ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ నడుస్తోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక అనివార్యమైనప్పటి నుండి టీడీనీ వ్యూహకర్త రాబిన్ శర్మ పైన ఎక్కువగా చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరపున పని చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అఖండ విజయంలో ప్రశాంత్ కు కూడా క్రెడిట్ దక్కింది. నిజానికి వైసీపీకి ఇంతస్ధాయిలో అఖండ విజయం వచ్చింది ప్రశాంత్ కాదు. చంద్రబాబునాయుడి పరిపాలన వల్లే జగన్ కు అన్ని సీట్లు వచ్చింది.
సరే సక్సెస్ కు వాటాదారులు చాలామందే ఉంటారు కదా. అలాగే ప్రశాంత్ కు కూడా క్రెడిట్ దక్కేసింది. జగన్ లో దమ్ము లేకపోతే వందమంది ప్రశాంత్ లైనా ఏమీ చేయలేరు. సరే ఇక ప్రస్తుతానికి వస్తే ఒకపుడు ప్రశాంత్ టీములో పనిచేసిన రాబిన్ విడిపోయి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయనతోనే చంద్రబాబు కాంట్రాక్టు కుదుర్చుకుని గెలుపు తీరాలకు చేర్చే బాధ్యత అప్పగించారు.
రాబిన్ ఇంతకాలంగా పార్టీ బలోపేతానికి ఏమి సలహాలిచ్చారో ఎవరికీ తెలీదు. అయితే తొందరలో జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో రాబిన్ వ్యూహాలేమిటో తేలిపోతుంది. నిజానికి ఉపఎన్నికలో గెలుపన్నది వైసీపీ నల్లేరుమీద బండినడకే. కాకపోతే టీడీపీ ఎంత గట్టిగా పోరాడింది అనేదే గమనించాలి. ఆ పోరాటంలో పార్టీ బలమెంత ? రాబిన్ వ్యూహాలేమిటి ? అనేదే కీలకమవుతుంది.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన 4.9 లక్షల ఓట్లొస్తే అదే పదివేలు. నిజానికి టీడీపీ పరువు నిలబడితే ఇందులో వ్యూహకర్త పనితనం కూడా ఉందని అనుకోవాలి. లేకపోతే ఎవరు కూడా చేసేదేమీ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు+టీడీపీ నేతలు నికార్సయిన పోరాటాలు చేస్తేనే జనాల అభిమానం పొందగలరు కానీ రాబిన్ శర్మ లాంటి వ్యూహకర్తల వల్లే జనాభిప్రాయం పొందటం సాధ్యంకాదు.
This post was last modified on March 21, 2021 3:28 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…