తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో మరోసారి వలంటీర్లదే.. హవా కనిపిస్తోంది. పైకి మాత్రం వలంటీర్లకు పోలింగ్కు సంబంధం ఏంటని మంత్రుల నుంచి నేతల వరకు ఎదురు ప్రశ్నలు సంధించారు. కానీ, ఎప్పటికప్పుడు.. ఏ ఎన్నికలు వచ్చినా వలంటీర్లదే ప్రధాన పాత్ర కనిపిస్తోంది. ఓటర్లను ప్రభావితం చేయ డంతోపాటు.. ప్రభుత్వ పథకాల విషయంలో వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారనేది ప్రధానంగా వలంటీర్లపై వస్తున్న విమర్శలు. సో.. మొత్తానికి చూస్తే.. తిరుపతి ఉప పోరులోనూ.. వలంటీర్లదే అంతా.. అన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం చవటపాళెం, గిరిజన కాలనీ, ఎరుకల కాలనీ, బేల్దారి కాలనీ, అడివయ్య కాలనీలల్లో సగం మందికి ఓటరు స్లిప్పులు అందలేదు. ఆ స్లిప్స్ అన్నీ వాలంటీర్ల ఇళ్ళల్లో ఉన్నట్లు ప్రతిపక్షాల నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఓటర్లు.. వాలంటీర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచీ నెల్లూరు జిల్లా వాలంటీర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. కొందరు వాలంటీర్లు దగ్గరుండి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓట్లేయిస్తుండగా.. మరికొందరు ఓటర్ల స్పిప్స్ తీసేసుకుని ఇళ్లలో దాచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే వాలంటీర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంతో చిత్తూరు జిల్లాలో వరుస ఫిర్యాదులతో పది మందిని తొలగించినట్లు ఎన్నికల అధికారి చక్రధర్ బాబు వెల్లడించారు. ఇక్కడ మంత్రి అనిల్ కుమార్ ప్రభావం ఎక్కువగా ఉందని టీడీపీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీలోను, వైసీపీకే ఓటేయాలంటూ.. ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడం గమనార్హం. అయితే.. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల కమిషన్.. వలంటీర్ల విషయంపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
This post was last modified on April 17, 2021 4:22 pm
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…