Political News

జగన్ ఆశలపై నీళ్ళు

ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగ ఏర్పాటు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. కనీసం మరో ఏడాదిపాటు కొత్త జిల్లాల ఏర్పాటుకు నిరీక్షణ తప్పేట్లులేదు. దీనికి కారణం ఏమిటంటే భారత రిజిస్ట్రార్ కార్యాలయం జారీచేసిన నిబంధనలే. దేశవ్యాప్తంగా జనగణన జరిగేంతవరకు ఇపుడున్న జిల్లాల భౌతిక సరిహద్దులు మార్చవద్దని రిజిస్ట్రార్ కార్యాలయం దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

నిజానికి జనగణన దాదాపు ఏడాది క్రిందటే మొదవ్వాల్సింది. అయితే కరోనా వైరస్ కారణంగా పనులు మొదలుకాలేదు. ఈ ఏడాదిలో మొదలుపెడదామని అనుకుంటే మళ్ళీ ఇపుడు కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంటున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇపుడు కూడా జనగణన ప్రక్రియ మొదలయ్యేట్లులేదు.

మరి ఈ సమస్య ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు జనగణన మొదలవుతుందో ఎవరు చెప్పలేకున్నారు. అంతవరకు జిల్లాల సరిహద్దులను మార్చటంకానీ, జిల్లాలను రద్దు చేయటంకాని చేయవద్దని, జిల్లాల పరిపాలనా పరిధిని మార్చవద్దని, కొత్త సబ్ డివిజన్ల ఏర్పాటు వద్దని లాంటి అనేక సూచనలు, నిబంధనలతో తాజాగా ఓ సర్క్యులర్ జారీచేసింది.

సో తాజాగా జారీఅయిన సర్క్యులర్ ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో జరిగే వ్యవహారం కాదని తేలిపోయింది. జగన్ మాత్రం 13 జిల్లాలను 26 లేదా 27 జిల్లాలు చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ప్రతి జిల్లాను రెండుగా విభజించాలని అనుకున్నారు. విశాఖపట్నం జిల్లాలోని ప్రస్తుత అరకు పార్లమెంటు నియోజకవర్గం బాగా పెద్దది కావటంతో దీన్ని మాత్రం రెండు జిల్లాలుగా చేయాలనే ప్రతిపాదనుంది. ఎందుకైనా మంచిదిని ముందుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ప్రకటించారు. చివరకు ఇది రాజకీయ ప్రకటనగానే మిగిలిపోతుందేమో చూడాలి.

This post was last modified on March 28, 2021 11:11 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

8 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

9 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

12 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

12 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

13 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

13 hours ago