Political News

దీక్షితులు ఎఫెక్ట్‌: ప్ల‌స్ క‌న్నా మైన‌స్ ఎక్కువా ?

ఏపీ సీఎం జ‌గ‌న్‌ను నారాయ‌ణ‌మూర్తిగా అభివ‌ర్ణిస్తూ.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ ప్ర‌ధాన అర్చుకుడు ర‌మ‌ణ దీక్షితులు చేసిన వ్యాఖ్య‌లు.. వైసీపీకి ప్ల‌స్ క‌న్నా మైన‌స్‌గానే ఎక్కువ‌గా మారాయి. ఆ పార్టీ నేత‌లు.. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేక పోతున్నారు.. మ‌రోవైపు.. సొంత పార్టీకి చెందిన అస‌మ్మ‌తి ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఈ వ్యాఖ్య‌లను దుయ్య‌బ‌ట్టారు. దీంతో ర‌మ‌ణ దీక్షితులు త‌న‌కు తాను వైసీపీకి మైలేజీ ఇచ్చుకున్నాన‌ని చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. ఇది వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌జ‌రుగుతున్న నేప‌థ్యంలో స్థానికంగా ఉన్న హిందూ వ‌ర్గాన్ని శాంతింప జేసేందుకు, వైసీపీ వైపు వారి దృష్టిని మ‌ళ్లించేందుకు గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోను ర‌ద్దు చేస్తూ.. వంశ‌పారంప‌ర్య అర్చ‌క‌త్వం, అర్చ‌కుల‌కు వ‌యోప‌రిమితి వంటివాటిని ఎత్తేస్తూ.. సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వాస్త‌వానికి ఆయ‌న అధికారంలోకి రాగానే ఈ నిర్ణ‌యం తీసుకుంటార‌ని అంద‌రూ భావించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న జ‌గ‌న్‌.. ఇప్పుడు తిరుప‌తి ఉప పోరు నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం .. రాజ‌కీయంగా వివాదానికి కార‌ణ‌మైంది.

జ‌గ‌న్ రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఎక్కువుగా వ‌స్తున్నాయి. బీజేపీ స‌హా టీడీపీ జ‌గ‌న్ తీసుకున్న తాజా నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. ప్ర‌చారం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ర‌మ‌ణ దీక్షితులు ఏకంగా సీఎంను నారాయ‌ణ మూర్తిగా పోల్చుతూ.. కొనియాడ‌డం, నేరుగా తాడేప‌ల్లికి వ‌చ్చి .. సీఎం జ‌గ‌న్‌కు శ్రీవారి ప్ర‌సాదాలు అందించ‌డం వంటివి మైలేజీ తీసుకురాక‌పోగా.. మైన‌స్‌గా మారాయి.

జ‌గ‌న్‌పై ఇప్ప‌టికే ఓ మ‌తానికి చెందిన వ్య‌క్తిగా పేరుంది. దీనిని చెరిపివేసేందుకు వైసీపీ ఏనాడూ ప్ర‌య‌త్నించ‌లేదు. కానీ, ఇప్పుడు దీక్షితులు మాత్రం ఆయ‌న‌ను హిందువుగా ప్రొజెక్టు చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసిన ఈ ప్ర‌యోగం.. వైసీపీకి లాభిస్తుంద‌ని అనుకున్నా.. ఎంపీ ర‌ఘురామ చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌తో ర‌మ‌ణ దీక్షితులు చేసిన ప్ర‌య‌త్నం బూదిలో పోసిన‌ట్టుగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 8, 2021 8:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

36 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

42 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago