ఏపీలో పొలిటికల్ టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 8న జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సం బంధించిన ఫలితాల వెల్లడి ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ను హుటాహుటిన రాత్రికి రాత్రి జారీ చేయడంపై టీడీపీ నేత వర్ల రామయ్య సహా పలువురు కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో విచారించిన కోర్టు.. ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినా.. ఓట్ల లెక్కింపు, ఫలితం మాత్రం విడుదల చేయరాదని తీర్పు చెప్పింది.
ఇక, ఈ కేసులపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు..రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లమీద హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ జనసేన, టీడీపీ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే, అందరి వాదనలు వచ్చే సోమవారం వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా పడింది.
కానీ, ఈ విషయంలో మొత్తం మూడు అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉన్న ఎన్నికల కమిషన్ కార్యాలయం.. కేవలం రెండు అంశాలపైనే అఫిడవిట్లు దాఖలు చేసింది. ఒకటి.. కొత్తగా నోటిఫికేషన్ను ఎందుకు అంత వేగంగా ఇవ్వాల్సి వచ్చింది? గత ఏడాది జరిగిన నామినేషన్ల సమయంలో ఘర్షణలు, బలవంతపు ఉపసంహరణలు వంటి అంశాలతో పాటు.. కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే అంశంపై కోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కానీ, ఎన్నికల కమిషన్ మాత్రం నోటిఫికేషన్ ఇచ్చే అంశంపై అఫిడవిట్ దాఖలు చేయలేదు. దీనినే హైకోర్టు తాజా విచారణలో ప్రశ్నించడంతో.. మరికొంత గడువు కావాలని ఎన్నికల కమిషన్ కోరడంతో 19వ తారీకుకు కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. దీంతో.. పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మరోసారి బ్రేక్ పడినట్టు అయింది. ఫలితంగా రాజకీయనేతలు, పార్టీల మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉండడం గమనార్హం.
This post was last modified on April 15, 2021 6:02 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…