Political News

వైసీపీలో ఆ న‌లుగురికి ప‌ద‌వులు ఫిక్స్ చేసిన జ‌గ‌న్ ?

ఏపీలో సీఎం జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న‌కు ఏ మాత్రం ఎదురు లేకుండా పోతోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌డుతోన్న సంక్షేమ ప‌థ‌కాల ప‌ట్ల ప్ర‌జ‌లు నూటికి నూరు శాతం సంతృప్తిగా ఉన్నార‌న్న‌ది స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలే ఫ్రూవ్ చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే మండ‌ల పరిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లు, తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగే ఉప ఎన్నిక త‌ర్వాత జ‌గ‌న్ కొద్ది నెల‌ల టైం తీసుకుని త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు. జ‌గ‌న్ కేబినెట్లో 90 శాతం మంది మంత్రుల‌ను రీ ప్లేస్ చేస్తాన‌ని ముందే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే మ‌రో నాలుగైదు నెల‌ల్లో కేబినెట్లో మార్పులు, చేర్పులు ఉండ‌డంతో ఎవ‌రు కేబినెట్లో ఉంటారు ? ఎవ‌రు కొత్తగా వ‌స్తారు ? ఎవ‌రు అవుట్ అవుతారు అన్న దానిపై ఊహాగానాలు, చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

మంత్రి ప‌ద‌వి ఆశించే వారి లిస్ట్ చూస్తే చాంతాడంత ఉంది. వీరంద‌రిని మంత్రి ప‌ద‌వుల‌తో సంతృప్తి ప‌ర‌చ‌డం జ‌గ‌న్ వ‌ల్ల కూడా కాదు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల‌ను ఇత‌ర ప‌ద‌వుల‌తో సంతృప్తి ప‌ర‌చాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేస్తున్నారు. జ‌గ‌న్ సీఎం అయిన తొలి నాళ్ల‌లోనే వీటిని ఏర్పాటు చేయాల‌ని అనుకున్నా సాధ్యం కాలేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ప్రాంతీయాభివృద్ధి మండ‌ళ్ల ఏర్పాటు మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తోంది. ఉత్తరాంధ్రలో విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల‌తో ఉత్త‌రాంధ్ర ప్రాంతీయాభివృద్ధి మండ‌లి ఏర్పాటు కానుంది.

ఇక గోదావ‌రి ప్రాంతీయాభివృద్ధి మండ‌లిలో కాకినాడ కేంద్రంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉంటాయి. ఇక రాజ‌ధాని జిల్లా టూరు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలు అమ‌రావ‌తి ప్రాంతీయాభివృద్ధి మండ‌లిలో ఉంటాయి. ఇక కడప కేంద్రంగా చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో సీమ ప్రాంతీయాభివృద్ధి మండ‌లి ఏర్పాటు కానుంది. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, ఇత‌ర కార‌ణాల‌తో మంత్రి ప‌ద‌వులు లేని వారిని ప్రాంతీయాభివృద్ధి మండ‌ళ్ల‌కు చైర్మ‌న్లుగా చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. వైఎస్ సీఎం అయిన‌ప్పుడు కూడా గ‌తంలో ఇలాగే చేసి కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు.

ఇక ఈ ప్రాంతీయాభివృద్ధి మండ‌ళ్ల‌కు ఒక చైర్మ‌న్‌తో పాటు కొంద‌రు స‌భ్యులు ఉంటారు. ఉత్త‌రాంధ్ర‌కు విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, గోదావ‌రికి పెన‌మ‌లూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి, అమ‌రావ‌తికి లేళ్ల అప్పిరెడ్డి, సీమ మండ‌లికి చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిల‌ను చైర్మ‌న్లుగా చేయాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. అమ‌రావ‌తి మండ‌లికి మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పేరు కూడా విన‌ప‌డుతోంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు, మంత్రి మండ‌లి మార్చిన త‌ర్వాత వీరికి ఈ ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తార‌ని అంటున్నారు.

This post was last modified on March 21, 2021 7:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

18 minutes ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

26 minutes ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

3 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

4 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

6 hours ago