ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ నడుస్తోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక అనివార్యమైనప్పటి నుండి టీడీనీ వ్యూహకర్త రాబిన్ శర్మ పైన ఎక్కువగా చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరపున పని చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అఖండ విజయంలో ప్రశాంత్ కు కూడా క్రెడిట్ దక్కింది. నిజానికి వైసీపీకి ఇంతస్ధాయిలో అఖండ విజయం వచ్చింది ప్రశాంత్ కాదు. చంద్రబాబునాయుడి పరిపాలన వల్లే జగన్ కు అన్ని సీట్లు వచ్చింది.
సరే సక్సెస్ కు వాటాదారులు చాలామందే ఉంటారు కదా. అలాగే ప్రశాంత్ కు కూడా క్రెడిట్ దక్కేసింది. జగన్ లో దమ్ము లేకపోతే వందమంది ప్రశాంత్ లైనా ఏమీ చేయలేరు. సరే ఇక ప్రస్తుతానికి వస్తే ఒకపుడు ప్రశాంత్ టీములో పనిచేసిన రాబిన్ విడిపోయి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయనతోనే చంద్రబాబు కాంట్రాక్టు కుదుర్చుకుని గెలుపు తీరాలకు చేర్చే బాధ్యత అప్పగించారు.
రాబిన్ ఇంతకాలంగా పార్టీ బలోపేతానికి ఏమి సలహాలిచ్చారో ఎవరికీ తెలీదు. అయితే తొందరలో జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో రాబిన్ వ్యూహాలేమిటో తేలిపోతుంది. నిజానికి ఉపఎన్నికలో గెలుపన్నది వైసీపీ నల్లేరుమీద బండినడకే. కాకపోతే టీడీపీ ఎంత గట్టిగా పోరాడింది అనేదే గమనించాలి. ఆ పోరాటంలో పార్టీ బలమెంత ? రాబిన్ వ్యూహాలేమిటి ? అనేదే కీలకమవుతుంది.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన 4.9 లక్షల ఓట్లొస్తే అదే పదివేలు. నిజానికి టీడీపీ పరువు నిలబడితే ఇందులో వ్యూహకర్త పనితనం కూడా ఉందని అనుకోవాలి. లేకపోతే ఎవరు కూడా చేసేదేమీ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు+టీడీపీ నేతలు నికార్సయిన పోరాటాలు చేస్తేనే జనాల అభిమానం పొందగలరు కానీ రాబిన్ శర్మ లాంటి వ్యూహకర్తల వల్లే జనాభిప్రాయం పొందటం సాధ్యంకాదు.
This post was last modified on March 21, 2021 3:28 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…