ఏపీలో వైసీపీ సర్కారుకు.. విశాఖలోని చినముషిడివాడలో ఉన్న స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి మధ్య ఉన్న లింకు అందరికీ తెలిసిందే. వైసీపీ అధినేతగా ఉన్న జగన్ను ఏపీలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు స్వరూపానంద యజ్ఞాలు, యాగాలు, హోమాలు.. పూజలు ఇలా.. అనేక రూపాల్లో కష్టపడ్డారు. ఇక, ఈయన కనుసన్నల్లోనే సీఎం జగన్ నడుస్తున్నారనేది కూడా బహిరంగ రహస్యమే. చాలా విషయాల్లో ముహూర్తాలు.. నిర్ణయాలు అన్నీ కూడా స్వామి ఆదేశాలమేరకు ఆశీస్సుల మేరకే జరుగుతున్నాయనే విషయం కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది.
ఇక, అత్యంత కీలకమైన మూడు రాజధానుల నిర్ణయం.. సహా జగన్ తీసుకున్న అనేక నిర్ణయాల వెనుక కూడా స్వామి పాత్ర ఉందనేది బహిరంగ రహస్యమే. అదేవిధంగా తరచుగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు సైతం.. స్వామిని దర్శించుకుని తమ అభీష్టాలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కీలకమైన తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి కూడా స్వామి తనదైన ముహూర్తం పెట్టారని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం ఈవిషయం ఆసక్తిగా చర్చించుకుంటు న్నారు.
తిరుపతి పార్లమెంటుకు జరుగుతున్న ఉప పోరులో డాక్టర్ గురుమూర్తికి జగన్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే.. ఆయన తన నామినేషన్ను ఈ నెల 29న అంటే .. సోమవారం దాఖలు చేస్తానని ప్రకటించారు. దీంతో ఆ రోజే దాఖలు చేయడం వెనుక ఉన్న విశేషం ఏంటనే చర్చ పార్టీ నేతల మధ్య చర్చజరిగింది. దీనికి స్వామి ముహూర్తం పెట్టారని.. పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి తిధి, సోమవారం, హస్త నక్షత్రం వంటివి గురుమూర్తికి కలిసివస్తాయని.. అందుకే ఆ రోజు ఉదయం 11 గంటలు లేదా మధ్యాహ్నం 2 తర్వాత నామినేషన్ సమర్పించాలని స్వామి ఆదేశాలు ఇచ్చారని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం గురుమూర్తి కూడా ఆదిశగానే ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. మొత్తానికి స్వామి వారి ఆశీస్సులు ప్రబుత్వంపైనే కాకుండానే అభ్యర్థులపైనా ఉండడం గమనార్హం.
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…
ఈ రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీ సినిమాలకు ఎంత నష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…
ఐపీఎల్లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…