Political News

దేశంలో కుంభమేళా కలకలం

ఉత్తరాఖండ్ లోని హరిద్వారాలో జరుగుతున్న కుంభమేళ కరోనా వైరస్ నేపధ్యంలో కలకలం సృష్టిస్తోంది. రోజుకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే కుంభమేళాను అదుపుచేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఎక్కువమంది ఒకచోట గుమిగూడవద్దని ఒకవైపు చెబుతున్న కేంద్రప్రభుత్వం అసలు కుంభమేళాకు ఎలా అనుమతిచ్చిందనేదే అసలైన ప్రశ్న.

కుంభమేళాలో రోజుకు సగటున 28 లక్షల మంది భక్తులు హాజరవుతున్నట్లు అంచనా. ఇన్ని లక్షలమంది ఒకేసారి వివిధ ఘాట్లలో స్నానాలు చేయటం, ఒకేచోట పూజలు చేస్తుండటంతో కరోనా వైరస్ చాలా స్పీడుగా వ్యాపిస్తోంది. అధికారికంగా రోజుకు వెయ్యిమందికి కరోనా వైరస్ సోకుతున్నట్లు చెబుతున్నారు. అంటే అనధికారికంగా ఈ లెక్క భారీగా ఉంటుందని అంచనా.

సోమవారం 28 లక్షల మంది భక్తులు కుంభమేళాకు హాజరైతే కరోనా టెస్టులు చేసింది కేవలం 18,169 మందికి మాత్రమే. అంటే కనీసం ఒక్కశాతానికి కూడా ప్రభుత్వయంత్రాంగం పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు నిర్వహించిన వారిలో వెయ్యిమందికి వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది. మరి మిగిలిన 27 లక్షల చిల్లర భక్తులకు కూడా టెస్టులు చేస్తే ఎంతమందికి సోకిందనే విషయం బయపటడుతుంది.

అయితే కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీ నే కాబట్టి కోవిడ్ నిబంధనలను పాటించకపోయినా ఎవరు పట్టించుకోవటంలేదు. పైగా కుంభమేళాలో పాల్గొంటున్న భక్తులు సూపర్ స్ప్రెడర్లు కారని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పటమే విచిత్రంగా ఉంది. లక్షలాదిమంది భక్తులు కరోనా వైరస్ సూపర్ స్ర్పెడర్లు కాకపోతే మరి మిగిలిన రాష్ట్రాల్లో జన సమూహాల విషయాల్లో కేంద్రం ఎందుకని ఆందోళన పడుతోంది.

This post was last modified on April 14, 2021 11:48 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

5 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

6 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

7 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

8 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

8 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

9 hours ago