Political News

ఏపీలో టెన్ష‌న్ టెన్ష‌న్‌.. ప‌రిష‌త్ రిజ‌ల్ట్ ఇప్ప‌ట్లో లేన‌ట్టే!

ఏపీలో పొలిటిక‌ల్ టెన్షన్ కొన‌సాగుతూనే ఉంది. ఈ నెల 8న జ‌రిగిన జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సం బంధించిన ఫ‌లితాల వెల్ల‌డి ఇప్ప‌ట్లో తేలేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం ప‌రిష‌త్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ‌ను హుటాహుటిన రాత్రికి రాత్రి జారీ చేయ‌డంపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య స‌హా పలువురు కోర్టుకెక్కారు. ఈ నేప‌థ్యంలో విచారించిన కోర్టు.. ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇచ్చినా.. ఓట్ల లెక్కింపు, ఫ‌లితం మాత్రం విడుద‌ల చేయరాద‌ని తీర్పు చెప్పింది.

ఇక‌, ఈ కేసుల‌పై తాజాగా విచార‌ణ జ‌రిపిన హైకోర్టు..రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లమీద హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ జనసేన, టీడీపీ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే, అందరి వాదనలు వచ్చే సోమవారం వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా పడింది.

కానీ, ఈ విష‌యంలో మొత్తం మూడు అఫిడ‌విట్లు దాఖలు చేయాల్సి ఉన్న ఎన్నిక‌ల క‌మిష‌న్ కార్యాల‌యం.. కేవ‌లం రెండు అంశాల‌పైనే అఫిడ‌విట్లు దాఖ‌లు చేసింది. ఒక‌టి.. కొత్తగా నోటిఫికేష‌న్‌ను ఎందుకు అంత వేగంగా ఇవ్వాల్సి వ‌చ్చింది? గ‌త ఏడాది జ‌రిగిన నామినేష‌న్ల స‌మ‌యంలో ఘ‌ర్ష‌ణ‌లు, బ‌ల‌వంత‌పు ఉప‌సంహ‌ర‌ణ‌లు వంటి అంశాలతో పాటు.. కొత్త‌గా నోటిఫికేష‌న్ ఇచ్చే అంశం‌పై కోర్టు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.

కానీ, ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం నోటిఫికేష‌న్ ఇచ్చే అంశంపై అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌లేదు. దీనినే హైకోర్టు తాజా విచార‌ణ‌లో ప్ర‌శ్నించ‌డంతో.. మ‌రికొంత గ‌డువు కావాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ కోర‌డంతో 19వ తారీకుకు కేసు విచార‌ణ‌ను కోర్టు వాయిదా వేసింది. దీంతో.. ప‌రిష‌త్ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌కు మ‌రోసారి బ్రేక్ ప‌డిన‌ట్టు అయింది. ఫ‌లితంగా రాజ‌కీయ‌నేత‌లు, పార్టీల మ‌ధ్య టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కొన‌సాగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 15, 2021 6:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago