Political News

ఆ ఎనిమిదిమంది ఎవరో ?

అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కుంభకోణంలో నోటీసులు అందుకోబోయే ఎనిమిది ఎవరనే విషయంలో అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడు హయాంలో అమరావతి భూకుంభకోణం జరిగిందని ప్రభుత్వం మొదటినుండి చెబుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అసైన్డ్ భూముల కుంభకోణానికి బాధ్యునిగా పేర్కొంటు సీఐడీ చంద్రబాబు మీద 120బి, 166, 167, 217 సెక్షన్ల కేసులు నమోదు చేసింది.

ఈనెల 23వ తేదీన విచారణకు హాజరవ్వాలంటూ చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ సీఐడి ఉన్నతాధికారులు నోటీసులు అందించారు. మరి నోటీసులను చంద్రబాబే స్వయంగా తీసుకున్నారా ? లేకపోతే ఇంకెవరైనా తీసుకున్నారా ? అన్నది తేలలేదు. అయితే నోటీసు ఇచ్చే సమయంలో చంద్రబాబు కుటుంబసభ్యులతో సీఐడీ అధికారులు మాట్లాడినట్లు సమాచారం. చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో మరో ఎనిమిది పేర్లు కూడా ఉన్నట్లు తెలిసింది.

అప్పటి భూవ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన మాజీమంత్రి పొంగూరు నారాయణకు కూడా సీఐడీ ప్రత్యేకంగా నోటీసు ఇచ్చింది. కాబట్టి చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో ఉన్న ఎనిమిదిమంది పేర్లలో నారాయణ పేరు లేదని స్పష్టమైపోయింది. మరి చంద్రబాబుకిచ్చిన నోటీసులో ఉన్న 8 పేర్లు ఎవరివి ? అన్నది సస్పెన్సుగా మారిపోయింది. చంద్రబాబుతో పాటు కుటుంబసభ్యుల పేర్లు కూడా ఉన్నాయా అనే విషయంలో అనుమానాలు పెరుగుతున్నాయి.

కుటుంసభ్యుల పేర్లే గనుక ఉంటే ఎవరికి వారికి విడివిడిగా నోటీసులు ఇస్తారు కానీ అందరికీ కలిపి చంద్రబాబుకే నోటీసులు ఇవ్వరని అంటున్నారు. మొత్తానికి నోటీసులో ఉన్న ఆ ఎనిమిదిమంది పేర్లపై జనాల్లో ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. కొద్ది సేపటిలోనే ఆ ఎనిమిదిమంది పేర్లు బయటపడే అవకాశాలున్నాయి. అప్పటి వరకు సస్పెన్సు కంటిన్యు అవ్వకతప్పేట్లు లేదు.

This post was last modified on March 16, 2021 10:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

59 minutes ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

2 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

4 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

5 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

6 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

7 hours ago