నందమూరి వంశంలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఏకైక ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ కేవలం సినిమాల్లో మాత్రమే కాదు… అటు రాజకీయ రంగంలో కూడా నందమూరి వంశం పరువు నిలబెడతారన్న అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు సినిమా రంగంలో అగ్ర హీరోగా ఉన్న ఎన్టీఆర్పై ఇప్పుడు ఎక్కడా లేని విపరీతమైన ప్రెజర్ అయితే ఉంది. ఎన్టీఆర్పై ఉన్న ప్రెజర్ సినిమాల గురించి కాదు.. ఆయన దూరంగా ఉంటోన్న రాజకీయాల గురించే అన్న చర్చలు నందమూరి కాంపౌండ్ వర్గాల నుంచే బయటకు పొక్కుతున్నాయి.
2009 ఎన్నికల్లో గెలుపు కోసం బాబు స్వయంగా ఎన్టీఆర్ను ఒప్పించి ప్రచారంలో దింపారు. కొద్ది రోజుల పాటు ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన ప్రమాదానికి గురి కావడంతో ప్రచారాం ఆర్ధాంతంగా ఆగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. తర్వాత చంద్రబాబు మేనకోడలు కుమార్తెతో ఎన్టీఆర్ వివాహం జరిగినప్పటి నుంచి ఎన్టీఆర్కు బాబు, బాలయ్యతో దూరం పెరుగుతూ వచ్చింది. చివరకు 2014 ఎన్నికల్లో చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లి మరీ ప్రచారానికి ఒప్పించుకున్నారు.
ఇక 2019లో పవన్ కూడా బాబుకు దూరం అయ్యారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడడంతో పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కే పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. చివరకు చంద్రబాబు సభల్లోనూ ఇదే డిమాండ్ పార్టీ కేడర్ నుంచి వినిపిస్తోంది. టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇదే మాట చెప్పారు. ఇక టీడీపీ అనుకూల మీడియా కూడా లోకేష్ను మోసినా ఉపయోగం లేదని.. ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తేనే పార్టీకి పునర్వైభవం వస్తుందన్న అంచనాల్లో ఉంది.
ఇక టీడీపీనే అంటి పెట్టుకుని ఉన్న బలమైన నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్పై ఒత్తిడి తెచ్చే పనిలో బిజీ అవుతున్నారట. అయితే వీళ్లంతా ఇప్పటికప్పుడు పార్టీలో కీలక స్థానం ఇవ్వడం కుదరదని.. భవిష్యత్తు అంతా నీదేగా అని ఎన్టీఆర్తో నర్మగర్భంగా అంటున్నారట. అంటే వచ్చే ఎన్నికల కోసం మళ్లీ ఎన్టీఆర్ను వాడుకునే పనిలో చంద్రబాబు & గ్యాంగ్ నిమగ్నమైందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఎన్టీఆర్కు చాలా యేళ్ల పాటు సినీ కెరీర్ ఉంది. దానిని ఇప్పుడే పణంగా పెట్టి రాజకీయాల్లోకి వస్తారా ? మళ్లీ చంద్రబాబు కోసం ఆయన పనిచేస్తారా ? లేదా స్వతంత్య్రంగా వస్తారా ? అన్నది చూడాలి.
This post was last modified on April 14, 2021 12:12 pm
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…