Political News

వైసీపీ గెలిస్తే టీడీపీని మూసేస్తారా ?

రాజకీయంగా సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలైనాక అసెంబ్లీలో తీర్మానం చేయాలట. తీర్మానం తర్వాత రెండుపార్టీల ఎంఎల్ఏలు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలట. అప్పుడు వైసీపీ గెలిస్తే తెలుగుదేశం పార్టీని మూసేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాలు విసిరారు. మరి అచ్చెన్న సవాలుకు చంద్రబాబునాయుడు అనుమతి ఉందో లేదో తెలీదు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాజకీయంగా చేసుకునే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు ఎక్కడా, ఎప్పుడు ఆచరణలోకి వచ్చిన దాఖలాలు లేవు. అనవసరంగా ఎన్నికల హీట్ పెంచటం కోసమే ఇలాంటివి తెరపైకి వస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వెంటనే రాజీనామా చేయాలంటు ఇప్పటికి చంద్రబాబునాయుడు అండ్ కో కొన్ని వందలసార్లు డిమాండ్ చేసుంటారు. జగన్ రాజీనామా చేయరని తెలిసీ పదే పదే అవే డిమాండ్లు చేయటంలో ఉద్దేశ్యం ఏమిటి ?

ప్రత్యేకహోదా సాధించనందుకు వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతకుముందు ఇదే డిమాండ్ ను జగన్ చేసినపుడు చంద్రబాబు స్పందించలేదు. ముందు వైసీపీ ఎంపిలను రాజీనామాలు చేయమన్నారు. దాంతో తన ఐదుగురు ఎంపిలతో జగన్ రాజీనామా చేయించారు. దాంతో ఏం మాట్లాడాలో అర్ధంకాని చంద్రబాబు అండ్ కో వెంటనే వైసీపీ ఎంపిల రాజానామాల డిమాండ్ అంతా డ్రామాలంటు కొత్త డ్రామాకు తెరతీశారు.

కాలం జోరుగా తిరిగిపోయి జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికారపార్టీ ఎంపిల రాజీనామాకు పదే పదే డిమాండ్ చేస్తోంది. అప్పట్లో తన ఎంపిలతో జగన్ రాజీనామాలు చేయించినట్లే ఇపుడు చంద్రబాబు కూడా చేయించవచ్చు. కానీ ఆపని మాత్రం చేయటంలేదు. ఇపుడు తిరుపతి ఉపఎన్నికల సమయంలో రాజీనామాల ప్రస్తావన మొదలైంది. తాము ఓడిపోతే తమ ఎంపిలందరు రాజీనామాలు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు.

ఒకవేళ వైసీపీ గెలిస్తే టీడీపీ నలుగురు ఎంపిలు అంటే వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజుతో కలిపి రాజీనామాలు చేస్తారా ? అన్నది పెద్దిరెడ్డి సవాలు. ఇష్టముంటే దానికి సమాధానం చెప్పాలి లేకపోతే లేదు. అంతేకానీ ఎంఎల్ఏలందరం రాజీనామాలు చేద్దామంటూ అచ్చెన్న సవాలు విసరటం విచిత్రంగా ఉంది. ఉపఎన్నికలో తమదే అఖండ విజయమని అచ్చెన్న పదే పదే చెబుతున్నారు. మరదే నిజమైతే పెద్దిరెడ్డి సవాలును అంగీకరిస్తే సరిపోతుంది కదా.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

7 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

7 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

9 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

10 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

12 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

12 hours ago