Political News

వైసీపీ గెలిస్తే టీడీపీని మూసేస్తారా ?

రాజకీయంగా సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలైనాక అసెంబ్లీలో తీర్మానం చేయాలట. తీర్మానం తర్వాత రెండుపార్టీల ఎంఎల్ఏలు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలట. అప్పుడు వైసీపీ గెలిస్తే తెలుగుదేశం పార్టీని మూసేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాలు విసిరారు. మరి అచ్చెన్న సవాలుకు చంద్రబాబునాయుడు అనుమతి ఉందో లేదో తెలీదు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాజకీయంగా చేసుకునే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు ఎక్కడా, ఎప్పుడు ఆచరణలోకి వచ్చిన దాఖలాలు లేవు. అనవసరంగా ఎన్నికల హీట్ పెంచటం కోసమే ఇలాంటివి తెరపైకి వస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వెంటనే రాజీనామా చేయాలంటు ఇప్పటికి చంద్రబాబునాయుడు అండ్ కో కొన్ని వందలసార్లు డిమాండ్ చేసుంటారు. జగన్ రాజీనామా చేయరని తెలిసీ పదే పదే అవే డిమాండ్లు చేయటంలో ఉద్దేశ్యం ఏమిటి ?

ప్రత్యేకహోదా సాధించనందుకు వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతకుముందు ఇదే డిమాండ్ ను జగన్ చేసినపుడు చంద్రబాబు స్పందించలేదు. ముందు వైసీపీ ఎంపిలను రాజీనామాలు చేయమన్నారు. దాంతో తన ఐదుగురు ఎంపిలతో జగన్ రాజీనామా చేయించారు. దాంతో ఏం మాట్లాడాలో అర్ధంకాని చంద్రబాబు అండ్ కో వెంటనే వైసీపీ ఎంపిల రాజానామాల డిమాండ్ అంతా డ్రామాలంటు కొత్త డ్రామాకు తెరతీశారు.

కాలం జోరుగా తిరిగిపోయి జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికారపార్టీ ఎంపిల రాజీనామాకు పదే పదే డిమాండ్ చేస్తోంది. అప్పట్లో తన ఎంపిలతో జగన్ రాజీనామాలు చేయించినట్లే ఇపుడు చంద్రబాబు కూడా చేయించవచ్చు. కానీ ఆపని మాత్రం చేయటంలేదు. ఇపుడు తిరుపతి ఉపఎన్నికల సమయంలో రాజీనామాల ప్రస్తావన మొదలైంది. తాము ఓడిపోతే తమ ఎంపిలందరు రాజీనామాలు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు.

ఒకవేళ వైసీపీ గెలిస్తే టీడీపీ నలుగురు ఎంపిలు అంటే వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజుతో కలిపి రాజీనామాలు చేస్తారా ? అన్నది పెద్దిరెడ్డి సవాలు. ఇష్టముంటే దానికి సమాధానం చెప్పాలి లేకపోతే లేదు. అంతేకానీ ఎంఎల్ఏలందరం రాజీనామాలు చేద్దామంటూ అచ్చెన్న సవాలు విసరటం విచిత్రంగా ఉంది. ఉపఎన్నికలో తమదే అఖండ విజయమని అచ్చెన్న పదే పదే చెబుతున్నారు. మరదే నిజమైతే పెద్దిరెడ్డి సవాలును అంగీకరిస్తే సరిపోతుంది కదా.

This post was last modified on April 12, 2021 10:57 am

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago