Political News

పార్టీల్లో పెరుగుతున్న టెన్షన్

ఎన్నికలంటేనే చిత్ర, విచిత్రమైన పరిస్దితులుంటాయి. భారీ పోలింగ్ జరిగినా సమస్యే, పోలింగ్ చాలా తక్కువగా జరిగినా సమస్యే. మొదటి దశ పోలింగ్ తర్వాత పశ్చిమబెంగాల్లో రాజకీయపార్టీలన్నింటిదీ ఇదే పరిస్ధితిగా తయారైంది. శనివారం బెంగాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటిదశ పోలింగ్ జరిగింది. కడపటి సమాచారం అందే సమయానికి దాదాపు 80 శాతం ఓటింగ్ జరిగింది. అంటే మామూలు పరిస్ధితుల్లో అయితే జరిగిన పోలింగ్ బాగా ఎక్కువనే చెప్పాలి.

ఎందుకంటే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరా హోరీగా జరుగుతున్న ప్రచారంలో గొడవలు జరుగుతాయనే ప్రచారం విపరీతంగా జరిగంది. ఇప్పటికే అక్కడక్కడ చెదురుమదురు గొడవలు కూడా జరిగాయి. దాంతో ముందుజాగ్రత్తగా ప్రతి పోలింగ్ స్టేషన్లోను భారీఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

అందరు అనుమానించినట్లే అక్కడక్కడ గొడవలు కూడా జరిగాయి. అయినా 80 శాతం పోలింగ్ జరగటమే చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక్కడ సమస్య ఏమిటంటే పోలింగ్ ఎక్కువ జరిగినా తక్కువ జరిగినా రాజకీయ పండితులు రెండు రకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. మొదటిదేమో పోలింగ్ ఎక్కువ జరిగితే అధికారపార్టీ మీద వ్యతిరేకత కారణంగానే జనాలు పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొంటారని.

ఇక రెండో సిద్ధాంతమేమో పోలింగ్ గనుక బాగా తక్కువగా జరిగితే ప్రతిపక్షాల మీద జనాలకు పెద్దగా ఆశలు లేనికారణంగానే ఓటింగ్ లో పాల్గొనేందుకు జనాలు ఆసక్తి చూపలేదని అంటుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మమతబెనర్జీ మీద జనాల్లో చెప్పుకోదగ్గ వ్యతిరేకత లేదు. అందుకనే ప్రీపోల్ సర్వేల్లో ఎక్కువ శాతం మళ్ళీ మమతకే ఓట్లేస్తామని జనాలు చెప్పారు.

ప్రీపోల్ సర్వేల నేపధ్యంలోనే మొదటి దశలో 80 శాతం పోలింగ్ నమోదవ్వటంతో ఏ పార్టీకి ఆపార్టీ తమకే అనుకూలమని చెప్పుకుంటున్నాయి. అధికారిక ప్రకటన వస్తేకానీ అసలైన పోలింగ్ ఎంతనేది నిర్ధారణకాదు. మరి మొదటి దశలో జనాలు ఇంతగా పోటెత్తి ఓటింగ్ లో పాల్గొనేందుకు రావటానికి అసలైన కారణం ఏమి అయ్యుంటుందో అర్ధంకాక పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

This post was last modified on March 28, 2021 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

33 minutes ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

2 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

3 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

4 hours ago