Political News

తిరుప‌తిలో జ‌గ‌న్ ఆశ‌లు ఆవిరేనా… వైసీపీలో చ‌ర్చ..‌!

తిరుప‌తిలో ఏం జరుగుతుంది ? వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు భారీ మెజారిటీ.. అంటే 3-4 ల‌క్ష‌ల ఓట్ల ఆధిక్యం ఉంటుందా ? ఆ దిశ‌గా పార్టీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అవుతాయా? ఇప్పుడు ఇదే విష‌యంపై వైసీపీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి భారీ ఎత్తున అభ్య‌ర్థులు పోటీ చేస్తుండ‌డం. మ‌రోవైపు.. బీజేపీ త‌ర‌ఫున కేంద్రంలోని పెద్ద‌లు ఇక్క‌డ‌కు వ‌స్తుండ‌డమే..! పార్టీ జాతీయ నాయ‌కులు సైతం తిరుప‌తి ఉప ఎన్నిక‌పై ఎంతో ఫోక‌స్ పెట్ట‌డంతో పాటు ఇక్క‌డే మకాం వేశారు. బీజేపీ అభ్య‌ర్థి ప్ర‌చారం కోసం జాతీయ స్థాయిలో ఉన్న ఆర్ఎస్ఎస్ ద‌ళాలు ఇక్క‌డ పెద్దఎత్తున వాలిపోయాయి.

బీజేపీ గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా భారీ స్థాయిలో ఖ‌ర్చు చేస్తోంది. ఈ క్ర‌మంలో పార్టీ సీనియ‌ర్లు.. ఈ విష‌యంపై రెండు రోజులుగా ఆలోచ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీని త‌క్కువ‌గా అంచ‌నా వేశారు. స్థానిక ఎన్నిక‌ల్లో ఒక్క చోట కూడా స‌త్తా చూపించ‌లేదు క‌నుక బీజేపీని ఇక్క‌డ కూడా ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తార‌ని అనుకున్నారు. ఇక‌, టీడీపీ నామ‌రూపాలు లేకుండా పోతుంద‌ని భావించారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. 28 మంది అభ్య‌ర్తులు పోటీలో ఉన్నారు. పైగా ఎవ‌రి వ‌ర్గం వారికి ఉంది. ఈ నేప‌థ్యంలో ఓట్ల చీలిక ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

మరోవైపు టీడీపీ నేత‌, అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మి కూడా ప్ర‌చారం ముమ్మ‌రం చేశారు. స్థానిక ఎన్నిక‌లు బ‌హిష్క‌రించ‌డంతో టీడీపీ ప్ర‌ధాన నాయ‌కులు, పెద్ద త‌ల‌కాయ‌లు తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలో మ‌కాం వేసి కులాల వారీగా కూడా ప్ర‌చారం చేస్తున్నారు. ఇక యువ‌నేత లోకేష్ కూడా పార్టీ త‌ర‌ఫున విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో కొన్ని వ‌ర్గాల్లో కొంత‌ ఓటు బ్యాంకు మారుతుంద‌ని వైసీపీ అంచ‌నా వేస్తోంది. అదే స‌మ‌యంలో ఇప్పుడు బీజేపీ జాతీయ నేత‌లు.. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డానే కాకుండా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ దాస్‌, అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇక్క‌డ ప్ర‌చారానికి రానున్నార‌ని తెలిసింది. వీరిలో యోగికి మంచి వాక్చాతుర్యంతోపాటు తిరుమల వివాదాస్పద అంశాలపై మాట్లాడే ప‌ట్టు ఉంది.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌పై ఉన్న కేసులు, రాష్ట్ర అభివృద్ధి, నిధుల వినియోగం.. వంటివాటిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించి ప్ర‌చారానికి తీసుకువెళ్తార‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. వైసీపీ ఆశిస్తున్న విధంగా ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ పెట్టుకున్న భారీ మెజారిటీ ఆశ‌లు నెర‌వేర‌డం క‌ష్ట‌మేన‌ని వైసీపీ సీనియ‌ర్లు ఒక అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. గెలుపు గుర్రం ఎక్క‌డం ఓకే అయినా.. ఆది నుంచి దేశం మొత్తం తిరుప‌తి రిజ‌ల్ట్‌, మెజారిటీ వైపు చూడాల‌ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు కూడా సీఎం జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. దీంతో ఇప్ప‌టికే ఏడుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు, న‌లుగురు ఎంపీలు ఇక్క‌డే పాగా వేసి ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. మారుతున్న ప‌రిణామాలు వీరి అంచ‌నాల‌ను తారు మారు చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on April 7, 2021 2:30 pm

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

2 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

2 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

4 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

5 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

6 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

6 hours ago