Political News

ఈ ఆలోచ‌న‌ మ‌న‌కెందుకు రాలేదు… టీడీపీ అంత‌ర్మ‌థ‌నం!

చేతులు కాలిపోయిన త‌ర్వాత‌.. చిందులు వేసిన‌ట్టుగా ఉంది.. టీడీపీ నేత‌ల ప‌రిస్థితి. ప్ర‌జాస్వామ్యంలో వ్య‌క్తుల‌ను న‌మ్ముకునే క‌న్నా.. ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకుంటేనే పార్టీల‌కు మ‌నుగ‌డ ఉంటుంద‌నే విష‌యం కొత్తగా ఎవ‌రూ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ఈ విష‌యంలో అధికార ప‌క్షం వైసీపీ వైఖ‌రి ఒక‌విధంగా ఉంటే.. ఈ పార్టీని ఓవ‌ర్ టేక్ చేయాల‌ని భావిస్తున్న టీడీపీ మాత్రం మ‌రో పంథాను ఎంచుకుంది. ఇది.. రాజ‌కీయంగా స్పీడుకు బ్రేకులు వేస్తోంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

2019లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. అప్ప‌ట్లోనే పార్టీ పురోగ‌తిపై దృష్టి పెడ‌తామ‌ని సంక‌ల్పించిన‌ టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. కొన్నాళ్ల త‌ర్వాత‌.. ష‌రా మామూలే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు.. అదే స‌మయంలో పార్టీలో కొన్నాళ్ల కింద‌ట ప‌ద‌వులు పంచినా.. వాటిని వార‌సుల‌కు… సిఫార‌సు నేత‌ల‌కు మాత్ర‌మే కేటాయించారు. ఇది పార్టీలో ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారిపోయింది. ఇక‌, వైసీపీని తీసుకుంటే.. కింది స్థాయిలో సామాజిక వ‌ర్గాల వారీగా జ‌గ‌న్ చేస్తున్న సోష‌ల్ ఇంజ‌నీరింగ్ వ‌ర్క‌వుట్ అవుతోంది.

పార్టీ ప‌ద‌వులు, అధికారిక ప‌ద‌వులు, టికెట్ల విష‌యంలో అట్ట‌డుగు వ‌ర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు, అందునా.. అట్ట‌డుగు వ‌ర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తుండ‌డం.. ఒక విధ‌మైన జోష్ పెంచుతోంది. ఇక‌, పార్టీ వ్యూహాల విష‌యంలోనూ.. జ‌గ‌న్ త‌ర‌హా వ్యూహాల‌ను అనుస‌రించ‌డంలో టీడీపీ వెనుక‌బ‌డింది. కేవ‌లం మీడియాను న‌మ్ముకుని ముందుకు సాగుతోంద‌నే టీడీపీపై ఉన్న విమ‌ర్శ నేటికీ అలానే ఉంది. మీడియాలో నాలుగు వార్త‌లు రాగానే.. సంబ‌ర ప‌డి.. పార్టీ పుంజుకుంద‌నే భావ‌న టీడీపీలో వ్య‌క్త‌మ‌వుతోంది.

వాస్త‌వానికి ఏపీ ప్ర‌జ‌లు మీడియా ఆధారంగా తీర్పులు చెప్ప‌ర‌ని.. ఎన్నిక‌ల్లో ఫ‌లితాల‌ను ఇవ్వ‌ర‌ని.. 2019 ఎన్నిక‌ల్లోనే స్ప‌ష్ట‌మైంది. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా కొన్ని మీడియా వ‌ర్గాలు విస్తృత వ్య‌తిరేక ప్ర‌చారం చేసినా.. చంద్ర‌బాబుకు అనుకూలంగా రాసినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.. ఇక‌, ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా వ్యూహం సాగినా.. ఫ‌లితం ఏమైందో తెలుస్తూనే ఉంది. నిజానికి ఇలాంటి మీడియా మేనేజ్ మెంట్ ఒక‌ప్పుడు స‌క్సెస్ అయితే అయి ఉండొచ్చు.

కానీ, నేడు మారిన మాధ్య‌మాలు, సోష‌ల్ మీడియా ప్ర‌భావం.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌పై ప్ర‌జ‌ల‌కు పెరుగుతున్న ప‌ట్టు వంటి కార‌ణాల నేప‌థ్యంలో మూస విధానం నుంచి పార్టీలు బ‌య‌ట‌కు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే.. టీడీపీ ఆ త‌ర‌హా మార్పు అందిపుచ్చుకోలేక పోతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. పార్టీలో స‌మూల మార్పుల దిశ‌గా అడుగులు ప‌డితేనే పార్టీ అనుకున్న రేంజ్‌లో పుంజుకుంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు..

This post was last modified on March 19, 2021 9:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

12 minutes ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

12 hours ago