Political News

అమ్మకానికి విశాఖ సర్కారీ భూములు.. రూ.1500 కోట్లే లక్ష్యం

తీవ్రమైన ఆర్థిక ఒడిదుడికుల్లో ఉన్న ఏపీ రాష్ట్ర సర్కారు.. ఆదాయ వనరు కోసం విపరీతంగా గాలిస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు. రానున్న రోజుల్లో పరిపాలనా రాజధానిగా భావిస్తున్న వివాఖపట్నంలో ఖరీదైన ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టేసింది. బీచ్ రోడ్డు లోని 13.59 ఎకరాలతోపాటు.. మొత్తం 18 ఆస్తుల్ని అమ్మకానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

వాస్తవానికి విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా చెప్పే బీచ్ రోడ్డు మార్గాన్ని ఆనుకొని ఉన్న 18 ఎకరాల్లో లూలూ సంస్థ భారీ కన్వెన్షన్ సెంటర్ తో పాటు.. మాల్ తదితరాల్ని డెవలప్ చేయటానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ఆ డీల్ నుంచి వైదొలిగింది. దీంతో.. ఆ స్థలం ప్రభుత్వవశమైంది. తాజాగా ఆ భూమికి రూ.1452 కోట్లుగా రిజర్వు ధరను నిర్ణయించింది.

అంతేకాదు.. మరో 17 భూముల్ని కూడా అమ్మాలని డిసైడ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిషన్ బిల్డ్ ఏపీ కింద కొన్ని భూముల్ని అమ్మాలని నిర్ణయించిందని.. ఆయా స్థలాల్ని ప్రభుత్వం తరఫున తాము ఈ-వేలం వేయనున్నట్లుగా ఎన్ బీసీసీ సంస్థ వెల్లడించింది. విలువైన ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పోతే.. రానున్న రోజుల్లో ఎదురయ్యే అవసరాలకు ప్రభుత్వం వద్ద ఇంకేం మిగులుతుంది?

కొసమెరుపు : 2006 లో ఒకసారి వైజాగ్ లో ప్రభుత్వ భూములు అమ్మారు. ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ మళ్లీ అమ్మలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వైజాగ్ లో ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టారు.

This post was last modified on April 7, 2021 1:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago