.. అని వ్యంగ్యాస్త్రాలుసంధిస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి.. విద్యార్థుల ప్రాణాలు కాపాడుతుంటే.. ఇక్క‌డ మాత్రం సందిగ్ధంలో పెట్టి.. వారిని తీవ్ర మ‌న‌క్షోభ‌కు గురిచేయ‌డం ఏమేర‌కు స‌మంజ‌సం.. అని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించ కుండా ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఎదురుదాడి చేయ‌డం త‌గ‌ద‌ని.. ప్ర‌జ‌లు సైతం హ‌ర్షించ‌ర‌ని అంటున్నారు. మ‌రి మంత్రిగారు ఆవేశం త‌గ్గించుకుంటారో లేదో .. చూడాలి.

This post was last modified on April 22, 2021 5:38 pm

Share

Recent Posts

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

50 minutes ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

1 hour ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

4 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

4 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

4 hours ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

5 hours ago