Political News

వ్యూహాత్మ‌క నిర్ణ‌యాల‌తో.. జ‌గ‌న్ ఆక‌ర్ష్ పాలిటిక్స్‌

రాజ‌కీయాల్లో వ్యూహాలు అమ‌లు చేయ‌డం వేరు.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం వేరు. వ్యూహాలు కామ‌న్‌గా అన్ని పార్టీల నాయ‌కులు అమ‌లు చేస్తుంటారు. అవి ఒక్కొక్క‌సారి విజ‌యవంతం అవుతాయి.. కొన్నికొన్ని సార్లు విక‌టిస్తాయి.. కానీ, వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు.. మాత్రం ఖ‌చ్చితంగా విజ‌యం దిశ‌గానే అడుగులు వేస్తాయ‌ని అంటారు ప‌రిశీల‌కులు. ఇలాంటి వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు.. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్నారు. స్థానిక ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు రోడ్డెక్కి ప్ర‌జ‌ల్లోకి వెళ్లినా.. పెద్ద‌గా ఫ‌లితం క‌క‌నిపించ‌లేదు.

కానీ, అదేస‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ గ‌డ‌ప దాట‌కుండా ఎన్నిక‌ల‌ను శాసించారు. రెండు రోజుల్లో కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఉన్నాయ‌ని అన‌గా… 45 ఏళ్లు నిండిన అగ్ర‌వ‌ర్ణ మ‌హిళ‌ల‌కు కూడా చేయూత ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు.. ఈ ప‌థ‌కం కింద‌.. ఏటా 15 వేలు చొప్పున వారికి అందిస్తారు. అదేస‌మ‌యంలో మ‌హిళా ఉద్యోగుల మెట‌ర్నిటీ లీవ్ స‌హా.. కాజువ‌ల్ సెల‌వుల‌ను పెంచారు. ఈరెండు నిర్ణ‌యాలు కూడా ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌బావం చూపించాయి. వాస్త‌వానికి జ‌గ‌న్ వేసిన ఈ వ్యూహాన్ని టీడీపీ నేత‌లు గుర్తించే స‌రికి పుణ్య‌కాలం గ‌డిచిపోయింది. స‌రే! ఇదంతా అయిపోయింద‌ని అనుకున్నా..

ఇక‌, ఇప్పుడు కూడా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఆయ‌న క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు విమానాశ్ర‌యంలో విమానాల రాక‌పోక‌ల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సీమ ప్ర‌జ‌ల ముఖ్యంగా క‌ర్నూలు ప్ర‌జ‌ల సెంటిమెంటును త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ విమానాశ్ర‌యానికి స్వాతంత్ర స‌మ‌ర సింహం.. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పేరును ఖ‌రారు చేసిన‌ట్టు వేదిక‌పైనే ప్ర‌క‌టించారు. ఇది సెంటిమెంటుతో ముడిప‌డిన వ్య‌వ‌హారం కావ‌డంతో ఇప్పుడు సీమ కోరిక‌లు.. తీర్చే నేత ఎవ‌రైనా ఉన్నారా? అంటే.. ఒక్క జ‌గ‌నే అనే మాట వినిపించేలా చ‌క్రం తిప్పారు.

ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తిని త‌ర‌లించేస్తున్నార‌నే వాద‌న‌కు ఫుల్ స్టాప్ పెడుతూ.. అభివృద్ధి నినాదం అందుకున్నారు.. మూడు ద‌శ‌ల్లో మూడు బ్యాంకుల నుంచి 10 వేల కోట్ల‌ను అప్పుచేసి.. రాజ‌ధానిని అభివృద్ధి చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని తాజాగా జీవో ఇచ్చారు. ఇప్ప‌టికిప్పుడు 3 వేల కోట్ల‌ను ప్ర‌భుత్వ హామీపై తీసుకుంటున్నామ‌ని కూడా ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.. ఫ‌లితంగా ఇప్ప‌టికిప్పుడు ప్ర‌భుత్వంపై ఎవ‌రూ ఎలాంటి విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం లేకుండా చేశారు. ఇదంతా కూడా చాలా ప‌క‌డ్బందీ వ్యూహంతో అత్యంత వ్యూహాత్మ‌కంగా జ‌గ‌న్ వేస్తున్న అడుగులని.. వీటిని, వీటిలో మ‌ర్మాన్ని… ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ క‌నుక గుర్తించ‌క‌పోతే… మున్ముందు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 26, 2021 11:27 am

Share
Show comments

Recent Posts

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

6 minutes ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

8 minutes ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

8 minutes ago

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

3 hours ago

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

5 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

8 hours ago