Political News

టీఆర్ఎస్ వ్యూహం..కాంగ్రెస్‌ను తొక్కేయ‌డ‌మే ల‌క్ష్య‌మా?

ఇటీవ‌ల కాలంలో ఎన్న‌డూ లేనంత‌గా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. మాజీ ప్ర‌ధాని దివంగ‌త పీవీ న‌ర‌సింహారావు భ‌జ‌న‌లో మునిగితేలుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పీవీ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను రాష్ట్ర పండుగ‌లా నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌.. ఇటీవ‌ల పీవీ కుమార్తె సుర‌భి వాణీదేవికి.. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వ‌డంతోపాటు.. గెలిపించుకున్నారు. అయితే.. పీవీ వ్య‌వ‌హారంలో కేసీఆర్ ఇంత‌టితో ఆగిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. మ‌రిన్ని మేళ్లు చేయ‌డం ద్వారా.. తెలంగాణ‌లో ముఖ్యంగా.. ప‌లు కీల‌క జిల్లాల్లోను, హైద‌రాబాద్ సెటిల‌ర్ల‌నూ మార్కులుతో కొట్టేయ‌డంతోపాటు.. కాంగ్రెస్‌కు సంస్థాగ‌తంగా ఉన్న‌ ఓటు బ్యాంకును త‌న‌వైపున‌కు తిప్పుకొనేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

వాణీకి.. చైర్మ‌న్ గిరీ!

ఇటీవ‌లే శాసనమండలి(గ్రాడ్యుయేట్‌) సభ్యులురాలిగా ఎన్నికైన వాణీదేవి విష‌యంలో కేసీఆర్ మ‌రింత లోతైన ఆలోచ‌న చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆమెకు ఆ పదవి చిన్నది అవుతుందని భావించిన కేసీఆర్.. ఏకంగా వాణీదేవిని మండలి చైర్మన్‌గా చేయాలని డిసైడ్ అయినట్లు టీఆర్ఎస్ కు చెందిన కీల‌క నేత‌ల మ‌ధ్యే ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో పీవీకి ఉన్న అభిమానాన్ని కాంగ్రెస్ ఇప్ప‌టి వ‌ర‌కు క్యాష్ చేసుకోలేక పోయింది. ఇక‌ముందు కూడా ఆ ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో పీవీ తాలూకు అభిమానుల‌ను, ఓటు బ్యాంకును కూడా తన ఖాతాలో వేసుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులోభాగంగానే వాణీదేవిని మండలి పెద్ద కుర్చీలో కూర్చోబెట్టాలని భావిస్తున్న‌ట్టు టీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుత మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉన్నారు. ఈయన కూడా కాంగ్రెస్ నుంచి వ‌చ్చి కేసీఆర్‌కు జై కొట్టిన నాయ‌కుడే. ఇక‌, ఈయ‌న‌ పదవీ కాలం జూన్‌లో ముగుస్తుంది. వాణీదేవిని మండలి చైర్మన్‌గా చేసేందుకు ఇదే త‌గిన స‌మ‌యంగా కేసీఆర్ భావిస్తున్నారు.

అదేస‌మ‌యంలో పీవీ కుమారుడు ప్రభాకర్‌రావుకు నామినేటేడ్ ప‌ద‌విని ఇచ్చి గౌర‌వించాల‌ని కూడా కేసీఆర్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక‌, ఇప్పటికే పీవీకి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్‌ కేంద్రానికి సిఫారసు చేసిన విష‌యం తెలిసిందే. ఇలా మొత్తంగా చూస్తే.. పీవీ భ‌జ‌న వెనుక చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతూ.. కాంగ్రెస్‌ను కూక‌టి వేళ్ల‌తో పెక‌లించేసేందుకు పావులు క‌దుపుతున్నార‌ని అంటున్నారు . అనంత‌రం.. బీజేపీ ఒక్క‌టే ఉంటుంది. సో.. చావో రేవో.. ఆ పార్టీతోనే తేల్చుకోవ‌చ్చ‌ని కేసీఆర్ కూడిక‌లు, తీసివేత‌లు వేసుకుంటున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

This post was last modified on March 28, 2021 7:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సామాన్యుల సమస్యలపై మాట్లాడే ఎంపీకు సొంత పార్టీ షాక్

రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…

4 minutes ago

రౌడీ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో రంజింపజేయాలి

బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్‌స్పెక్టర్. 1992లో…

2 hours ago

అమ‌రావ‌తిపై చ‌ర్చ‌.. రాజ్య‌స‌భ‌లో దుమ్మురేపిన నాయుడు

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును బుధ‌వారం లోక్‌స‌భ ఆమోదించిన ద‌రిమిలా.. రాజ్య‌స‌భ‌లో గురువారం ప్ర‌వేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…

3 hours ago

సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజుల ఊపిరి

తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…

3 hours ago

వారణాసి ఇప్పుడెందుకు గుర్తుకు వస్తోంది

రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…

3 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్‌: `ఐప్యాక్`పై ఈడీ న‌జ‌ర్‌!

పొలిటిక‌ల్ క‌న్స‌ల్టెన్సీ సంస్థ‌.. ఐప్యాక్‌పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏక‌కాలంలో గురువారం.. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఐప్యాక్ సంస్థ‌ల‌కు…

4 hours ago