Political News

అభ్యర్ధులను సీనియర్లే పట్టించుకోలేదా ?

ఇపుడిదే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. గెలిచేస్తాం..పొడిచేస్తాం…అంటు మున్సిపల్ ఎన్నికలకు ముందు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చాల హడావుడే చేశారు. తీరా చూస్తే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏమిటో తేలిపోయింది. 98 డివిజన్లలో కమలంపార్టీ గెలిచింది కేవలం ఒక్కటంటే ఒక్క డివిజన్లో మాత్రమే. ఎంతో నమ్మకం, ఆశలు పెట్టుకున్న విశాఖలోనే పార్టీకి ఎందుకింత దీనస్ధితి వచ్చింది ?

ఎందుకంటే పార్టీలో సీనియర్లే సొంత అభ్యర్ధులను పట్టించుకోలేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ నుండి రెండుసార్లు విశాఖపట్నం ఎంపిగా గెలిచి కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన దగ్గుబాటి పురందేశ్వరి ఎక్కడా కనబడలేదట. ప్రస్తుతం పురందేశ్వరరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయినా అభ్యర్ధుల తరపున ఆమె ప్రచారం చేయలేదట.

అలాగే ఒకసారి ఎంపిగా గెలిచిన కంభంపాటి హరిబాబు కూడా అడ్రస్ కనబడలేదు. ఈయన గతంలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేశారు. వీళ్ళిద్దరే కాకుండా సీనియర్ నేతలు చాలామందే ఉన్నా ఎక్కువమంది పార్టీ అభ్యర్ధుల కోసం ప్రచారం చేయలేదట. సొంతపార్టీ అభ్యర్ధుల కోసమే కష్టపడనివారు ఇక మిత్రపక్షం జనసేన అభ్యర్ధులను పట్టించుకుంటారా ?

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ సీనియర్లు అభ్యర్ధుల తరపున ఎందుకు ప్రచారం చేయలేదో ఎవరికీ అర్ధం కావటంలేదు. అంటే సీనియర్లందరు పనిచేసేస్తే జీవీఎంసీ పీఠాన్ని బీజేపీ గెలిచుండేదని కాదు. కానీ కనీసం గౌరవప్రదంగా కొన్ని డివిజన్లలో అయినా గెలిచేది కదాని పార్టీలో చర్చ జరుగుతోంది.

This post was last modified on March 21, 2021 3:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

5 minutes ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

3 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

4 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

6 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

6 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

6 hours ago