Political News

ఇప్పుడు కూడా ప్రజలదే తప్పట

తెలుగుదేశంపార్టీ నేతల తీరు ఏమాత్రం మారలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో కొద్ది రోజులు చంద్రబాబునాయుడుతో పాటు నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేసి ఓట్లేయించుకున్నారని, ఒక్క చాన్సని బతిమలాడుకుంట జనాలు మోసపోయి ఓట్లేశారని..ఇలా అర్ధంలేని మాటలు చాలా మాట్లాడారు. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి వైసీపీకి ఓట్లేసినందుకు జనాలనే శాపనార్ధాలు పెట్టారు.

సరే ఏదో ఓటమి బాధతో ఏదో మాట్లాడారులే అని అందరు సరిపెట్టుకున్నారు. అయితే తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతా అలాగే మాట్లాడుతున్నారు. అంటే తమ్ముళ్ళ ఆలోచన, మాటతీరులో ఏమాత్రం మార్పు రాలేదని అర్ధమైపోతోంది. జగన్ రూపంలో తమకు బలమైన ప్రత్యర్ధి ఉన్నాడని అంగీకరించటానికి చంద్రబాబు అండ్ కో ఏమాత్రం ఇష్టపడటం లేదు.

పార్టీ సినియర్ నేతలు వర్ల రామయ్య, దీపక్ రెడ్డి మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. వర్ల మీడియా సమావేశంలో మాట్లాడుతు అత్యంత బలమైన క్యాడర్ బలమున్న టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటం అంటే ప్రజలకే నష్టమన్నారు. టీడీపీకి ఇంత ఘోరమైన ఓటమి ఎదురవ్వటం పట్ల జనాలు సీరియస్ గా ఆలోచించాలన్నారు. టీడీపీ ఓడిపోతే ఆలోచించుకోవాల్సింది ఆ పార్టీ నేతలే కానీ జనాలు కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

అలాంటిది పార్టీ ఓడిపోతే జనాలు ఎందుకు ఆలోచించాలి ? ఇలాంటి మాటలు మాట్లాడే జనాల్లో పలుచనైపోయారు తమ్ముళ్ళు. ఇక దీపక్ మాట్లాడుతూ జనాలకు మూడు ప్రశ్నలంటూ మొదటుపెట్టారు. వైసీపీది వెన్నుపోటు రాజకీయమన్నారు. వైసీపీ వెన్నుపోటుతో ఎన్నికల్లో గెలిచిందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. వెన్నుపోటు రాజకీయాలంటే ఎవరు గుర్తుకొస్తారో అందరికీ తెలిసిందే.

మున్సిపల్ ఎన్నికల్లో జనాలు వైసీపీకి అఖండ గెలుపును ఎందుకు ఇచ్చారనే విషయంలో విశ్లేషించుకోవాలి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నిజాయితి విశ్లేషణలు మానేసి వైసీపీది వెన్నుపోటు గెలుపని చెప్పటమే విచిత్రంగా ఉంది. వైసీపీ గెలుపును అంగీకరించకుండా బురద చల్లుతున్నంత కాలం టీడీపీకి ఇలాంటి పరాభవాలే ఎదురవుతాయి.

This post was last modified on March 16, 2021 2:22 pm

Share
Show comments

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

17 minutes ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

26 minutes ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

3 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

4 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

6 hours ago