Political News

రామోజీ ఫిల్మ్ సిటీకి చేరిన వైసీపీ రాజకీయం

చీరాల ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడిగా అవ‌తారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ కృష్ణ‌మూర్తి త‌న రాజ‌కీయాల‌ను రామోజీ ఫిలిం సిటీకి మార్చారు. త‌న వ‌ర్గాన్ని అక్క‌డ క్యాంపు చేయించి జోరుగా రాజ‌కీయ చ‌క్రం తిప్పుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. క‌ర‌ణంలో రేగిన మునిసిప‌ల్ గుబులేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇటీవ‌ల చీరాల ముసినిపాలిటీలో క‌ర‌ణం.. వైసీపీ అధిష్టానం వ‌ద్ద లాబీయింగ్ చేసుకుని.. త‌న వ‌ర్గానికి బీఫారాలు ఇప్పించుకున్నారు. ఇక్క‌డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఉన్నా కూడా జిల్లాలో కొంద‌రు పార్టీ నేత‌ల‌ను త‌న పాత ప‌రిచ‌యంతో మ‌చ్చిక చేసుకున్న క‌ర‌ణం ఒక్క బీఫామ్ కూడా ఆమంచి వ‌ర్గానికి ద‌క్క‌కుండా చేశారు. ఈ క్ర‌మంలో మొత్తం 33 వార్డుల్లో త‌న వారిని నిల‌బెట్టారు. అయితే.. 18 చోట్ల మాత్ర‌మే క‌ర‌ణం వ‌ర్గం విజ‌యం సాధించింది.

ఇక‌, 14 చోట్ల మాజీ ఎమ్మెల్యే ఆమంచి వ‌ర్గం, 1 చోట టీడీపీ విజ‌యం సాధించింది. ఇక‌, ఇప్పుడు మునిసిప‌ల్ చైర్మ‌న్‌ ఎంపిక జ‌ర‌గ‌నుంది. అయితే.. అవ‌స‌ర‌మైన మెజారిటీ ఉన్న‌ప్ప‌టికీ.. త‌న వ‌ర్గం ఎక్క‌డ జారిపోతుందోన‌ని.. క‌ర‌ణం తీవ్ర‌స్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న హుటాహుటిన త‌న వ‌ర్గం కౌన్సెల‌ర్ల‌తో హైద‌రాబాద్ స‌మీపంలోని రామోజీ ఫిలిం సిటీలో క్యాంపు పెట్టారు. వాస్త‌వానికి ఇలాంటి రాజ‌కీయాలు ప్ర‌తిప‌క్షాలు చేస్తున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పుడు తాను వైసీపీకి మ‌ద్ద‌తు దారుడిన‌ని చెప్పుకొనే క‌ర‌ణం.. ఇలా చేయ‌డం అంద‌రినీ నివ్వెర ప‌రుస్తోంది.

పైగా .. ఆమంచి వ‌ర్గాన్ని ధీటుగా ఎదుర్కొన‌లేక చ‌తికిల ప‌డిన క‌ర‌ణం.. కేవ‌లం 18 స్థానాల్లో నే త‌న వ‌ర్గాన్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు వైసీపీ అధిష్టానం.. ఆమంచికి కూడా అనుకూలంగా ఉండ‌డం క‌ర‌ణానికి మ‌రింత ఇబ్బందిగా మారింది. ఆమంచి వ‌ర్గం రెబ‌ల్స్‌గా పోటీ చేస్తేనే ఏకంగా 14 వార్డులు ద‌క్కాయి. నిన్న‌టికి నిన్న జిల్లా మంత్రి బాలినేని మాట్లాడుతూ చీరాల‌లో 32 మంది కౌన్సెల‌ర్లు పార్టీ వారేన‌ని.. అధిష్టానం చెప్పిన‌ట్టుగానే అక్క‌డ చైర్మ‌న్‌, వైఎస్ చైర్మ‌న్ ఎంపిక ఉంటుంద‌ని చెప్ప‌డంతో క‌ర‌ణంతో పాటు ఆయ‌న వ‌ర్గంలో గుబులు మొద‌లైంది.

ఇండిపెండెంట్‌గా రెబ‌ల్స్‌ను దింపి 14 వార్డుల్లో గెలిచిన ఆమంచి వ‌ర్గంకు రెండున్న‌రేళ్లు చైర్మ‌న్ ప‌ద‌వి లేదా ముందుగా వైఎస్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చే ఆలోచ‌న‌లో అధిష్టానం ఉంది. అదే జ‌రిగితే చీరాల‌లో క‌ర‌ణంకు అవ‌మాన‌మే… ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న క్యాంపు రాజ‌కీయాల‌కు.. గూడు పుఠానీ పాలిటిక్స్‌కు తెర‌దీశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మునిసిప‌ల్ చైర్మ‌న్ ఎంపిక‌లో అంద‌రూ క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న కూడా క‌ర‌ణంను మ‌రింత‌గా కుదిపేస్తోంది. త‌న వ‌ర్గానికి ద‌క్క‌దేమో.. ఈ ప‌ద‌వి అంటూ.. ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. అందుకే బ‌లం ఉండి కూడా ఆయ‌న క్యాంప్ రాజ‌కీయాలు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

This post was last modified on March 16, 2021 4:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

16 minutes ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

2 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

4 hours ago