Political News

సైన్యం ఎంతమంది పిల్లలను చంపేసిందో తెలుసా ?

మయున్మార్ లో 43 మంది చిన్నారులను చంపేశారు. గడచిన నాలుగురోజులుగా సైన్యానికి, ప్రజలకు మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో చట్టబద్దంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీతో పాటు మరికొందరిని సైన్యం నిర్భందించి జైళ్ళల్లో పెట్టింది. తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాలరాచి సైన్యాధికారులే మయున్మార్ పాలనా పగ్గాలను చేతిలోకి తీసుకున్నారు.

సైన్యం చర్యతో రెచ్చిపోయిన జనాలు వెంటనే రోడ్లపైకి వచ్చి తిరగబడ్డారు. రోడ్లపైకి రావద్దని, ఆందోళనలు చేయవద్దని సైన్యం చెప్పిని వినకుండా జనాలు రోడ్లపైకి వచ్చి దేశమంతా ఆందోళనల్లోకి దిగారు. దాంతో సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది. గడచిన నాలుగు రోజులుగా 600 మందకి పైగా సైన్యం, పోలీసుల కాల్పుల్లో మరణించారు.

బాధాకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన వారిలో 43 మంది చిన్న పిల్లలు కూడా ఉండటం. మరణించిన వారిపై సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్చంధ సంస్ధ సర్వేచేసింది. చనిపోయిన వారిలో 16 ఏళ్ళలోపు వారు 30 మందున్నారట. 13 ఏళ్ళ చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుంటే అకారణంగా సైన్యం కాల్పులు జరిపి చంపేసిందని సంస్ధ ఆరోపించింది.

మండలేలో కూడా 14 సంవత్సరాల అబ్బాయి ఇంటిముందున్నపుడు సైన్యం కాల్చి చంపేసిందట. కరేన్ తెగ ఎక్కువగా ఉండే గ్రామంపై సైన్యం జరిపిన కాల్పుల్లో చాలామంది పిల్లలు చనిపోయినట్లు సంస్ధ ప్రతినిధులు వెల్లడించారు. ఇళ్ళల్లోనే ఉన్నవారిపైన కూడా దాడులు జరిపి కాల్చి చంపేస్తున్నారంటే సైన్యం+పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నాయో అర్ధమైపోతోంది. అంతర్జాతీయ సమాజం ఎంతగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా సైన్యం, పోలీసులు ఎవరినీ లెక్కపెట్టడంలేదు. మరి ఈ దమనకాండ ఎంతకాలం సాగుతుందో ఏమో.

This post was last modified on April 3, 2021 11:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

28 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago