Political News

అభ్యర్ధులను సీనియర్లే పట్టించుకోలేదా ?

ఇపుడిదే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. గెలిచేస్తాం..పొడిచేస్తాం…అంటు మున్సిపల్ ఎన్నికలకు ముందు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చాల హడావుడే చేశారు. తీరా చూస్తే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏమిటో తేలిపోయింది. 98 డివిజన్లలో కమలంపార్టీ గెలిచింది కేవలం ఒక్కటంటే ఒక్క డివిజన్లో మాత్రమే. ఎంతో నమ్మకం, ఆశలు పెట్టుకున్న విశాఖలోనే పార్టీకి ఎందుకింత దీనస్ధితి వచ్చింది ?

ఎందుకంటే పార్టీలో సీనియర్లే సొంత అభ్యర్ధులను పట్టించుకోలేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ నుండి రెండుసార్లు విశాఖపట్నం ఎంపిగా గెలిచి కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన దగ్గుబాటి పురందేశ్వరి ఎక్కడా కనబడలేదట. ప్రస్తుతం పురందేశ్వరరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయినా అభ్యర్ధుల తరపున ఆమె ప్రచారం చేయలేదట.

అలాగే ఒకసారి ఎంపిగా గెలిచిన కంభంపాటి హరిబాబు కూడా అడ్రస్ కనబడలేదు. ఈయన గతంలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేశారు. వీళ్ళిద్దరే కాకుండా సీనియర్ నేతలు చాలామందే ఉన్నా ఎక్కువమంది పార్టీ అభ్యర్ధుల కోసం ప్రచారం చేయలేదట. సొంతపార్టీ అభ్యర్ధుల కోసమే కష్టపడనివారు ఇక మిత్రపక్షం జనసేన అభ్యర్ధులను పట్టించుకుంటారా ?

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ సీనియర్లు అభ్యర్ధుల తరపున ఎందుకు ప్రచారం చేయలేదో ఎవరికీ అర్ధం కావటంలేదు. అంటే సీనియర్లందరు పనిచేసేస్తే జీవీఎంసీ పీఠాన్ని బీజేపీ గెలిచుండేదని కాదు. కానీ కనీసం గౌరవప్రదంగా కొన్ని డివిజన్లలో అయినా గెలిచేది కదాని పార్టీలో చర్చ జరుగుతోంది.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

5 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

5 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

5 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

6 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

7 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

8 hours ago