Political News

దేశంలో కుంభమేళా కలకలం

ఉత్తరాఖండ్ లోని హరిద్వారాలో జరుగుతున్న కుంభమేళ కరోనా వైరస్ నేపధ్యంలో కలకలం సృష్టిస్తోంది. రోజుకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే కుంభమేళాను అదుపుచేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఎక్కువమంది ఒకచోట గుమిగూడవద్దని ఒకవైపు చెబుతున్న కేంద్రప్రభుత్వం అసలు కుంభమేళాకు ఎలా అనుమతిచ్చిందనేదే అసలైన ప్రశ్న.

కుంభమేళాలో రోజుకు సగటున 28 లక్షల మంది భక్తులు హాజరవుతున్నట్లు అంచనా. ఇన్ని లక్షలమంది ఒకేసారి వివిధ ఘాట్లలో స్నానాలు చేయటం, ఒకేచోట పూజలు చేస్తుండటంతో కరోనా వైరస్ చాలా స్పీడుగా వ్యాపిస్తోంది. అధికారికంగా రోజుకు వెయ్యిమందికి కరోనా వైరస్ సోకుతున్నట్లు చెబుతున్నారు. అంటే అనధికారికంగా ఈ లెక్క భారీగా ఉంటుందని అంచనా.

సోమవారం 28 లక్షల మంది భక్తులు కుంభమేళాకు హాజరైతే కరోనా టెస్టులు చేసింది కేవలం 18,169 మందికి మాత్రమే. అంటే కనీసం ఒక్కశాతానికి కూడా ప్రభుత్వయంత్రాంగం పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు నిర్వహించిన వారిలో వెయ్యిమందికి వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది. మరి మిగిలిన 27 లక్షల చిల్లర భక్తులకు కూడా టెస్టులు చేస్తే ఎంతమందికి సోకిందనే విషయం బయపటడుతుంది.

అయితే కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీ నే కాబట్టి కోవిడ్ నిబంధనలను పాటించకపోయినా ఎవరు పట్టించుకోవటంలేదు. పైగా కుంభమేళాలో పాల్గొంటున్న భక్తులు సూపర్ స్ప్రెడర్లు కారని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పటమే విచిత్రంగా ఉంది. లక్షలాదిమంది భక్తులు కరోనా వైరస్ సూపర్ స్ర్పెడర్లు కాకపోతే మరి మిగిలిన రాష్ట్రాల్లో జన సమూహాల విషయాల్లో కేంద్రం ఎందుకని ఆందోళన పడుతోంది.

This post was last modified on April 14, 2021 11:48 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

1 hour ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

3 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

3 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

5 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

8 hours ago