ఏపీలో పొలిటికల్ టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 8న జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సం బంధించిన ఫలితాల వెల్లడి ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ను హుటాహుటిన రాత్రికి రాత్రి జారీ చేయడంపై టీడీపీ నేత వర్ల రామయ్య సహా పలువురు కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో విచారించిన కోర్టు.. ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినా.. ఓట్ల లెక్కింపు, ఫలితం మాత్రం విడుదల చేయరాదని తీర్పు చెప్పింది.
ఇక, ఈ కేసులపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు..రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లమీద హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ జనసేన, టీడీపీ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే, అందరి వాదనలు వచ్చే సోమవారం వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా పడింది.
కానీ, ఈ విషయంలో మొత్తం మూడు అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉన్న ఎన్నికల కమిషన్ కార్యాలయం.. కేవలం రెండు అంశాలపైనే అఫిడవిట్లు దాఖలు చేసింది. ఒకటి.. కొత్తగా నోటిఫికేషన్ను ఎందుకు అంత వేగంగా ఇవ్వాల్సి వచ్చింది? గత ఏడాది జరిగిన నామినేషన్ల సమయంలో ఘర్షణలు, బలవంతపు ఉపసంహరణలు వంటి అంశాలతో పాటు.. కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే అంశంపై కోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కానీ, ఎన్నికల కమిషన్ మాత్రం నోటిఫికేషన్ ఇచ్చే అంశంపై అఫిడవిట్ దాఖలు చేయలేదు. దీనినే హైకోర్టు తాజా విచారణలో ప్రశ్నించడంతో.. మరికొంత గడువు కావాలని ఎన్నికల కమిషన్ కోరడంతో 19వ తారీకుకు కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. దీంతో.. పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మరోసారి బ్రేక్ పడినట్టు అయింది. ఫలితంగా రాజకీయనేతలు, పార్టీల మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉండడం గమనార్హం.
This post was last modified on April 15, 2021 6:02 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…