ఏపీలో బలంగా ఉన్నామని… ఇక, తమకు తిరుగులేదని చెప్పుకొంటున్న జగన్ సర్కారుకు.. అదే పార్టీలో ఇప్పుడు చెలరేగుతున్న ముసలం.. కలకలం సృష్టిస్తోంది. ఇదేం రాజకీయం సార్!
అంటూ.. రోజూ.. వివిధ జిల్లాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి సందేహాలు, ఫోన్లు కూడా వస్తున్నాయి. మేం పార్టీ కోసం ఎంతైనా కష్టపడతాం. ఇప్పటి వరకు మా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ పార్టీని డెవలప్ చేశాం. కానీ.. మీరు మాకు ఇచ్చిన హామీలు ఏం చేశారు. ఇప్పుడు పార్టీలో మాకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇదేం రాజకీయం సార్
-ఇదీ తాజాగా నంద్యాల ఎమ్మెల్యే నుంచి పార్టీకి అందిన సందేశం.
రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉంది. దీనికి జగన్ ఒక్కరే రీజనని అంటున్నారు. నాయకులు, జెండా మోసేవారు లేకపోతే... జగన్ ఎక్కడో ఆలోచించుకోవాలి!
-గుంటూరుకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సంధించిన ప్రశ్న. ఇలా.. ఏ ఒక్కరో ఇద్దరో కాదు… దాదాపు స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఇప్పటి వరకు సుమారు 25 మంది కీలక నేతల నుంచి అందిన సందేశాలు ఇవే. దీంతో పార్టీలో అంతర్గత చర్చ జోరుగా సాగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? అని!! గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారిలో సగంమందికి ఇస్తామన్న పదవులు ఇవ్వలేదు. ఇక, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇంకేముంది.. మీరు గెలిపించండి.. మేయర్, చైర్మన్ పదవులు మీవారికేనని కీలక నేతలు ఊరించారు.
దీంతో ఉత్సాహంగా ముందుకు ఉరికి పనిచేసిన కీలకనేతలు కార్పొరేషన్లను కైవసం చేసుకున్నారు.. స్థానికంగా పార్టీని గెలిపించుకున్నారు.. తీరా చూస్తే.. పార్టీ గెలిచిన తర్వాత.. పదవుల లెక్కలు మారిపోయాయి. దీంతో నాయకుల్లో ఒక విధమైన అభద్రతా భావం పెరిగిపోయింది. `పనిచేసేది మేం. ప్రజల్లో తిరిగేది మేం. పదవులు మాత్రం మీకు నచ్చిన వారికి ఇస్తున్నారు“ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పరిణామానికి ఇప్పుడు కనుక వైసీపీ చెక్ పెట్టకపోతే.. వచ్చే ఎన్నికల నాటికి ఇది వ్యతిరేకతగా మారిపోయి.. పార్టీ ఓటమికి దారితీసిననా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు. క్షేత్రస్థాయిలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే.. జగన్ విశ్వసనీయతే.. ప్రశ్నార్థకంగా మారుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో వైసీపీ ముందుగానే కళ్లు తెరుస్తుందో.. లేక.. తమ ఇష్టం అమలు కావాలని పట్టుబడుతుందో చూడాలి.
This post was last modified on March 28, 2021 9:28 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…