Political News

చంద్రబాబు మాట లైట్.. పరిషత్ లో పోటీకి అఖిలప్రియ సై

ఏపీ అధికారపక్షం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదన్న నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయమో.. వీర స్వర్గమో తేల్చుకోవాలే తప్పించి.. పోటీకి దూరంగా ఉండిపోవటం సాధ్యం కాదని తెలుగు తమ్ముళ్లు పలువురు స్పష్టం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నాం.. కష్టమో.. నష్టమో భరించాలి. యుద్ధం చేయాలే తప్పించి.. అస్త్రశస్త్రాల్ని ఇంట్లో దాచేస్తే రాజకీయ ఉనికికే ప్రమాదం ఉన్న వాదనను వినిపిస్తున్నారు.

అందుకే.. పార్టీ అధినేత మాటను పట్టించుకోకుండా.. తమకు బలమున్న ప్రాంతాల్లో అభ్యర్థుల్ని నిలిపి..వారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలా చేస్తున్న నేతల్లో కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఒకరు. అధినేత ఆదేశాల్ని లైట్ తీసుకున్న ఆమె.. పరిషత్ బరిలో నిలుస్తామని చెప్పటమే కాదు.. పలు చోట్ల పార్టీ అభ్యర్థుల్ని ఎన్నికల బరిలోకి దించేయటం ఆసక్తికరంగా మారింది.

తాను ప్రాతినిధ్యం వహించే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆమె స్పస్టం చేస్తున్నారు. ఎన్నికల్ని బహిష్కరించే ప్రసక్తే లేదన్నఆమె.. అభ్యర్థుల తరఫు ప్రచారం చేసి ప్రజల్ని ఓట్లు వేయాలని అడుగుతామన్నారు. టీడీపీకి అభ్యర్థులు లేని చోట.. టీడీపీ ఓటర్లంతా నోటాకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8న జరిగే ఈ ఎన్నికల పోలింగ్ ఫలితాలు పదిన వెల్లడి కానున్నాయి.

This post was last modified on April 6, 2021 9:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

25 minutes ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

4 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

5 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

5 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

6 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

6 hours ago