Political News

ఇప్పుడు కూడా ప్రజలదే తప్పట

తెలుగుదేశంపార్టీ నేతల తీరు ఏమాత్రం మారలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో కొద్ది రోజులు చంద్రబాబునాయుడుతో పాటు నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేసి ఓట్లేయించుకున్నారని, ఒక్క చాన్సని బతిమలాడుకుంట జనాలు మోసపోయి ఓట్లేశారని..ఇలా అర్ధంలేని మాటలు చాలా మాట్లాడారు. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి వైసీపీకి ఓట్లేసినందుకు జనాలనే శాపనార్ధాలు పెట్టారు.

సరే ఏదో ఓటమి బాధతో ఏదో మాట్లాడారులే అని అందరు సరిపెట్టుకున్నారు. అయితే తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతా అలాగే మాట్లాడుతున్నారు. అంటే తమ్ముళ్ళ ఆలోచన, మాటతీరులో ఏమాత్రం మార్పు రాలేదని అర్ధమైపోతోంది. జగన్ రూపంలో తమకు బలమైన ప్రత్యర్ధి ఉన్నాడని అంగీకరించటానికి చంద్రబాబు అండ్ కో ఏమాత్రం ఇష్టపడటం లేదు.

పార్టీ సినియర్ నేతలు వర్ల రామయ్య, దీపక్ రెడ్డి మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. వర్ల మీడియా సమావేశంలో మాట్లాడుతు అత్యంత బలమైన క్యాడర్ బలమున్న టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటం అంటే ప్రజలకే నష్టమన్నారు. టీడీపీకి ఇంత ఘోరమైన ఓటమి ఎదురవ్వటం పట్ల జనాలు సీరియస్ గా ఆలోచించాలన్నారు. టీడీపీ ఓడిపోతే ఆలోచించుకోవాల్సింది ఆ పార్టీ నేతలే కానీ జనాలు కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

అలాంటిది పార్టీ ఓడిపోతే జనాలు ఎందుకు ఆలోచించాలి ? ఇలాంటి మాటలు మాట్లాడే జనాల్లో పలుచనైపోయారు తమ్ముళ్ళు. ఇక దీపక్ మాట్లాడుతూ జనాలకు మూడు ప్రశ్నలంటూ మొదటుపెట్టారు. వైసీపీది వెన్నుపోటు రాజకీయమన్నారు. వైసీపీ వెన్నుపోటుతో ఎన్నికల్లో గెలిచిందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. వెన్నుపోటు రాజకీయాలంటే ఎవరు గుర్తుకొస్తారో అందరికీ తెలిసిందే.

మున్సిపల్ ఎన్నికల్లో జనాలు వైసీపీకి అఖండ గెలుపును ఎందుకు ఇచ్చారనే విషయంలో విశ్లేషించుకోవాలి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నిజాయితి విశ్లేషణలు మానేసి వైసీపీది వెన్నుపోటు గెలుపని చెప్పటమే విచిత్రంగా ఉంది. వైసీపీ గెలుపును అంగీకరించకుండా బురద చల్లుతున్నంత కాలం టీడీపీకి ఇలాంటి పరాభవాలే ఎదురవుతాయి.

This post was last modified on March 16, 2021 2:22 pm

Share
Show comments

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago