రాష్ట్రంలో నెలకొన్న కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని.. అదేవిధంగా ఇంటర్ మీడియెట్ విద్యార్థులకు కూడా తరగతులు రద్దు చేయాలని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ సర్కారుకు విన్నవించారు.
ఈ క్రమంలోనే ఆయన తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. పరిస్థితిని సమీక్షించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కరోనా ను నిర్లక్ష్యం చేస్తోందని.. ఎక్కడాసరైన వసతులు కూడా లేవని.. రోగులు భారీ సంక్యలో చచ్చిపోతున్నారని.. ఆయన ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు.
అయితే.. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. లోకేష్ను దుయ్యబ ట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఎంత సీరియస్ గా తీసుకుంటోందో.. కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. లోకేష్ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్న మంత్రి.. లోకేష్లో వయసు తగ్గ పరిణితి రాలేదని దుయ్యబట్టారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు.. మంత్రి సురేష్ కు కొన్నిప్రశ్నలు సంధించారు. సరే.. లోకేష్ విషయాన్ని పక్కన పెడితే.. హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది కదా.. మరి ఏం చెబుతారు.. మేం చర్యలు తీసుకుంటున్నాం.. మీకు కనిపించడం లేదా?; అని అడుగుతారా? అని ప్రశ్నించారు.
అంతే కాదు.. కోవిడ్ కేంద్రాల్లో ప్రస్తుతం నెలకొన్ని దుర్భర పరిస్థితులు. మౌలిక సదుపాయాల కొరత వంటి వాటి పై సోషల్ మీడియాలో వస్తున్నవార్తలను, వీడియోలను కూడా వారు పోస్ట్ చేశారు. వీటికి ఏం చెబుతారు మంత్రి వర్యా.. అని వ్యంగ్యాస్త్రాలుసంధిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి.. విద్యార్థుల ప్రాణాలు కాపాడుతుంటే.. ఇక్కడ మాత్రం సందిగ్ధంలో పెట్టి.. వారిని తీవ్ర మనక్షోభకు గురిచేయడం ఏమేరకు సమంజసం.. అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వాస్తవ పరిస్థితులను గమనించ కుండా ప్రస్తుత పరిస్థితిలో ఎదురుదాడి చేయడం తగదని.. ప్రజలు సైతం హర్షించరని అంటున్నారు. మరి మంత్రిగారు ఆవేశం తగ్గించుకుంటారో లేదో .. చూడాలి.
This post was last modified on April 22, 2021 5:38 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…