వేసే ప్రతి అడుగు అత్యంత వ్యూహాత్మకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న వైఎస్ షర్మిల.. మరోసారి తన ప్రత్యేకతను చాటారు. రాజకీయ పార్టీ ఏర్పాటు విషయం మొదలు.. ప్రతి అంశంలోనూ ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేయటమే కాదు.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆమె.. ఊహించని విధంగా స్పందించిన ఉదంతం తెలంగాణ సర్కారును ఇరుకున పడేలా చేసిందని చెప్పాలి. భైంసా అల్లర్ల నడుమ పెద్దగా ఫోకస్ కాని ఒక దారుణ ఉదంతాన్ని టైమ్లీగా తెర మీదకు తీసుకొచ్చారు షర్మిల.
నిర్మల్ జిల్లా భైంసాలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ లైంగిద దాడిపై ఆమె గళం విప్పారు. ఇప్పటివరకు ఈ అంశాన్ని బీజేపీ మాత్రమే ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పు పడుతోంది. నిందితుల్ని ప్రభుత్వం కాపాడుతుందని బీజేపీ నేతలు.. సానుభూతి పరులు ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఉదంతంపై టీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు పెద్దగా స్పందించింది లేదు.
ఇదిలా ఉంటే.. అనూహ్యంగా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు షర్మిల. నాలుగేళ్ల బాలికపై జరిగిన దాడి అమానుషమన్న ఆమె.. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. భైంసా ఉదంతం గురించి షర్మిల చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా చేశాయని చెప్పక తప్పదు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆమె.. తాజాగా ఈ అంశంపై రియాక్టు కావటం చూస్తే.. రానున్న రోజుల్లో ఈ అంశంపై మరింత సీరియస్ వ్యాఖ్యలు చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on March 18, 2021 1:13 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…