ఓపక్క కరోనా కేసులు పెరిగి జనాలు నానా కష్టాలు పడుతున్న వేళ.. ప్రభుత్వాలు పెట్టిన నిబంధనల్ని పాటించటం మానేసి.. రోడ్డు మీద రచ్చ చేస్తున్న వారి ఉదంతాలు ఇప్పుడో తలనొప్పిగా మారుతున్నాయి. ఇలాంటి ఉదంతాలు పోలీసులకు కొత్త తిప్పల్ని తెచ్చి పెడుతున్నాయి. గతంలో ఫోన్లకు కెమేరాలు లేకపోవటం.. ఒకవేళ ఉన్నా.. వాటిని వైరల్ చేయటానికి సోషల్ మీడియా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తమకు అనుకూలంగా వీడియోల్ని మార్చుకొని రచ్చ చేసే వారికి కొదవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఆచితూచి అన్నట్లు విధి నిర్వహణ చేయాల్సి వస్తోంది.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి పరిస్థితే నెలకొంది. కారులో వెళుతున్న వారైనా సరే.. ముఖానికి మాస్కు వేసుకోవాలంటూ నిబంధనను తీసుకొచ్చారు. ఇలాంటివేళ.. కొత్త కారులో వెళుతున్న జంట మాస్కులు లేకుండా ప్రయాణించటాన్ని గుర్తించిన పోలీసులు కారును నిలిపారు. అంతేకాదు.. కర్ఫ్యూ వేళలో అత్యవసరమైతే తప్పించి ఇంట్లో నుంచి బయటకు రాకూడదని ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నించగా.. రచ్చ రచ్చ చేశారు.
దరియా గంజ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో సదరు జంట పోలీసులపై దురుసుగా వ్యవహరించటమేకాదు.. వారిని నానా మాటలు అనేయటం గమనార్హం. తనకు మాస్కు లేదని.. తన భర్తను ముద్దు పెట్టుకుంటానని.. తనను ఆపగలరా? అంటూ పోలీసుల్ని దబాయించిన తీరుతో.. వారు మిన్నకుండిపోయారు. మాస్కు ఎందుకు పెట్టుకోలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. నోటికి పని చెప్పిన ఈ జంట రచ్చ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల మీద చక్కర్లు కొడుతున్న జంట తీరును పలువురు తప్పు పడుతున్నారు. విపత్తు వేళ పోలీసులకు.. అధికారుల విధి నిర్వహణకు అడ్డు తగలకుండా ఉండాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్యవహరించిన తీరుపై పలువురు మండి పడుతున్నారు. ఈ జంట చేసిన ఓవర్ యాక్షన్ కు ప్రతిగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. రూల్స్ ను బ్రేక్ చేసే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on April 19, 2021 9:33 pm
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనను సంతృప్తి పరచడం లేదని బాహాటంగానే…