తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి తొలి ఎదురు దెబ్బ తగిలింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏప్రిల్ 14న హాలియాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. దాదాపు లక్ష మంది తో ఈ సభ నిర్వహించేలా ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటనలు కూడా ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని.. మాస్కులు ధరించాలని.. చెబుతున్న ప్రభుత్వం.. ప్రజలపై జరిమానా కొరడా ఝళిపిస్తున్న సర్కారు..లక్ష మందితో సభ ఎలా నిర్వహిస్తుంది? అనేది కీలక ప్రశ్న.
అంతేకాదు.. అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని హాలియా రైతుల హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోవిడ్ నిబంధనల ప్రకారం లక్ష మందితో సభ పెట్టడానికి వీల్లేదని, కోవిడ్ పేరుతో పండగలు చేసుకోవద్దంటున్న ప్రభుత్వం.. లక్ష మందితో సభ ఎలా పెడుతారని పిటిషన్లో పేర్కొన్న రైతులు. రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఈ సభను రద్దుచేయాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ను యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్ కొలిశెట్టి శివ కుమార్ కోరారు. అటు రైతులు, ఇటు స్వచ్ఛంద సంస్థల పిటిషన్లు సంచలనంగా మారాయి. మరో రెండు రోజుల్లోనే సభ ఉండడం ఇప్పుడు ఇలా వ్యతిరేకత రావడం కేసీఆర్కు ఇబ్బందికరంగా పరిణమించింది.
ఇక, ఈ వ్యవహారం రాజకీయంగా కూడా కేసీఆర్కు ఇబ్బంది పెడుతోంది. వాస్తవానికి ఇప్పటి వరకు కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా.. ఎలాంటి వ్యతిరేకతా రాలేదు. కానీ, ఇప్పుడు సాగర్ ఎన్నికల సమయంలో ఇలా వ్యతిరేకత రావడం అంటే.. ఇది ప్రజల నుంచి వచ్చిందా? లేక ప్రతిపక్షాలు ఉద్దేశ పూర్వంగానే చేస్తున్నాయా? అనే చర్చ తెలంగాణ భవన్లో జోరుగా వినిపిస్తోంది. ఇది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతే అయితే.. సాగర్ సమరం .. ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. ఒకవేళ ప్రతిపక్షాలు కనుక ప్రజలను రెచ్చగొడితే.. దీనికి అంతే దీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఏదేమైనా.. సాగర్లో కేసీఆర్ సభకు తొలి అడుగులో నే ఇంత వ్యతిరేకత రావడం చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on April 13, 2021 1:00 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…