Political News

ఇప్పుడు కూడా ప్రజలదే తప్పట

తెలుగుదేశంపార్టీ నేతల తీరు ఏమాత్రం మారలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో కొద్ది రోజులు చంద్రబాబునాయుడుతో పాటు నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేసి ఓట్లేయించుకున్నారని, ఒక్క చాన్సని బతిమలాడుకుంట జనాలు మోసపోయి ఓట్లేశారని..ఇలా అర్ధంలేని మాటలు చాలా మాట్లాడారు. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి వైసీపీకి ఓట్లేసినందుకు జనాలనే శాపనార్ధాలు పెట్టారు.

సరే ఏదో ఓటమి బాధతో ఏదో మాట్లాడారులే అని అందరు సరిపెట్టుకున్నారు. అయితే తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతా అలాగే మాట్లాడుతున్నారు. అంటే తమ్ముళ్ళ ఆలోచన, మాటతీరులో ఏమాత్రం మార్పు రాలేదని అర్ధమైపోతోంది. జగన్ రూపంలో తమకు బలమైన ప్రత్యర్ధి ఉన్నాడని అంగీకరించటానికి చంద్రబాబు అండ్ కో ఏమాత్రం ఇష్టపడటం లేదు.

పార్టీ సినియర్ నేతలు వర్ల రామయ్య, దీపక్ రెడ్డి మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. వర్ల మీడియా సమావేశంలో మాట్లాడుతు అత్యంత బలమైన క్యాడర్ బలమున్న టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటం అంటే ప్రజలకే నష్టమన్నారు. టీడీపీకి ఇంత ఘోరమైన ఓటమి ఎదురవ్వటం పట్ల జనాలు సీరియస్ గా ఆలోచించాలన్నారు. టీడీపీ ఓడిపోతే ఆలోచించుకోవాల్సింది ఆ పార్టీ నేతలే కానీ జనాలు కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

అలాంటిది పార్టీ ఓడిపోతే జనాలు ఎందుకు ఆలోచించాలి ? ఇలాంటి మాటలు మాట్లాడే జనాల్లో పలుచనైపోయారు తమ్ముళ్ళు. ఇక దీపక్ మాట్లాడుతూ జనాలకు మూడు ప్రశ్నలంటూ మొదటుపెట్టారు. వైసీపీది వెన్నుపోటు రాజకీయమన్నారు. వైసీపీ వెన్నుపోటుతో ఎన్నికల్లో గెలిచిందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. వెన్నుపోటు రాజకీయాలంటే ఎవరు గుర్తుకొస్తారో అందరికీ తెలిసిందే.

మున్సిపల్ ఎన్నికల్లో జనాలు వైసీపీకి అఖండ గెలుపును ఎందుకు ఇచ్చారనే విషయంలో విశ్లేషించుకోవాలి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నిజాయితి విశ్లేషణలు మానేసి వైసీపీది వెన్నుపోటు గెలుపని చెప్పటమే విచిత్రంగా ఉంది. వైసీపీ గెలుపును అంగీకరించకుండా బురద చల్లుతున్నంత కాలం టీడీపీకి ఇలాంటి పరాభవాలే ఎదురవుతాయి.

This post was last modified on March 16, 2021 2:22 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

11 minutes ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

2 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

4 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

4 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

4 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

5 hours ago