Political News

ఆ ఎనిమిదిమంది ఎవరో ?

అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కుంభకోణంలో నోటీసులు అందుకోబోయే ఎనిమిది ఎవరనే విషయంలో అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడు హయాంలో అమరావతి భూకుంభకోణం జరిగిందని ప్రభుత్వం మొదటినుండి చెబుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అసైన్డ్ భూముల కుంభకోణానికి బాధ్యునిగా పేర్కొంటు సీఐడీ చంద్రబాబు మీద 120బి, 166, 167, 217 సెక్షన్ల కేసులు నమోదు చేసింది.

ఈనెల 23వ తేదీన విచారణకు హాజరవ్వాలంటూ చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ సీఐడి ఉన్నతాధికారులు నోటీసులు అందించారు. మరి నోటీసులను చంద్రబాబే స్వయంగా తీసుకున్నారా ? లేకపోతే ఇంకెవరైనా తీసుకున్నారా ? అన్నది తేలలేదు. అయితే నోటీసు ఇచ్చే సమయంలో చంద్రబాబు కుటుంబసభ్యులతో సీఐడీ అధికారులు మాట్లాడినట్లు సమాచారం. చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో మరో ఎనిమిది పేర్లు కూడా ఉన్నట్లు తెలిసింది.

అప్పటి భూవ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన మాజీమంత్రి పొంగూరు నారాయణకు కూడా సీఐడీ ప్రత్యేకంగా నోటీసు ఇచ్చింది. కాబట్టి చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో ఉన్న ఎనిమిదిమంది పేర్లలో నారాయణ పేరు లేదని స్పష్టమైపోయింది. మరి చంద్రబాబుకిచ్చిన నోటీసులో ఉన్న 8 పేర్లు ఎవరివి ? అన్నది సస్పెన్సుగా మారిపోయింది. చంద్రబాబుతో పాటు కుటుంబసభ్యుల పేర్లు కూడా ఉన్నాయా అనే విషయంలో అనుమానాలు పెరుగుతున్నాయి.

కుటుంసభ్యుల పేర్లే గనుక ఉంటే ఎవరికి వారికి విడివిడిగా నోటీసులు ఇస్తారు కానీ అందరికీ కలిపి చంద్రబాబుకే నోటీసులు ఇవ్వరని అంటున్నారు. మొత్తానికి నోటీసులో ఉన్న ఆ ఎనిమిదిమంది పేర్లపై జనాల్లో ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. కొద్ది సేపటిలోనే ఆ ఎనిమిదిమంది పేర్లు బయటపడే అవకాశాలున్నాయి. అప్పటి వరకు సస్పెన్సు కంటిన్యు అవ్వకతప్పేట్లు లేదు.

This post was last modified on March 16, 2021 10:24 am

Share

Recent Posts

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

3 minutes ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

12 minutes ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

1 hour ago

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

2 hours ago

టాలీవుడ్ ఆగస్ట్ కిరీటం – ఎవరికో అవకాశం!

కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…

6 hours ago

మా పిల్లలను శిక్షించలేను… క్షమిస్తున్నాను

జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…

7 hours ago