Political News

తాడిపత్రిని కేస్ స్టడీగా తీసుకుంటాడా ?

మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ రాష్ట్రమంతా తుడిచిపెట్టుకుపోయింది. మంచి బలమైన క్యాడర్ ఉన్న టీడీపీకి ఇలాంటి పరిస్ధితి వస్తుందని ఎవరు ఊహించుండరు. లీడర్లు ఎంతమంది పోయినా పర్వాలేదు, క్యాడర్ మాత్రం పార్టీతోనే ఉందని చంద్రబాబు చాలాసార్లే చెప్పుంటారు. అలాంటి క్యాడర్ ఇప్పుడు పార్టీతోనే ఉందా లేదా అనే అనుమనాలు పెరిగిపోతున్నాయి.

75 మున్సిపాలిటిలకు ఎన్నికలు జరిగితే 74 చోట్ల వైసీపీ స్వీప్ చేసేసింది. 98 శాతం మున్సిపాలిటిల్లో కనీసం సగం వార్డులను కూడా గెలుచుకోలేదు. ఇక 11 కార్పొరేషన్ల ఫలితాలు వస్తే నూరుశాతం వైసీపీనే గెలిచింది. మైదుకూరులో కూడా గట్టిపోటి ఇచ్చిందనే చెప్పినా చివరకు ఆ మున్సిపాలిటి అధికారపార్టీ ఖాతాలోనే పడిపోయింది. ఇంతటి ప్రభంజనంలో కూడా ఒకే ఒక్క మున్సిపాలిటి తాడిపత్రిలో మాత్రం టీడీపీ గెలిచింది.

ఇదే అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. బహుశా చంద్రబాబుకు కూడా ఆశ్చర్యమేసుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఏదో గాలివాటున తాడిపత్రిలో టీడీపీ గెలవలేదు. నిజానికి ఇక్కడ టీడీపీ గెలుపు అనేకన్నా జేసీ సోదరుల వ్యక్తిగత విజయమనే చెప్పాలి. మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా పోటీచేశారు. ఒకపుడు కౌన్సిలర్ గాను తర్వాత ఛైర్మన్ గా ప్రభాకర్ పనిచేశారు.

ఛైర్మన్ గా ఉన్నపుడు ప్రభాకర్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేశారని, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని బాగా అమలు చేశారని పేరు. సరే చరిత్రను వదిలేసినా ఇపుడు ప్రభాకర్ కౌన్సిలర్ గా పోటీ చేసిన కారణంగా మొత్తం జేసీల మద్దతుదారులు+పార్టీ క్యాడర్ రంగంలోకి దిగింది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాటం చేశారందరు. దాని ఫలితంగానే 36 వార్డుల మున్సిపాలిటిలో 18 వార్డుల్లో టీడీపీ లేదా జేసీ వర్గం గెలిచింది.

మొదటినుండి సీపీఐ, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వారు కూడా జేసీ వర్గంతోనే ఉన్న కారణంగా వాళ్ళు గెలిచిన తర్వాత జేసీకి మద్దతుగానే నిలబడ్డారు. అయితే ఇక్కడ గమనించాల్సినది ఏమంటే తాడిపత్రిలో కూడా వైసీపీ జెండా ఎగరేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకునుంటే ప్రభాకర్ ఛైర్మన్ అయ్యేవారు కాదు. ఏదో పద్దతిలో కౌన్సిలర్లను మాయచేసో లేదా బెదిరించో వైసీపీలోకి లాక్కునే వారే. అది కుదరకపోతే కనీసం ఛైర్మన్ ఎన్నిక సమయంలో జేసీ వర్గంలో కొందరిని గైర్హాజరు చేసున్నా వైసీపీ గెలిచేదే.

అయితే ఆపని చేయాలని జగన్ అనుకోలేదు. సంఖ్యాపరంగా టీడీపీకి మెజారిటి ఉంది కాబట్టి ఛైర్మన్ పదవిని ఆపార్టీకే వదిలేయాలని జగన్ అనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాకరే చెప్పటం విశేషం. తాను ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నానంటే అందుకు జగన్ కట్టుబడిన నైతిక విలువలే కారణమని ప్రభాకర్ చెప్పారు. మరి తాడిపత్రిలో ఉన్నదేమిటి ? మిగిలిన మున్సిపాలిటిల్లో లేనిదేమిటి ? అనే విషయమై చంద్రబాబు కేసు స్టడీ చేస్తారా ?

This post was last modified on March 24, 2021 3:27 pm

Share
Show comments

Recent Posts

ఫ‌రియా అబ్దుల్లా తండ్రి అలా… త‌ల్లి ఇలా

జాతిర‌త్నాలు సినిమాతో క‌థానాయిక‌గా చాలా మంచి పేరు సంపాదించింది హైద‌రాబాద్ అమ్మాయి ఫ‌రియా అబ్దుల్లా. లోక‌ల్ హీరోయిన్ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం…

3 hours ago

రవిబాబు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కానీ

మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…

5 hours ago

క‌న్నీళ్ల‌తో ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్

ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్త‌రాది అమ్మాయి పాయ‌ల్ రాజ్‌పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయ‌ల్…

6 hours ago

చిరంజీవిని వాడుతున్న జెట్లీ సింహం

ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…

7 hours ago

దురంధర్ కాంబో రిపీట్ కానుందా

ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…

8 hours ago

వంద బరువులు మోస్తున్న నాగార్జున

అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు…

10 hours ago