Political News

టీడీపీపై రెండు రకాలుగా దెబ్బపడిందా ?

పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల టీడీపీ రెండు రకాలుగా నష్టపోతోంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ చేసినపుడే పార్టీ క్యాడర్ గట్టిగా ఉంటుంది. అసలు ఎన్నికలనే బహిష్కరించినపుడు పార్టీ స్ధానిక నేతలు, క్యాడర్ ఇతర పార్టీల వైపు వెళిపోయే ప్రమాదం ఉంది. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఇపుడు జరగబోయేది అదేని పార్టీ సీనియర్ నేతల్లో ఆందోళన మొదలైంది.

ఎన్నికల్లో పోటీచేయాలని ఉన్నప్పటికీ, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల చాలామందిలో అసంతృప్తి పెరిగిపోతోంది. పార్టీ నేతల అంతర్గత చర్చల్లో తెలుస్తున్నదేమంటే అసంతృప్త నేతలు, క్యాడర్ జనసేన+బీజేపీ కూటమిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందట. చంద్రబాబు నిర్ణయం పార్టీని రెండు రకాలుగా దెబ్బ తీస్తోందట. మొదటిదేమో తాము అధికారంలో ఉన్నపుడు తీసుకున్న నిర్ణయం. రెండోదేమో ప్రతిపక్షంలోకి వచ్చినాక తీసుకున్న నిర్ణయం.

మొదటి నిర్ణయాన్ని తీసుకుంటే ఇపుడు జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికలు టీడీపీ అధికారంలో ఉన్నపుడు జరగాల్సినవి. అప్పట్లోనేమో జనాల్లో వ్యతిరేకత బయటపడుతుందనే భయంతో ఎన్నికలు జరపలేదు. హైకోర్టు ఎన్నికలు జరపాలని ఆదేశించినా లెక్క చేయకుండా ఎన్నికలను వాయిదా వేశారు. చివరకు భయపడినంతా జరిగి సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.

ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయంతో స్ధానికనేతలు, క్యాడర్ మనోస్ధైర్యం దెబ్బ తినబోతోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాడాలని నేతలు, క్యాడర్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. నిజానికి పాలిట్ బ్యూరో సమావేశంలోని నేతల్లో చాలామందికి ప్రజాజీవితంతో సంబంధమేలేదు. అలాంటి వాళ్ళే ఇపుడు చంద్రబాబు తరపున పార్టీలో చక్రం తిప్పుతున్నారు.

జనబలం లేని, ఎన్నికల్లో గెలిచి దశాబ్దాలు అయిపోయిన కొద్దిమంది నేతలే పాలిట్ బ్యూరోలో మిగిలిన వాళ్ళని డామినేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు పార్టీలోని నేతలు, క్యాడర్ మనోభావాలను చంద్రబాబుకు వివరించాల్సిందిపోయి అధినేత ఆలోచనలకు తగ్గట్లుగా మిగిలిన నేతలతో మాట్లాడుతున్నారు. దీనివల్లే ఇపుడు చంద్రబాబు నిర్ణయంపై చాలామంది సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో మండిపోతున్నారు.

ఇలాంటి కీలకమైన నిర్ణయాలను పాలిట్ బ్యూరోలో కాకుండా జిల్లాల్లోని నేతలతో కూడా చర్చించి తీసుకోవాలని అశోక్ గజపతిరాజు సూచనే నేతల్లోని అసంతృప్తిని బయటపెడుతోంది. అధినేత నిర్ణయంతో విభేదించి ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పదవికి రాజీనామా చేశారు. ఇంకెంతమంది బయటపడతారో చూడాల్సిందే.

This post was last modified on April 3, 2021 11:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

3 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

4 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

5 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

5 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

6 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

8 hours ago