Political News

తుమ్మ‌ల‌ను టార్గెట్ చేసిన ష‌ర్మిల …!


వైఎస్‌. ష‌ర్మిల తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ పార్టీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లోనూ సెగ‌లు రేపుతోంది. ఇటు అన్న ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉంటే అటు ష‌ర్మిల మ‌రో తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో పార్టీ పెట్టి ఏం చేస్తారు ? అన్న‌ది చాలా ఆస‌క్తిగా ఉంది. కొత్త పార్టీ ఏర్పాట్ల‌లో ఉన్న ష‌ర్మిల‌… ఏప్రిల్ 9న ఖ‌మ్మం జిల్లాల్లో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ఈ స‌భ నుండి త‌న పార్టీ పేరు, విధివిధానాలు ప్ర‌క‌టించ‌నున్నారు. ఇప్పుడు అంద‌రి దృష్టి ఆమె కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న మీదే ఉంది. ఇప్ప‌టికే ఆమె ఉమ్మ‌డి జిల్లాల వారీగా వైఎస్ కుటుంబ అభిమానుల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హిస్తున్నారు.

ష‌ర్మిల కొత్త పార్టీ పెట్ట‌కుండానే ఆమె ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాపైనే ప్ర‌ధానంగా ఫోక‌స్ చేస్తూ వ‌స్తున్నారు. ష‌ర్మిల ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని పాలేరు లేదా కొత్త‌గూడెం నుంచి పోటీచేసే ఛాన్సులు ఉన్నాయ‌న్న ప్ర‌చారం కూడా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఈ ఊహాగానాల‌కు ఊత‌మిచ్చేలా ఆమె సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి పోటీ చేస్తాన‌న్నారు. ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుండి తాను ఎన్నిక‌ల బ‌రిలో ఉంటాన‌న్నారు. వైఎస్ కు పులివెందుల ఎలాగో… త‌న‌కు పాలేరు అంత సెంటిమెంట్ అని, త‌మ ప్ర‌భంజ‌నాన్ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు త‌ట్టుకోలేరంటూ ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

ష‌ర్మిల చేసిన ఈ ప్ర‌క‌ట‌నే ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో గుబులు రేపుతోంది. ఇక్క‌డ నుంచి టీఆర్ఎస్‌లోనే రెండు గ్రూపులు ఉన్నాయి. మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గ‌మే దిక్కుగా ఉంది. 2016లో ఇక్క‌డ ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత ముంద‌స్తు సాధార‌ణ ఎన్నిక‌ల‌లో అనామ‌కుడు అయిన కందాళ ఉపేంద‌ర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కందాళ ఆ త‌ర్వాత కారెక్కేయ‌డంతో ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్‌లో తుమ్మ‌ల‌, కందాళ గ్రూపుల గోల ఉంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాళ కారెక్కేయ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌కు నాథుడే లేకుండా పోయాడు.

అక్క‌డ టీడీపీకి ఇన్‌చార్జ్‌గా మ‌ద్దినేని స్వ‌ర్ణ‌కుమారి ఉన్నా ఆ పార్టీకి సంస్థాగ‌తంగా బ‌లం ఉన్నా క‌నుమ‌రుగైపోయింది. ఈ లెక్క‌న చూస్తే ష‌ర్మిల అక్క‌డ టీఆర్ఎస్‌నే ప్ర‌ధానంగా ఎదుర్కోవాల్సి ఉంది. ఉమ్మ‌డి జిల్లాలో అధికార పార్టీలో బ‌ల‌మైన నేత‌గా ఉన్న తుమ్మ‌ల త‌న‌కు ఫ‌స్ట్ టార్గెట్ అని ఆమె చెప్ప‌క‌నే చెప్పేశారు. ప్ర‌స్తుతం కందాళ హ‌వాతో సొంత పార్టీలోనే ఇబ్బంది ప‌డుతోన్న తుమ్మ‌ల కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా త‌న‌దే పాలేరు టిక్కెట్ అన్న ధీమాతో ఉన్నారు. ఇప్పుడు ష‌ర్మిల త‌న పోటీ అక్క‌డే అని చెప్ప‌డంతో ఆయ‌న‌కు చివ‌రి ప‌రీక్ష‌గా పెద్ద అగ్నిప‌రీక్ష ఎదురుకానుంది.. దీనిని ఎలా ఎదుర్కొంటారో ? ఈ లోగా స‌మీక‌ర‌ణ‌లు ఎలా ? మార‌తాయో ? చూడాలి.

Satya

Recent Posts

NBK 111… ఎప్పుడు వస్తే బాగుంటుంది

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

31 minutes ago

వరుణ్ తేజ్ పూర్తిగా రూటు మార్చేశాడు

వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…

1 hour ago

చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్… అమ్మ కన్నీటి కథ

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…

4 hours ago

పుష్ప విలన్ కామెడీ చేస్తే…

మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…

5 hours ago

ఏపీలో మాజీ మంత్రి ఓటు గల్లంతు… ఇప్పుడెలా ‘సర్’?

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…

5 hours ago

నిరంజన్ చావుకు పేర్ని నానినే కారణమా..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…

5 hours ago