Political News

సైన్యం ఎంతమంది పిల్లలను చంపేసిందో తెలుసా ?

మయున్మార్ లో 43 మంది చిన్నారులను చంపేశారు. గడచిన నాలుగురోజులుగా సైన్యానికి, ప్రజలకు మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో చట్టబద్దంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీతో పాటు మరికొందరిని సైన్యం నిర్భందించి జైళ్ళల్లో పెట్టింది. తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాలరాచి సైన్యాధికారులే మయున్మార్ పాలనా పగ్గాలను చేతిలోకి తీసుకున్నారు.

సైన్యం చర్యతో రెచ్చిపోయిన జనాలు వెంటనే రోడ్లపైకి వచ్చి తిరగబడ్డారు. రోడ్లపైకి రావద్దని, ఆందోళనలు చేయవద్దని సైన్యం చెప్పిని వినకుండా జనాలు రోడ్లపైకి వచ్చి దేశమంతా ఆందోళనల్లోకి దిగారు. దాంతో సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది. గడచిన నాలుగు రోజులుగా 600 మందకి పైగా సైన్యం, పోలీసుల కాల్పుల్లో మరణించారు.

బాధాకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన వారిలో 43 మంది చిన్న పిల్లలు కూడా ఉండటం. మరణించిన వారిపై సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్చంధ సంస్ధ సర్వేచేసింది. చనిపోయిన వారిలో 16 ఏళ్ళలోపు వారు 30 మందున్నారట. 13 ఏళ్ళ చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుంటే అకారణంగా సైన్యం కాల్పులు జరిపి చంపేసిందని సంస్ధ ఆరోపించింది.

మండలేలో కూడా 14 సంవత్సరాల అబ్బాయి ఇంటిముందున్నపుడు సైన్యం కాల్చి చంపేసిందట. కరేన్ తెగ ఎక్కువగా ఉండే గ్రామంపై సైన్యం జరిపిన కాల్పుల్లో చాలామంది పిల్లలు చనిపోయినట్లు సంస్ధ ప్రతినిధులు వెల్లడించారు. ఇళ్ళల్లోనే ఉన్నవారిపైన కూడా దాడులు జరిపి కాల్చి చంపేస్తున్నారంటే సైన్యం+పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నాయో అర్ధమైపోతోంది. అంతర్జాతీయ సమాజం ఎంతగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా సైన్యం, పోలీసులు ఎవరినీ లెక్కపెట్టడంలేదు. మరి ఈ దమనకాండ ఎంతకాలం సాగుతుందో ఏమో.

This post was last modified on April 3, 2021 11:18 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

8 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

9 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

10 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

11 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

11 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

12 hours ago