Political News

దీక్షితులు ఎఫెక్ట్‌: ప్ల‌స్ క‌న్నా మైన‌స్ ఎక్కువా ?

ఏపీ సీఎం జ‌గ‌న్‌ను నారాయ‌ణ‌మూర్తిగా అభివ‌ర్ణిస్తూ.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ ప్ర‌ధాన అర్చుకుడు ర‌మ‌ణ దీక్షితులు చేసిన వ్యాఖ్య‌లు.. వైసీపీకి ప్ల‌స్ క‌న్నా మైన‌స్‌గానే ఎక్కువ‌గా మారాయి. ఆ పార్టీ నేత‌లు.. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేక పోతున్నారు.. మ‌రోవైపు.. సొంత పార్టీకి చెందిన అస‌మ్మ‌తి ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఈ వ్యాఖ్య‌లను దుయ్య‌బ‌ట్టారు. దీంతో ర‌మ‌ణ దీక్షితులు త‌న‌కు తాను వైసీపీకి మైలేజీ ఇచ్చుకున్నాన‌ని చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. ఇది వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌జ‌రుగుతున్న నేప‌థ్యంలో స్థానికంగా ఉన్న హిందూ వ‌ర్గాన్ని శాంతింప జేసేందుకు, వైసీపీ వైపు వారి దృష్టిని మ‌ళ్లించేందుకు గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోను ర‌ద్దు చేస్తూ.. వంశ‌పారంప‌ర్య అర్చ‌క‌త్వం, అర్చ‌కుల‌కు వ‌యోప‌రిమితి వంటివాటిని ఎత్తేస్తూ.. సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వాస్త‌వానికి ఆయ‌న అధికారంలోకి రాగానే ఈ నిర్ణ‌యం తీసుకుంటార‌ని అంద‌రూ భావించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న జ‌గ‌న్‌.. ఇప్పుడు తిరుప‌తి ఉప పోరు నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం .. రాజ‌కీయంగా వివాదానికి కార‌ణ‌మైంది.

జ‌గ‌న్ రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఎక్కువుగా వ‌స్తున్నాయి. బీజేపీ స‌హా టీడీపీ జ‌గ‌న్ తీసుకున్న తాజా నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. ప్ర‌చారం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ర‌మ‌ణ దీక్షితులు ఏకంగా సీఎంను నారాయ‌ణ మూర్తిగా పోల్చుతూ.. కొనియాడ‌డం, నేరుగా తాడేప‌ల్లికి వ‌చ్చి .. సీఎం జ‌గ‌న్‌కు శ్రీవారి ప్ర‌సాదాలు అందించ‌డం వంటివి మైలేజీ తీసుకురాక‌పోగా.. మైన‌స్‌గా మారాయి.

జ‌గ‌న్‌పై ఇప్ప‌టికే ఓ మ‌తానికి చెందిన వ్య‌క్తిగా పేరుంది. దీనిని చెరిపివేసేందుకు వైసీపీ ఏనాడూ ప్ర‌య‌త్నించ‌లేదు. కానీ, ఇప్పుడు దీక్షితులు మాత్రం ఆయ‌న‌ను హిందువుగా ప్రొజెక్టు చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసిన ఈ ప్ర‌యోగం.. వైసీపీకి లాభిస్తుంద‌ని అనుకున్నా.. ఎంపీ ర‌ఘురామ చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌తో ర‌మ‌ణ దీక్షితులు చేసిన ప్ర‌య‌త్నం బూదిలో పోసిన‌ట్టుగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 8, 2021 8:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

2 hours ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

4 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

6 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

11 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

12 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

13 hours ago