Political News

అమ్మకానికి విశాఖ సర్కారీ భూములు.. రూ.1500 కోట్లే లక్ష్యం

తీవ్రమైన ఆర్థిక ఒడిదుడికుల్లో ఉన్న ఏపీ రాష్ట్ర సర్కారు.. ఆదాయ వనరు కోసం విపరీతంగా గాలిస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు. రానున్న రోజుల్లో పరిపాలనా రాజధానిగా భావిస్తున్న వివాఖపట్నంలో ఖరీదైన ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టేసింది. బీచ్ రోడ్డు లోని 13.59 ఎకరాలతోపాటు.. మొత్తం 18 ఆస్తుల్ని అమ్మకానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

వాస్తవానికి విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా చెప్పే బీచ్ రోడ్డు మార్గాన్ని ఆనుకొని ఉన్న 18 ఎకరాల్లో లూలూ సంస్థ భారీ కన్వెన్షన్ సెంటర్ తో పాటు.. మాల్ తదితరాల్ని డెవలప్ చేయటానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ఆ డీల్ నుంచి వైదొలిగింది. దీంతో.. ఆ స్థలం ప్రభుత్వవశమైంది. తాజాగా ఆ భూమికి రూ.1452 కోట్లుగా రిజర్వు ధరను నిర్ణయించింది.

అంతేకాదు.. మరో 17 భూముల్ని కూడా అమ్మాలని డిసైడ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిషన్ బిల్డ్ ఏపీ కింద కొన్ని భూముల్ని అమ్మాలని నిర్ణయించిందని.. ఆయా స్థలాల్ని ప్రభుత్వం తరఫున తాము ఈ-వేలం వేయనున్నట్లుగా ఎన్ బీసీసీ సంస్థ వెల్లడించింది. విలువైన ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పోతే.. రానున్న రోజుల్లో ఎదురయ్యే అవసరాలకు ప్రభుత్వం వద్ద ఇంకేం మిగులుతుంది?

కొసమెరుపు : 2006 లో ఒకసారి వైజాగ్ లో ప్రభుత్వ భూములు అమ్మారు. ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ మళ్లీ అమ్మలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వైజాగ్ లో ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టారు.

Satya

Recent Posts

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

14 minutes ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

2 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

2 hours ago

బండ్ల గణేష్… త్రివిక్రమ్… కలిసిపోయారు!

టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…

6 hours ago

మహిష్మతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుందా

బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…

6 hours ago

రావిపూడి కన్ను రాయలసీమపై పడింది

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…

6 hours ago