Political News

విశాఖకు కొత్త రూపు.. జగన్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

తాను అనుకున్నది అనుకున్నట్లు చేయటం కోసం మహా మొండిగా పని చేసే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తాజాగా తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు. తాను చెప్పిన మూడు రాజధానుల అంశంపై తాజాగా ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజధాని నగరంగా విశాఖను మార్చేందుకు వీలుగా.. ముందస్తు ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. విశాఖ రూపును సమూలంగా మార్చేసే పనిని తాజాగా చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం జగన్ సర్కారు ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

విశాఖ జిల్లాలోని గిరిజనేతర ప్రాంతం మొత్తాన్ని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ కిందకు తీసుకొస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో నర్సీపట్నం.. చోడవరం.. మాడుగుల.. రావికమతం.. బుచ్చయ్యపేట.. నాతవరం.. కె.కోటపాడు.. దేవరపల్లి.. మాకవరపాలెం.. కోటవురట్ల.. గొలుగొండ.. రోలుగుంట.. చీడికాడ మండలాల పరిధిలోని 431 గ్రామాల్ని.. 2,280.19 చదరపు కిలోమీటర్ల భూమిని దీని కిందకు తీసుకొచ్చింది.

విశాఖ జిల్లాలో మొత్తం 43 మండలాలు ఉంటే.. అందులో 19 మండలాలు ఇప్పటికే దీని పరిధిలో ఉండగా.. పదకొండు మండలాలు ఏజెన్సీలో ఉన్నాయి. వీటిని మినహాయించి మిగిలిన 13 మండలాల్లోని అన్ని గ్రామాల్ని వీఎంఆర్డీఏలో విలీనం చేశారు. అంతేకాదు.. విశాఖ రూపును మరింత మార్చేందుకు మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

బీచ్ కారిడార్ తో పాటు.. భోగాపురం విమానాశ్రయం.. పోలవరం నుంచి గోదావరి జలాలను పైపులైన్ ద్వారా విశాఖకు తరలించే అంశంపైనా మరింత ఫోకస్ పెట్టాలన్నారు. వీటి తర్వాత మెట్రో ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని.. విశాఖ నుంచి భీమిలి వరకున్న బీచ్ రోడ్డు విస్తరణ చేపట్టాలన్నారు. భీమిలి నుంచి భోగాపురం వరకు రోడ్డునిర్మాణంతో పాటు భూసేకరణకు కోసం రూ.1167 కోట్లు ఖర్చు అవుతుందన్న లెక్కలు వేసిన సర్కారు.. రానున్న 30 ఏళ్లలో విశాఖ నీటి అవసరాలు తీర్చేలా పైపులైను ప్రణాళికను రూపొందించాలని సీఎం జగన్ ఆదేశాలుజారీ చేశారు. మొత్తంగా విశాఖ రూపురేఖల్ని మార్చేసే యోచనలోజగన్ ఉన్న విషయం తాజా నిర్ణయాలతో స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.

This post was last modified on March 24, 2021 3:29 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

6 mins ago

గోదావరి తీరంలో ‘గ్యాంగ్’ సమరం

https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…

2 hours ago

జ‌గ‌న్ అతి విశ్వాసం.. గెలిపిస్తుందా?

విశ్వాసం ఉండడం త‌ప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు.…

2 hours ago

వాలెంటైన్ – ఫైటర్ కంటే ఇదే నయం

చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…

4 hours ago

జగన్ బ్యాండేజీ తీసేశాడహో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…

4 hours ago

సుకుమార్ సుహాస్ ఇద్దరూ సేఫ్

యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…

5 hours ago