సాధారణ నాయకులు, లేదా ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు వర్గ పోరులో నలుగుతున్నారంటే అర్థం ఉంటుంది. వారు ఇప్పుడు కాకపోతే.. ఎన్నికల ముందు అయినా.. తమను తాము సరిదిద్దుకుని.. లేదా కేడర్ను దారిలో కి తెచ్చుకుని ముందుకు సాగే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, ఇప్పుడు సాక్షాత్తూ ఓ మంత్రి వర్గ పోరులో ఇరుక్కుపోతున్నారు. ఆయనే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఆయన గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. ఇక్కడ నుంచి గెలవడం అయితే.. గెలిచారు కానీ.. ఇక్కడ పట్టుమని పది రోజులు కూడా ఆయన ఉండడం లేదు.
అయితే.. విజయవాడ లేకపోతే. హైదరాబాద్.. అదీకాకపోతే.. తిరుపతి అన్న విధంగా మకాం మారుస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆయన గెలుపునకు కృషి చేసిన నాయకులు.. పార్టీ కేడర్ను ఆయన పట్టించుకోవడం లేదు. ఏ ఒక్క కార్యక్రమానికి వచ్చినా.. వెంటనే చేతులు దులుపుకొని వెళ్లిపోతున్నారు. ఏడాదిపాటు ఈ పరిస్థితిని గమనించిన పార్టీ కేడర్ ఇప్పుడు విసిగి పోయారు. దీంతో ఎస్సీ వర్గంలోనే రెండుగా చీలిపోయి.. ఆయనకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారు. వీరిలో ఓ వర్గం ఏకంగా వచ్చే ఎన్నికల్లో సురేష్ను ఓడించేందుకు కృషి చేస్తామని.. అంతర్గతంగా ప్రకటనలు చేస్తుండడం సంచలనం రేపుతోంది.
సురేష్ నియోజకవర్గానికి దూరంగా ఉంటూ కులానికి ఓ నేతను పెట్టుకుని వారితోనే ప్రజల పనులు చక్కపెట్టించేస్తున్నారు. ఇది కూడా ఆయనకు మైనస్ అయ్యింది. ఇక మరో వర్గం ఏకంగా స్థానిక మీడియాలో వ్యతిరేక వార్తలు రాయిస్తోంది. ఎస్సీలను పట్టించుకోని ఎస్సీ నాయకుడు, మంత్రి అయ్యాక.. మరిచిపోయిన నేత.. అంటూ.. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ ప్రచారం చేయిస్తున్నారు. అయితే.. ఇలాంటి ప్రచారం ఇది కొత్తకాదు.. గత ఆరు మాసాలుగా జరుగుతోంది. అయినప్పటికీ.. మంత్రి మాత్రం ఎవరినీ లెక్క చేయడం లేదు. దీనికి మరో కారణం కూడా ఉంది.
ఆయన ఇప్పటి వరకు నికరంగా ఒక నియోజకవర్గాన్ని నమ్ముకుని ఎక్కడా పనిచేయలేదు. ఎన్నికల సమయానికి అవసరమైతే.. నియోజకవర్గం మారిపోవడం ఆయనకున్న నైజం అన్న విమర్శలు కూడా పార్టీ నేతల్లోనే ఆయనపై ఉన్నాయి. దీంతో వీరిని అందుకే పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక 2014 లో ఇక్కడ నుంచి గెలిచి పార్టీ మారిన డేవిడ్ రాజు ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నారో ఇప్పుడు సురేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
This post was last modified on April 2, 2021 10:39 am
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…