Political News

జగన్ సర్కారుపై లోకేష్ ‘జేసీబీ’ పంచ్ లు

తిరుపత ఉప ఎన్నికల ప్రచారం మూడు తిట్లు.. ఆరు విమర్శలు అన్నట్లుగా సాగుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా మండిపడుతున్న పార్టీల ప్రచారం.. పొలిటికల్ హీట్ ను పెంచేస్తోంది. తాజాగా టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరైన లోకేశ్ ప్రచారాన్ని నిర్వహించారు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ.. విపక్ష టీడీపీ.. జనసేన-బీజేపీల కూటమి తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో.. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

తాజాగా లోకేష్ జరిపిన ప్రచారంలో జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శల్ని సంధించారు. ఏపీని జేసీబీ ప్రభుత్వం పట్టిపీడుస్తోందన్న ఆయన.. జేసీబీ అంటే ఏమిటో చెప్పి అందరిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. జేసీబీ అంటే.. జగన్ టాక్స్.. కరప్షన్.. బాదుడు అంటూ సరికొత్త ఆర్థాన్ని చెప్పుకొచ్చారు. వైసీపీకి ప్రస్తుతం 22 మంది ఎంపీలు.. ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉండి పార్లమెంటులో ఏం పీకుతున్నారు. అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ఆపాలని.. పార్లమెంటులో ఎందుకు అడగరని ప్రశ్నించారు. ఇదేనా ధర్మ పోరాటం అంటూ ప్రశ్నించిన లోకేశ్.. ఓపక్క ఆలీబాబా ఆయన దొంగలు.. మరోవైపు టీడీపీ వీరులు పోరాటం చేస్తున్నారన్నారు. ప్రజల కోసం పోరాడే టీడీపీ అభ్యర్థి పనబాక కావాలా? లేదంటే ముఖ్యమంత్రి జగన్ కాళ్లు నొక్కే మనిషి కావాలా? అని ఓటర్లను ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థిగా వ్యవహరిస్తున్న డాక్టర్ గురుమూర్తి ఫిజియో థెరపిస్టు అన్న విషయం తెలిసిందే.

తిరుపతి ఎంపీగా ఉన్న దివంగత నేత బల్లి దుర్గాప్రసాద్ కు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్ వేధింపులకు గురి చేశారన్నారు. దళితుడనే కనీస గౌరవం కూడా ఇవ్వకపోవటం దారుణమన్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిస్తే.. ఆయన బాగుపడటం తప్పించి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ విరుచుకుపడ్డారు.

This post was last modified on April 5, 2021 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈడీ దెబ్బ‌.. వైసీపీలో కుదుపు.. !

వైసీపీ అధినేత జగ‌న్‌కు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్(ఈడీ) దెబ్బ కొత్త‌కాదు. ఆయ‌నకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయ‌న‌ను…

4 minutes ago

తిరుమల కొండపై ఇక ‘చైనీస్’ దొరకదు!

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…

1 hour ago

హిట్ 3 విలన్ వెనుక ఊహించని విషాదం

గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…

1 hour ago

కశ్మీర్ లోని ఏపీ విద్యార్థుల భద్రతపై ఫోకస్

భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు.…

2 hours ago

తెలుగు జవాన్ మురళి వీర మరణం

పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్..…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: ఐపీఎల్‌కు బ్రేక్… బీసీసీఐ సంచలన నిర్ణయం

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు…

3 hours ago