వేసే ప్రతి అడుగు అత్యంత వ్యూహాత్మకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న వైఎస్ షర్మిల.. మరోసారి తన ప్రత్యేకతను చాటారు. రాజకీయ పార్టీ ఏర్పాటు విషయం మొదలు.. ప్రతి అంశంలోనూ ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేయటమే కాదు.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆమె.. ఊహించని విధంగా స్పందించిన ఉదంతం తెలంగాణ సర్కారును ఇరుకున పడేలా చేసిందని చెప్పాలి. భైంసా అల్లర్ల నడుమ పెద్దగా ఫోకస్ కాని ఒక దారుణ ఉదంతాన్ని టైమ్లీగా తెర మీదకు తీసుకొచ్చారు షర్మిల.
నిర్మల్ జిల్లా భైంసాలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ లైంగిద దాడిపై ఆమె గళం విప్పారు. ఇప్పటివరకు ఈ అంశాన్ని బీజేపీ మాత్రమే ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పు పడుతోంది. నిందితుల్ని ప్రభుత్వం కాపాడుతుందని బీజేపీ నేతలు.. సానుభూతి పరులు ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఉదంతంపై టీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు పెద్దగా స్పందించింది లేదు.
ఇదిలా ఉంటే.. అనూహ్యంగా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు షర్మిల. నాలుగేళ్ల బాలికపై జరిగిన దాడి అమానుషమన్న ఆమె.. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. భైంసా ఉదంతం గురించి షర్మిల చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా చేశాయని చెప్పక తప్పదు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆమె.. తాజాగా ఈ అంశంపై రియాక్టు కావటం చూస్తే.. రానున్న రోజుల్లో ఈ అంశంపై మరింత సీరియస్ వ్యాఖ్యలు చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…