Political News

టీడీపీపై రెండు రకాలుగా దెబ్బపడిందా ?

పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల టీడీపీ రెండు రకాలుగా నష్టపోతోంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ చేసినపుడే పార్టీ క్యాడర్ గట్టిగా ఉంటుంది. అసలు ఎన్నికలనే బహిష్కరించినపుడు పార్టీ స్ధానిక నేతలు, క్యాడర్ ఇతర పార్టీల వైపు వెళిపోయే ప్రమాదం ఉంది. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఇపుడు జరగబోయేది అదేని పార్టీ సీనియర్ నేతల్లో ఆందోళన మొదలైంది.

ఎన్నికల్లో పోటీచేయాలని ఉన్నప్పటికీ, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల చాలామందిలో అసంతృప్తి పెరిగిపోతోంది. పార్టీ నేతల అంతర్గత చర్చల్లో తెలుస్తున్నదేమంటే అసంతృప్త నేతలు, క్యాడర్ జనసేన+బీజేపీ కూటమిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందట. చంద్రబాబు నిర్ణయం పార్టీని రెండు రకాలుగా దెబ్బ తీస్తోందట. మొదటిదేమో తాము అధికారంలో ఉన్నపుడు తీసుకున్న నిర్ణయం. రెండోదేమో ప్రతిపక్షంలోకి వచ్చినాక తీసుకున్న నిర్ణయం.

మొదటి నిర్ణయాన్ని తీసుకుంటే ఇపుడు జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికలు టీడీపీ అధికారంలో ఉన్నపుడు జరగాల్సినవి. అప్పట్లోనేమో జనాల్లో వ్యతిరేకత బయటపడుతుందనే భయంతో ఎన్నికలు జరపలేదు. హైకోర్టు ఎన్నికలు జరపాలని ఆదేశించినా లెక్క చేయకుండా ఎన్నికలను వాయిదా వేశారు. చివరకు భయపడినంతా జరిగి సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.

ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయంతో స్ధానికనేతలు, క్యాడర్ మనోస్ధైర్యం దెబ్బ తినబోతోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాడాలని నేతలు, క్యాడర్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. నిజానికి పాలిట్ బ్యూరో సమావేశంలోని నేతల్లో చాలామందికి ప్రజాజీవితంతో సంబంధమేలేదు. అలాంటి వాళ్ళే ఇపుడు చంద్రబాబు తరపున పార్టీలో చక్రం తిప్పుతున్నారు.

జనబలం లేని, ఎన్నికల్లో గెలిచి దశాబ్దాలు అయిపోయిన కొద్దిమంది నేతలే పాలిట్ బ్యూరోలో మిగిలిన వాళ్ళని డామినేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు పార్టీలోని నేతలు, క్యాడర్ మనోభావాలను చంద్రబాబుకు వివరించాల్సిందిపోయి అధినేత ఆలోచనలకు తగ్గట్లుగా మిగిలిన నేతలతో మాట్లాడుతున్నారు. దీనివల్లే ఇపుడు చంద్రబాబు నిర్ణయంపై చాలామంది సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో మండిపోతున్నారు.

ఇలాంటి కీలకమైన నిర్ణయాలను పాలిట్ బ్యూరోలో కాకుండా జిల్లాల్లోని నేతలతో కూడా చర్చించి తీసుకోవాలని అశోక్ గజపతిరాజు సూచనే నేతల్లోని అసంతృప్తిని బయటపెడుతోంది. అధినేత నిర్ణయంతో విభేదించి ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పదవికి రాజీనామా చేశారు. ఇంకెంతమంది బయటపడతారో చూడాల్సిందే.

This post was last modified on April 3, 2021 11:03 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ…

5 hours ago

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…

6 hours ago

ఇళయరాజాకు ఇది తగునా?

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…

7 hours ago

నా రెండో సంత‌కం ఆ ఫైలు పైనే: చంద్ర‌బాబు

కూట‌మి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంత‌కం.. మెగా డీఎస్సీపైనేన‌ని.. దీనివ‌ల్ల 20 వేల మంది నిరుద్యోగుల‌కు మేలు…

7 hours ago

పదిహేనేళ్ల మాట తీర్చిన SSMB 29

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…

8 hours ago

కేసీఆర్‌కు గ‌ట్టి షాక్‌.. ప్ర‌చారంపై నిషేధం

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు భారీ షాక్ త‌గిలింది. కీల‌కమైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యం లో…

9 hours ago