రాష్ట్ర బీజేపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. సామాజిక వర్గాలను సమీకరించడంలోను.. ఓటు బ్యాంకును పెంచుకోవడంలోను, ఉన్న ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడంలోను నాయకులు విఫలమవుతున్నారు. గతంలో అంటే.. పదేళ్ల కిందట చూసుకుంటే.. బీజేపీకి కూడా కొన్ని ప్రాంతాల్లో సంస్థాగతంగా ఓటు బ్యాంకు ఏర్పడింది. తర్వాత.. అప్పటి నాయకులు ఆ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే.. ఇంతలోనే జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో కీలక నేతలు జాతీయ రాజకీయాలకు.. రాజ్యాంగ బద్ధమైన పదవులకు పరిమితమయ్యారు.
ఈ క్రమంలో వరుసగా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు రాష్ట్ర బీజేపీ పగ్గాలను అప్పగించారు. కొన్నాళ్ల కిందటి వరకు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ చీఫ్గా ఉన్నారు. ఆయన ఓటు బ్యాంకును పెంచేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే.. వర్గాలుగా ఏర్పడిన బీజేపీలో కన్నా ఆదేశాలను పక్కన పెట్టారే తప్ప.. దూర దృష్టితో పార్టీని బలోపేతం చేసుకునే ఆలోచన ఏ ఒక్కరూ చేయలేదు. ఇక, ఇప్పుడు సోము వీర్రాజు పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయన కూడా పార్టీ పగ్గాలు చేపట్టి సంవత్సరం అవుతోంది. అయితే.. ఇప్పటి వరకు ఓటు బ్యాంకును పెంచుకోవడం అటుంచితే.. ఉన్న ఓటు బ్యాంకు కూడా గల్లంతవుతోంది.
స్థానిక ఎన్నికల్లోను, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఈ తరహా పరిస్థితి కనిపించింది. 2019 ఎన్నికల్లో 4.2 శాతంగా ఉన్న ఓటు బ్యాంకు.. స్థానికం దగ్గరకు వచ్చేసరికి 1శాతానికి పడిపోయింది. ఇక, ఇప్పుడు తిరుపతి ఉప పోరులో నెగ్గడం అటుంచితే.. కనీసం డిపాజిట్ వస్తుందా ? అని ఆ పార్టీ సీనియర్ల మధ్యే అంతర్గతంగా చర్చ జరుగుతుండడం గమనార్హం. ఈ ఉప ఎన్నిక కోసం బీజేపీ ఏకంగా జాతీయ స్థాయి నేతలను కూడా ప్రచార రంగంలోకి దించింది. మొన్నటి వరకు టీడీపీని మూడో ప్లేస్కు నెట్టేస్తామని బీరాలు పోయిన బీజేపీ నేతల్లో ఇప్పుడు లోలోన తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందట.
ఈ పరిణామాలు అన్ని సోమును కూడా టెన్షన్ పెడుతున్నాయంటున్నారు. ఆయన హయాంలో జరుగుతున్న అత్యంత కీలకమైన ఎన్నిక కావడంతో ఇక్కడ కనీస గౌరవం దక్కించుకుంటేనే ఆయనకు చీఫ్ పదవి ఉంటుందని.. లేక పోతే.. దానిని వేరేవారికి అందునా.. సీమ ప్రాంతానికి చెందిన సత్యకుమార్కు ఇస్తారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఇదే నిజమైతే.. సోము ఓ విఫలమైన నాయకుడిగా మిగిలిపోవడం ఖాయమం టున్నారు పరిశీలకులు.
This post was last modified on April 13, 2021 1:16 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…