తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రావటం సందిగ్దంలో పడిందా ? మొన్నటి వరకు వెల్లడైన సర్వే నివేదికలన్నీ డీఎంకేనే అధికారంలోకి వచ్చేస్తోందని చెప్పిన విషయం తెలిసిందే. మరలాంటపుడు డీఎంకే చీఫ్ స్టాలిన్ సెంటిమెంటు అస్త్రాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు ? అన్నీడీఎంకే చీఫ్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరును పదే పదే ఎందుకు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు ? అన్నదే ఇపుడు అర్ధం కావటంలేదు.
రాజకీయాల్లో డీఎంకే-అన్నీడీఎంకేలు బద్ధ విరోధులన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది స్టాలన్ తన ప్రచారంలో జయలలిత పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. విషయం ఏమిటంటే జయ మరణాన్ని తనకు అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. దాదాపు నెలన్నర రోజులు ఆసుపత్రిలో ఉన్న జయలలిత మరణించిన విషయం తెలిసిందే. అయితే జయ మరణంపై అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా అనేక మందిలో చాలా అనుమానాలున్నాయి.
అంటే జయ మరణం అనుమానాస్పదమనే చెప్పాలి. దీనిపై హైకోర్టులో పెద్ద విచారణ కూడా జరిగింది. ఇప్పుడు ఇదే అంశాన్ని స్టాలిన్ వ్యూహాత్మకంగా ప్రస్తావిస్తున్నారు. డీఎంకే అధికారంలోకి రాగానే జయ మరణంపై విచారణ జరిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుండి మరణించారని డాక్టర్లు ప్రకటించేంత వరకు ఏమి జరిగిందనే విషయాలపై సమగ్రంగా విచారణ జరిపిస్తామంటు స్టాలిన్ పదే పదే చెబుతున్నారు.
తన ఎన్నికల ప్రచారంలో జయ మరణాన్ని, విచారణను, అనుమానాలను వాడుకుంటున్నారంటేనే జనాల్లో సెంటిమెంటును రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమైపోతోంది. జయ మీదున్న అభిమానాన్ని, ఆదరణను తనకు అనుకూలంగా మలచుకునేందుకు డీఎంకే చీఫ్ చేయని ప్రయత్నాలు లేవు. ఒకవైపు జనాలకు అన్నీ ఉచితంగా ఇస్తానని చెబుతునే, మరోవైపు హిందుత్వ రాజకీయాలు కూడా మొదలుపెట్టేసిన స్టాలిన్ తాజాగా జయ మరణాన్ని కూడా వాడేసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.
This post was last modified on March 22, 2021 10:22 am
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…