Political News

మ‌న్మోహ‌న్‌కు ఏమైంది.. ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్ర‌ధాని

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ (ఎయిమ్స్‌)లో చేర‌డం ఉత్కంఠ రేపుతోంది. ఆయ‌న ఛాతీ నొప్పితో ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు తెలుస్తోంది. 87 ఏళ్ల మ‌న్మోహ‌న్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఎయిమ్స్‌లో, అది కూడా రాత్రి 9 గంట‌ల ప్రాంతంలో చేర‌డంతో మ‌న్మోహ‌న్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆయ‌న అభిమానుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కార్డియో-థోరాటిక్ వార్డులో మ‌న్మోహ‌న్‌కు చికిత్ అందుతోంది. కార్డియాల‌జీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ నితీష్ నాయ‌క్.. మ‌న్మోహ‌న్‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మ‌న్మోహ‌న్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆసుప‌త్రి వ‌ర్గాలు వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. ఆయ‌న ప్ర‌స్తుతం అబ్జ‌ర్వేష‌న్లో ఉన్న‌ట్లు మాత్ర‌మే ప్ర‌క‌టించాయి.

2004-14 మ‌ధ్య రెండు ప‌ర్యాయాలు, ప‌దేళ్ల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వ హాయంలో మ‌న్మోహ‌న్ ప్ర‌ధానిగా ప‌ని చేశారు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓట‌మి త‌ర్వాత మ‌న్మోహ‌న్ రాజ‌కీయాల్లో అంత చురుగ్గా ఏమీ లేరు. 2019 ఎన్నిక‌ల్లో అయితే ఆయ‌న అస‌లు క‌నిపించ‌నే లేదు.

గ‌త ఏడాది కాలంలో ఆర్థిక మంద‌గ‌మ‌నం నేప‌థ్యంలో మ‌న్మోహ‌న్ కొన్ని వ్యాఖ్య‌లు, విశ్లేష‌ణ‌లు చేశారు. అంత‌కుమించి ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చి విలేక‌రులతో మాట్లాడ‌టం, రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌పై స్పందించ‌డం జ‌ర‌గ‌లేదు. 90వ ద‌శ‌కంలో పీవీ న‌ర‌సింహారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా త‌న‌దైన ముద్ర వేశారు మ‌న్మోహ‌న్.

దేశాన్ని పురోగ‌తి వైపు న‌డిపించిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల్లో మ‌న్మోహ‌న్ పాత్ర కీల‌కం. ఆ త‌ర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌పుడు అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య ఆయ‌న ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

3 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

4 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

5 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

5 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

6 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

6 hours ago