Political News

తాడిపత్రిని కేస్ స్టడీగా తీసుకుంటాడా ?

మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ రాష్ట్రమంతా తుడిచిపెట్టుకుపోయింది. మంచి బలమైన క్యాడర్ ఉన్న టీడీపీకి ఇలాంటి పరిస్ధితి వస్తుందని ఎవరు ఊహించుండరు. లీడర్లు ఎంతమంది పోయినా పర్వాలేదు, క్యాడర్ మాత్రం పార్టీతోనే ఉందని చంద్రబాబు చాలాసార్లే చెప్పుంటారు. అలాంటి క్యాడర్ ఇప్పుడు పార్టీతోనే ఉందా లేదా అనే అనుమనాలు పెరిగిపోతున్నాయి.

75 మున్సిపాలిటిలకు ఎన్నికలు జరిగితే 74 చోట్ల వైసీపీ స్వీప్ చేసేసింది. 98 శాతం మున్సిపాలిటిల్లో కనీసం సగం వార్డులను కూడా గెలుచుకోలేదు. ఇక 11 కార్పొరేషన్ల ఫలితాలు వస్తే నూరుశాతం వైసీపీనే గెలిచింది. మైదుకూరులో కూడా గట్టిపోటి ఇచ్చిందనే చెప్పినా చివరకు ఆ మున్సిపాలిటి అధికారపార్టీ ఖాతాలోనే పడిపోయింది. ఇంతటి ప్రభంజనంలో కూడా ఒకే ఒక్క మున్సిపాలిటి తాడిపత్రిలో మాత్రం టీడీపీ గెలిచింది.

ఇదే అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. బహుశా చంద్రబాబుకు కూడా ఆశ్చర్యమేసుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఏదో గాలివాటున తాడిపత్రిలో టీడీపీ గెలవలేదు. నిజానికి ఇక్కడ టీడీపీ గెలుపు అనేకన్నా జేసీ సోదరుల వ్యక్తిగత విజయమనే చెప్పాలి. మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా పోటీచేశారు. ఒకపుడు కౌన్సిలర్ గాను తర్వాత ఛైర్మన్ గా ప్రభాకర్ పనిచేశారు.

ఛైర్మన్ గా ఉన్నపుడు ప్రభాకర్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేశారని, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని బాగా అమలు చేశారని పేరు. సరే చరిత్రను వదిలేసినా ఇపుడు ప్రభాకర్ కౌన్సిలర్ గా పోటీ చేసిన కారణంగా మొత్తం జేసీల మద్దతుదారులు+పార్టీ క్యాడర్ రంగంలోకి దిగింది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాటం చేశారందరు. దాని ఫలితంగానే 36 వార్డుల మున్సిపాలిటిలో 18 వార్డుల్లో టీడీపీ లేదా జేసీ వర్గం గెలిచింది.

మొదటినుండి సీపీఐ, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వారు కూడా జేసీ వర్గంతోనే ఉన్న కారణంగా వాళ్ళు గెలిచిన తర్వాత జేసీకి మద్దతుగానే నిలబడ్డారు. అయితే ఇక్కడ గమనించాల్సినది ఏమంటే తాడిపత్రిలో కూడా వైసీపీ జెండా ఎగరేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకునుంటే ప్రభాకర్ ఛైర్మన్ అయ్యేవారు కాదు. ఏదో పద్దతిలో కౌన్సిలర్లను మాయచేసో లేదా బెదిరించో వైసీపీలోకి లాక్కునే వారే. అది కుదరకపోతే కనీసం ఛైర్మన్ ఎన్నిక సమయంలో జేసీ వర్గంలో కొందరిని గైర్హాజరు చేసున్నా వైసీపీ గెలిచేదే.

అయితే ఆపని చేయాలని జగన్ అనుకోలేదు. సంఖ్యాపరంగా టీడీపీకి మెజారిటి ఉంది కాబట్టి ఛైర్మన్ పదవిని ఆపార్టీకే వదిలేయాలని జగన్ అనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాకరే చెప్పటం విశేషం. తాను ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నానంటే అందుకు జగన్ కట్టుబడిన నైతిక విలువలే కారణమని ప్రభాకర్ చెప్పారు. మరి తాడిపత్రిలో ఉన్నదేమిటి ? మిగిలిన మున్సిపాలిటిల్లో లేనిదేమిటి ? అనే విషయమై చంద్రబాబు కేసు స్టడీ చేస్తారా ?

Satya

Recent Posts

బోల్డ్ వివాదంలో బోలెడు ప్రశ్నలు

పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర, దాన్ని డిజైన్ చేసిన విధానం గురించి సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది.…

2 hours ago

మోపిదేవికి మోక్షం ఎప్పుడు… ?

వైసిపి నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన మాజీమంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పరిస్థితి అగమ్య గోచరంగా…

5 hours ago

నా కుప్పం.. నేనే చూసుకుంటా: చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో…

7 hours ago

టికెట్ రేట్లు కాస్త ఆలోచించండి సారూ

పెద్ది వీకెండ్ ఘనంగా పూర్తి చేసుకుంది. టాక్స్, రివ్యూస్, కాంట్రావర్సీ సంగతి ఎలా ఉన్నా జనం థియేటర్లకు పోటెత్తిన మాట…

8 hours ago

రామ‌చంద్రా.. ఈ కామెంట్లు ఎవ‌రికోసం?

అంద‌రూ స‌వాళ్లు రువ్వుతున్నారు.. తాను మాత్రం త‌క్కువ తిన్నానా.. అని అనుకున్నారో ఏమో.. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు.. ఆస‌క్తిక‌ర…

8 hours ago

బాలయ్య పుట్టినరోజుకి ఇన్నేసి కానుకలా

ఇంకో మూడు రోజుల్లో జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు రానుంది. ఈసారి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు రెడీ…

8 hours ago