Political News

జగన్-కేసీఆర్ ‘నీటి’ చిచ్చు: పరిష్కారం అంత సులభం కాదా?

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్త పంచాయతీ వచ్చింది. గతంలో చంద్రబాబు-కేసీఆర్ మధ్య విభేదాలు సహజంగా కనిపించాయి. సెక్షన్ 8 నుండి మొదలు పెడితే హైకోర్టు విభజన, విద్యుద్ ఉద్యోగుల విభజన, 9, 10వ షెడ్యూల్.. ఎలా ఎన్నో అంశాల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తీవ్రమైన విభేదాలు కనిపించాయి. ఆ సమయంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్-కేసీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లుగా చాలామంది భావించారు. ఎన్నికల తర్వాత కూడా చాలాకాలం వరకు ఇలాగే కొనసాగింది.

చంద్రబాబు-కేసీఆర్ మధ్య రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలకు రాజకీయ వైరం తోడయిందనేది చాలామంది అభిప్రాయం. ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఎన్నో సమస్యలు అంత సులభంగా కాకపోయినప్పటికీ.. జగన్-కేసీఆర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల సామరస్యంగా పరిష్కారమవుతాయని భావించినవారు ఎంతోమంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు తమ తమ రాష్ట్రాల కోసం పని చేసే క్రమంలో ఎంత సాన్నిహిత్యం ఉన్నా ఇబ్బందులు తప్పవని, ప్రతి సమస్యని సామరస్యంగా పరిష్కరించడం అంత సులువైన విషయం ఏమీ కాదని తేటతెల్లమైందంటున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుండి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిపై కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కృష్ణా నీటిని లిఫ్ట్ చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలనే ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఏకపక్షమని, ఇది ఏపీ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణను సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ సర్కార్ చేసిన తప్పిదాలు అన్నారు.

తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. దీనిపై వెంటనే కృష్ణా ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పరస్పరం సహకారంతో ముందుకు సాగుదామని తాము చెబుతుంటే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తోందన్నారు. వాటాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు.

ఈ సంవత్సరం 800 టీఎంసీల నీరు సముద్రం పాలయిందని, ఈ నేపథ్యంలో వరదనీరు దుర్వినియోగం కాకుండా ఉండేలా ఎత్తిపోతల పథకం ద్వారా వరద నీటిని సద్వినియోగం చేసుకుంటున్నామనేది ఏపీ అభిప్రాయం.

This post was last modified on May 12, 2020 12:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago