ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ నడుస్తోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక అనివార్యమైనప్పటి నుండి టీడీనీ వ్యూహకర్త రాబిన్ శర్మ పైన ఎక్కువగా చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరపున పని చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అఖండ విజయంలో ప్రశాంత్ కు కూడా క్రెడిట్ దక్కింది. నిజానికి వైసీపీకి ఇంతస్ధాయిలో అఖండ విజయం వచ్చింది ప్రశాంత్ కాదు. చంద్రబాబునాయుడి పరిపాలన వల్లే జగన్ కు అన్ని సీట్లు వచ్చింది.
సరే సక్సెస్ కు వాటాదారులు చాలామందే ఉంటారు కదా. అలాగే ప్రశాంత్ కు కూడా క్రెడిట్ దక్కేసింది. జగన్ లో దమ్ము లేకపోతే వందమంది ప్రశాంత్ లైనా ఏమీ చేయలేరు. సరే ఇక ప్రస్తుతానికి వస్తే ఒకపుడు ప్రశాంత్ టీములో పనిచేసిన రాబిన్ విడిపోయి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయనతోనే చంద్రబాబు కాంట్రాక్టు కుదుర్చుకుని గెలుపు తీరాలకు చేర్చే బాధ్యత అప్పగించారు.
రాబిన్ ఇంతకాలంగా పార్టీ బలోపేతానికి ఏమి సలహాలిచ్చారో ఎవరికీ తెలీదు. అయితే తొందరలో జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో రాబిన్ వ్యూహాలేమిటో తేలిపోతుంది. నిజానికి ఉపఎన్నికలో గెలుపన్నది వైసీపీ నల్లేరుమీద బండినడకే. కాకపోతే టీడీపీ ఎంత గట్టిగా పోరాడింది అనేదే గమనించాలి. ఆ పోరాటంలో పార్టీ బలమెంత ? రాబిన్ వ్యూహాలేమిటి ? అనేదే కీలకమవుతుంది.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన 4.9 లక్షల ఓట్లొస్తే అదే పదివేలు. నిజానికి టీడీపీ పరువు నిలబడితే ఇందులో వ్యూహకర్త పనితనం కూడా ఉందని అనుకోవాలి. లేకపోతే ఎవరు కూడా చేసేదేమీ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు+టీడీపీ నేతలు నికార్సయిన పోరాటాలు చేస్తేనే జనాల అభిమానం పొందగలరు కానీ రాబిన్ శర్మ లాంటి వ్యూహకర్తల వల్లే జనాభిప్రాయం పొందటం సాధ్యంకాదు.
This post was last modified on March 21, 2021 3:28 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…