Political News

ఇదేం రాజ‌కీయం సార్‌.. వైసీపీలో ముసురుతున్న వివాదం

ఏపీలో బ‌లంగా ఉన్నామ‌ని… ఇక, త‌మ‌కు తిరుగులేద‌ని చెప్పుకొంటున్న జ‌గ‌న్ స‌ర్కారుకు.. అదే పార్టీలో ఇప్పుడు చెల‌రేగుతున్న ముస‌లం.. క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇదేం రాజ‌కీయం సార్‌! అంటూ.. రోజూ.. వివిధ జిల్లాల నుంచి పార్టీ కేంద్ర కార్యాల‌యానికి సందేహాలు, ఫోన్లు కూడా వ‌స్తున్నాయి. మేం పార్టీ కోసం ఎంతైనా కష్ట‌ప‌డ‌తాం. ఇప్ప‌టి వ‌ర‌కు మా ఆస్తులు తాక‌ట్టు పెట్టి మ‌రీ పార్టీని డెవ‌ల‌ప్ చేశాం. కానీ.. మీరు మాకు ఇచ్చిన హామీలు ఏం చేశారు. ఇప్పుడు పార్టీలో మాకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇదేం రాజ‌కీయం సార్‌-ఇదీ తాజాగా నంద్యాల ఎమ్మెల్యే నుంచి పార్టీకి అందిన సందేశం.

రాష్ట్రంలో వైసీపీ బ‌లంగా ఉంది. దీనికి జ‌గ‌న్ ఒక్క‌రే రీజ‌న‌ని అంటున్నారు. నాయ‌కులు, జెండా మోసేవారు లేక‌పోతే... జ‌గ‌న్ ఎక్క‌డో ఆలోచించుకోవాలి!-గుంటూరుకు చెందిన మాజీ ప్ర‌జాప్ర‌తినిధి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు సంధించిన ప్ర‌శ్న‌. ఇలా.. ఏ ఒక్క‌రో ఇద్ద‌రో కాదు… దాదాపు స్థానిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 25 మంది కీల‌క నేత‌ల నుంచి అందిన సందేశాలు ఇవే. దీంతో పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇలా ఎందుకు జ‌రుగుతోంది? అని!! గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు త్యాగం చేసిన వారిలో స‌గంమందికి ఇస్తామ‌న్న ప‌ద‌వులు ఇవ్వ‌లేదు. ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో ఇంకేముంది.. మీరు గెలిపించండి.. మేయ‌ర్‌, చైర్మ‌న్ ప‌ద‌వులు మీవారికేన‌ని కీల‌క నేత‌లు ఊరించారు.

దీంతో ఉత్సాహంగా ముందుకు ఉరికి ప‌నిచేసిన కీల‌క‌నేత‌లు కార్పొరేష‌న్ల‌ను కైవ‌సం చేసుకు‌న్నారు.. స్థానికంగా పార్టీని గెలిపించుకున్నారు.. తీరా చూస్తే.. పార్టీ గెలిచిన త‌ర్వాత‌.. ప‌ద‌వుల లెక్క‌లు మారిపోయాయి. దీంతో నాయ‌కుల్లో ఒక విధ‌మైన అభ‌ద్ర‌తా భావం పెరిగిపోయింది. `ప‌నిచేసేది మేం. ప్ర‌జ‌ల్లో తిరిగేది మేం. ప‌ద‌వులు మాత్రం మీకు న‌చ్చిన వారికి ఇస్తున్నారు“ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామానికి ఇప్పుడు క‌నుక వైసీపీ చెక్ పెట్ట‌క‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇది వ్య‌తిరేక‌త‌గా మారిపోయి.. పార్టీ ఓట‌మికి దారితీసిన‌నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క్షేత్ర‌స్థాయిలో ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోక‌పోతే.. జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌తే.. ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఈ విష‌యంలో వైసీపీ ముందుగానే క‌ళ్లు తెరుస్తుందో.. లేక‌.. త‌మ ఇష్టం అమ‌లు కావాల‌ని ప‌ట్టుబ‌డుతుందో చూడాలి.

This post was last modified on March 28, 2021 9:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago