‘రెండేళ్ళల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుంది’ …ఇది తాజాగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో మూడు రోజుల నిరాహార దీక్షను ముగించిన సందర్భంగా షర్మిల పై వ్యాఖ్య చేశారు. తెలంగాణా రాజకీయాల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ వ్యాక్యూమ్ ను భర్తీ చేసేంత సీన్ షర్మిలకు ఉందా అన్నదే అసలైన ప్రశ్న.
టీడీపీ నిర్వీర్యమైపోయిందన్నది వాస్తవం. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యేందుకు నానా అవస్తలు పడుతోంది. ఇక బీజేపీది వాపేకానీ బలుపు కాదనేది జనాబిప్రాయం. ఈ పరిస్దితుల్లో టీఆర్ఎస్ కు ప్రత్యర్ధిపార్టీల నుండి పెద్దగా సవాళ్ళు ఎదురయ్యే అవకాశం లేదన్నది వాస్తవం. అయితే టీఆర్ఎస్ ను ఢీ కొనేంత సీన్ ప్రత్యర్ధులకు లేకపోతే ఆపనిని జనాలే చేస్తారు.
టీఆర్ఎస్ కు ప్రత్యర్ధులను జనాలే తయారుచేస్తారు. ఈ పద్దతిలోనే బీజేపీని నాలుగు ఎంపి స్ధానాల్లో జనాలు గెలిపించారు. అయితే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ప్రజాక్షేత్రంలో దశాబ్దాలుగా ఉన్న పార్టీలే. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్ధితి బాగా క్షీణించిపోయింది. పూర్వవైభవం కోసం ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటంలేదు. ఇలాంటి పరిస్దితుల్లో రాజన్నరాజ్యం అంటు షర్మిల తెలంగాణాలో అడుగుపెట్టారు.
రాజకీయాధికారం అందుకోవాలని అనుకోవటంలో తప్పులేదు కానీ అందుకు అవసరమైన అడుగులు వేస్తున్నారా ? అన్నదే సందేహం. ఎందుకంటే ఇంతవరకు పార్టీ పెట్టలేదు. జెండా, అజెండా, పాలసీ ఏమీ ప్రకటించలేదు. పార్టీ పెట్టకుండానే నిరాహారదీక్ష చేస్తే పెద్దగా స్పందన కనిపించలేదు. అలాంటిది అసలు పార్టీనే పెట్టకుండా రెండేళ్ళల్లో అధికారంలోకి వచ్చేస్తామని షర్మిల చేసిన ప్రకటనే హాస్యాస్పదంగా ఉంది.
అధికారంలోకి రావటమే అజెండాగా తెలంగాణాలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ఏపిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంటివాళ్ళు చాలా ప్రకటనలు చేసి చివరకు అభాసుపాలయ్యారు. కాబట్టి ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని షర్మిల జాగ్రత్తగా అడుగులు వేయకపోతే కోదండరామ్, పవన్ జాబితాలో చేరిపోవటం ఖాయం.
This post was last modified on April 19, 2021 10:48 am
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…