ఏపీ అధికారపక్షం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదన్న నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయమో.. వీర స్వర్గమో తేల్చుకోవాలే తప్పించి.. పోటీకి దూరంగా ఉండిపోవటం సాధ్యం కాదని తెలుగు తమ్ముళ్లు పలువురు స్పష్టం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నాం.. కష్టమో.. నష్టమో భరించాలి. యుద్ధం చేయాలే తప్పించి.. అస్త్రశస్త్రాల్ని ఇంట్లో దాచేస్తే రాజకీయ ఉనికికే ప్రమాదం ఉన్న వాదనను వినిపిస్తున్నారు.
అందుకే.. పార్టీ అధినేత మాటను పట్టించుకోకుండా.. తమకు బలమున్న ప్రాంతాల్లో అభ్యర్థుల్ని నిలిపి..వారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలా చేస్తున్న నేతల్లో కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఒకరు. అధినేత ఆదేశాల్ని లైట్ తీసుకున్న ఆమె.. పరిషత్ బరిలో నిలుస్తామని చెప్పటమే కాదు.. పలు చోట్ల పార్టీ అభ్యర్థుల్ని ఎన్నికల బరిలోకి దించేయటం ఆసక్తికరంగా మారింది.
తాను ప్రాతినిధ్యం వహించే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆమె స్పస్టం చేస్తున్నారు. ఎన్నికల్ని బహిష్కరించే ప్రసక్తే లేదన్నఆమె.. అభ్యర్థుల తరఫు ప్రచారం చేసి ప్రజల్ని ఓట్లు వేయాలని అడుగుతామన్నారు. టీడీపీకి అభ్యర్థులు లేని చోట.. టీడీపీ ఓటర్లంతా నోటాకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8న జరిగే ఈ ఎన్నికల పోలింగ్ ఫలితాలు పదిన వెల్లడి కానున్నాయి.
This post was last modified on April 6, 2021 9:55 am
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…